DPRO Wanaparthy

DPRO Wanaparthy INFORMATION & PUBLIC RELATIONS DEPARTMENT

తేదీ : 09-05-2026           వనపర్తి జిల్లా           *రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి*           *ప్రజాప...
09/05/2026

తేదీ : 09-05-2026
వనపర్తి జిల్లా

*రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి*

*ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక" లో భాగంగా విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి*

జిల్లాలో రబీ సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లు, జనగణన సెల్ఫ్ ఎన్యుమరేషన్, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యాశాఖ వారోత్సవాలు సహా పలు అంశాలపై హైదరాబాదు నుంచి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో పాటు అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ హాజరయ్యారు.

సి ఎస్ మాట్లాడుతూ జనగణన 2027 లో భాగంగా సెల్ఫ్ ఏన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం చేసి అత్యధిక శాతం ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది అందులో పాల్గొని తమ వివరాలను నమోదు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాల వారీగా స్వీయ జనగణన పై సమీక్షించిన సిఎస్ ప్రభుత్వ అధికారులు సిబ్బంది అందరూ స్వీయ గణన చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి వేగవంతం చేయాలని, త్వరగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 100% పూర్తిచేసేలా చూడాలని ఆదేశించారు. రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మే 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యాశాఖ వారోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. వారోత్సవాల్లో ప్రతిరోజు నిర్దేశించిన విధంగా రోజువారి కార్యక్రమాలను చేపట్టి ప్రజాప్రతినిధులను అందులో భాగస్వామ్యం చేయాలని తెలియజేశారు.

వీసీ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రబీ సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజు 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు పడితే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా ధాన్యం నిల్వ చేయడానికి గొడౌన్లను అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రతిరోజు నివేదిక అందించాలని సూచించారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సమస్యలు ఏం లేకుండా చూడాలని ఆదేశించారు.

మే 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా విద్యాసంస్థల్లో పనుల శంకుస్థాపనలు, ఎస్ ఎస్ సి పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థుల ఉత్తీర్ణత కోసం ప్రత్యేక విద్య శిబిరాల నిర్వహణ, వర్క్ షాప్ ల ఏర్పాటు, జయశంకర్ బడిబాట కార్యక్రమం, పోషకుల సమావేశాలు, లైబ్రరీ డే, విద్యా వేడుకల కార్యక్రమాలు నిర్ణిత ప్రణాళిక ప్రకారం రోజువారి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యా శాఖలో చేపడుతున్న కార్యక్రమాలపై అన్ని గ్రామాల సర్పంచులకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అదేవిధంగా జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసి 100% పూర్తయ్యేలా ఏఈఓ లకు లక్ష్యాలను నిర్దేశించాలని సూచించారు. ఇందుకు సంబంధించి రోజువారి నివేదికను సమర్పించాలని వ్యవసాయ అధికారికి సూచించారు. జనగణన ప్రక్రియకు సంబంధించి, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

సమావేశంలో సిపిఓ హరికృష్ణ, డి సి ఎస్ ఓ కాశీ విశ్వనాథ్, డి ఎం ఆంజనేయులు, డీఏవో ఆంజనేయులు, డి డబ్ల్యు ఓ సుధారాణి, విద్యాశాఖ సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. Collector Wanaparthy
Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేదీ : 09-05-2026           వనపర్తి జిల్లా            2022-23 రబీ వేలం ధాన్యానికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం నిర్దేశి...
09/05/2026

తేదీ : 09-05-2026
వనపర్తి జిల్లా

2022-23 రబీ వేలం ధాన్యానికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసి, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.

శనివారం జిల్లా కలెక్టర్ 2022-23 రబీ సీజన్‌కు సంబంధించిన వేలం ధాన్యం అంశంపై అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తో కలిసి రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన 90 రోజుల గడువులోపు పెండింగ్ చెల్లింపులను పూర్తి చేయాలని మిల్లర్లకు సూచించారు.

ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 2022-23 రబీ వేలం ధాన్యానికి సంబంధించిన బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. పెండింగ్ చెల్లింపులు పూర్తిచేసిన మిల్లర్లను డిఫాల్టర్ జాబితా నుంచి తొలగించి, వారికి తిరిగి ప్రభుత్వ ధాన్యం కేటాయింపులు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, డి ఎం ఆంజనేయులు, రైస్ మిల్లర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. Collector Wanaparthy Dpro Wanaparthy DPRO Wanaparthy @

వనపర్తి జిల్లా గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు యూనియన్ బ్యాంక్ వరంఉచిత శిక్షణలతో స్వయం ఉపాధికి బాటలుశిక్షణ అనంతరం ముద్ర...
09/05/2026

వనపర్తి జిల్లా గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు యూనియన్ బ్యాంక్ వరం

ఉచిత శిక్షణలతో స్వయం ఉపాధికి బాటలు

శిక్షణ అనంతరం ముద్రా రుణాలకు సైతం సహాయం

వనపర్తి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ వెల్లడి

వనపర్తి, మే 9

వనపర్తి జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ముందుకొచ్చింది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా వివిధ వృత్తి ఆధారిత ఉచిత శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తూ యువతకు ఉపాధి దిశగా మార్గనిర్దేశం చేస్తోంది.
18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, కనీసం పదో తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ శిక్షణలకు దరఖాస్తు చేసుకోవచ్చని వనపర్తి శిక్షణ సంస్థ డైరెక్టర్ అనిల్‌కుమార్ శనివారం తెలిపారు.
శిక్షణ కాలమంతా అభ్యర్థులకు ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు.
శిక్షణ పూర్తయిన అనంతరం ఆయా రంగాల్లో స్వయం ఉపాధి ప్రారంభించేందుకు అవసరమైన సలహాలు, మార్గదర్శకంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా ముద్రా పథకం ద్వారా రుణాలు పొందేందుకు అవసరమైన సహకారం అందిస్తామని వెల్లడించారు.
ప్రస్తుతం మగ్గం వర్క్ కోర్సుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా కోర్సులు
యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని అనిల్‌కుమార్ సూచించారు.

తక్కువ వ్యవధిలోనే శిక్షణ పూర్తి చేసి ఆదాయం పొందే అవకాశాలు ఈ కోర్సుల ద్వారా లభిస్తాయని తెలిపారు.
మహిళలు, పురుషులు తమ ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు.

సంస్థలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల్లో

టైలరింగ్ (30 రోజులు), మగ్గం వర్క్ (30 రోజులు),

సీసీ కెమెరా టెక్నీషియన్ (13 రోజులు),
ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ (31 రోజులు),
ఇమిటేషన్ జ్యువెలరీ తయారీ (14 రోజులు),
కొవ్వొత్తులు, అగరబత్తుల తయారీ (13 రోజులు),
హౌస్ వైరింగ్ (31 రోజులు), ఎల్‌ఎంవీ కారు డ్రైవింగ్ (31 రోజులు),
జనరల్ ఈడీపీ (6 రోజులు), ఎలక్ట్రిక్ మోటార్ రివైండింగ్ సర్వీసెస్ (31 రోజులు),
సెల్‌ఫోన్ రిపేర్ అండ్ సర్విసింగ్ (31 రోజులు), బ్యూటీ పార్లర్ (35 రోజులు), రిఫ్రిజిరేటర్ & ఎయిర్ కండిషనింగ్ వర్క్ (30 రోజులు),
టూ వీలర్ మెకానిక్ (30 రోజులు),
తేనెటీగల పెంపకం మరియు తేనె తయారీ (20 రోజులు),
పుట్టగొడుగుల పెంపకం (10 రోజులు) వంటి అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

గ్రామీణ యువతీ, యువకులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన కోరారు.
ఆసక్తి గల అభ్యర్థులు వనపర్తి మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో సంప్రదించి వెంటనే దరఖాస్తు@ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు కింది ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు
8522088978,9885940945,7981684174 Collector Wanaparthy Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేదీ : 09-05-2026          వనపర్తి జిల్లా           రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను...
09/05/2026

తేదీ : 09-05-2026
వనపర్తి జిల్లా

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

శనివారం జిల్లా కలెక్టర్ గోపాల్‌పేట మండలంలోని నర్సింగాయిపల్లి గ్రామంలో ఉన్న మెప్మా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించి, రికార్డులు మరియు ధాన్యం నమోదు రిజిస్టర్లను తనిఖీ చేశారు. రైతులకు కేంద్రంలో కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

అలాగే ధాన్యం తూకం, తరలింపు, చెల్లింపుల ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని ఇన్‌చార్జీలకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యంలో తాలు, గడ్డి లేకుండా క్లీన్ చేసుకునే విధంగా రైతులకు తెలియజేయాలని సూచించారు. ప్యాడి క్లీనర్లను వినియోగించి ధాన్యాన్ని తాలు లేకుండా క్లీన్ చేయాలని రైతులకు తెలియజేశారు. అకాల వర్షాలు సంభవిస్తే రైతులకు ఇబ్బంది కలగకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులు దాన్యం తెచ్చిన వారికి తెచ్చినట్లుగా తూకం చేసి కేటాయించిన మిల్లుకు తరలించాలని సూచించారు. రైతులకు మెరుగైన సేవలు అందేలా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

డి సి ఎస్ ఓ కాశీ విశ్వనాథ్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. Collector Wanaparthy Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేదీ : 09-05-2026            వనపర్తి జిల్లా             జనగణన 2027 లో భాగంగా ప్రజలు స్వీయ గణన (Self Enumeration) ద్వారా ...
09/05/2026

తేదీ : 09-05-2026
వనపర్తి జిల్లా

జనగణన 2027 లో భాగంగా ప్రజలు స్వీయ గణన (Self Enumeration) ద్వారా తమ వివరాలను తామే నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు.

శనివారం జిల్లా కేంద్రంలో జనగణన-2027లో భాగంగా స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన మారథాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. బాలుర జూనియర్ కళాశాల మైదానం నుండి ప్రారంభమైన మారథాన్ పాలిటెక్నిక్ కళాశాల వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కారణంగా 2021 లో నిర్వహించాల్సిన జనగణన ప్రక్రియ ఆలస్యమైందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా డిజిటల్ విధానంలో జనగణన చేపడుతున్నట్లు తెలిపారు. మే 11 నుండి జూన్ 10 వరకు జిల్లాలో సుమారు 13 వేల మంది సిబ్బంది ఇంటింటికి వెళ్లి హౌస్ లిస్టింగ్ కార్యక్రమంలో పాల్గొని వివరాలు సేకరిస్తారని చెప్పారు.

ప్రజలు స్వీయ గణన (Self Enumeration) ద్వారా తమ వివరాలను తామే నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. సరైన సమాచారం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు. ప్రజల వివరాలు పథకాల నమోదులో ఎక్కడ వినియోగించడం జరగదని ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ సమాచారాన్ని ఎన్యూమరేటర్లకు తెలియజేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

జనగణన విజయవంతానికి మీడియా ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని, ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో డిఎస్పి గిరిబాబు, సిపిఓ హరికృష్ణ, డివైస్ ఓ సుధీర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. Collector Wanaparthy
search Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేదీ : 08-05-2026           వనపర్తి జిల్లా              సెల్ఫ్ ఎన్యుమరేషన్  ప్రక్రియను వేగవంతం చేసి అత్యధిక శాతం ప్రజలు,...
08/05/2026

తేదీ : 08-05-2026
వనపర్తి జిల్లా

సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేసి అత్యధిక శాతం ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది అందులో పాల్గొని తమ వివరాలను నమోదు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

శుక్రవారం రాష్ట్ర జనగణన అధికారి భారతి హోళికేరి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జన గణన ప్రక్రియపై కలెక్టర్లకు ఆమె పలు కీలక సూచనలు చేశారు. జనగణన ప్రక్రియలో పాల్గొనబోయే సిబ్బందికి అందరికి శిక్షణ పూర్తి చేసి, అటెండెన్స్ వివరాలను అప్డేట్ చేయాలని సూచించారు.

ఈ సమావేశానికి వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో పాటుగా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ హాజరయ్యారు.

విసి అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులతో మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో పాల్గొనబోయే సిబ్బందికి శిక్షణ పూర్తి చేసి అటెండెన్స్ అప్డేట్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేసి అత్యధిక శాతం ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది అందులో పాల్గొని తమ వివరాలను నమోదు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిబ్బంది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో పాల్గొని వివరాలు నమోదు చేయాలని ఆ దిశగా సంబంధిత జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం రెండు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువమంది ఇందులో పాల్గొనేలా చూడాలన్నారు.

సమావేశంలో సిపిఓ హరికృష్ణ, జెడ్పి సీఈవో యాదయ్య, డిఎల్పిఓ రఘునాథ్, డిప్యూటీ సీఈఓ రామ మహేశ్వర్, మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, డివైస్ ఓ సుధీర్ రెడ్డి ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. Collector Wanaparthy

Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేదీ : 08-05-2026           వనపర్తి జిల్లా          గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో పాడి పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని, పశువ...
08/05/2026

తేదీ : 08-05-2026
వనపర్తి జిల్లా

గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో పాడి పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని, పశువులకు సమయానికి టీకాలు, ఆరోగ్య పరీక్షలు చేయించడం అవసరం అని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు కీమ్యా నాయక్ పేర్కొన్నారు.

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక, రైతు వారోత్సవాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పెబ్బేరు పీవీసీలో మెగా ఫెర్టిలిటీ అండ్ హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కీమ్యా నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

శిబిరంలో పశువులకు వంధ్యత్వ నివారణ చికిత్సలు, ఆరోగ్య పరీక్షలు, నులిపురుగుల నివారణ మందుల పంపిణీ నిర్వహించారు. అలాగే పశుపోషక రైతులకు పశుగ్రాస విత్తనాలు, ఖనిజ మిశ్రమాలు పంపిణీ చేశారు. రైతుల్లో పశుసంవర్ధకంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ,పశువులకు సమయానికి టీకాలు, ఆరోగ్య పరీక్షలు చేయించడం అవసరం అని తెలిపారు. పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు పాల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా ఇటువంటి శిబిరాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రత్యేక అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ , ఏఎంసీ చైర్మన్, వైద్యులు, పారావెట్స్, శాఖ సిబ్బంది, గోపాలమిత్రలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Collector Wanaparthy
Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేదీ : 08-05-2026           వనపర్తి జిల్లా           మత్స్యకారులకు అన్ని రకాలుగా సహకారం అందించి, వారికి అవసరమైన సౌకర్యాల...
08/05/2026

తేదీ : 08-05-2026
వనపర్తి జిల్లా

మత్స్యకారులకు అన్ని రకాలుగా సహకారం అందించి, వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించి, చేపల ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యం అని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు.

శుక్రవారం నాగవరం శివారులోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకార రైతులకు అనేక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి తో పాటు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులకు అన్ని రకాలుగా సహకారం అందించి, వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించి, చేపల ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. చేపల్లో అత్యధికంగా ప్రోటీన్ ఉండడం కారణంగా వైద్యులు చేపలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని సిఫారసు చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో అందరికీ మంచి చేపలను అందించేలా చర్యలు చేపడతామన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మత్స్యకారులు చేపల విక్రయాలు చేసుకునేందుకు వారికి కావాల్సిన సౌకర్యాలు ఏమున్నా తమను సంప్రదించవచ్చని, అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సౌకర్యాలను మత్స్యకారులు వినియోగించుకొని మంచి దిగుబడి సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

మత్స్యకారులకు మొబైల్ వాహనాలు, సబ్సిడీ అతి తక్కువ వడ్డీ రేటు తో రుణాలు సహా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అదేవిధంగా వనపర్తి నల్లచెరువు కట్టపై గంగమ్మ తల్లి దేవాలయాన్ని పూర్తిస్థాయిలో నిర్మించుకునేందుకు సహకరిస్తామని తెలిపారు. నల్ల చెరువు కట్ట టూరిజానికి హబ్ మాదిరి కానుందని ఇప్పటికే ఓపెన్ జిమ్ సహా ప్రజలకు కావాల్సిన పలు సౌకర్యాలు అక్కడ ఉన్నాయని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ముదిరాజులకు పెద్దపీట వేయాలని ఆలోచనతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలో చోటు కల్పించి సమన్నత స్థానం ఇచ్చారని తెలిపారు.

కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా చేపల వ్యాధుల నియంత్రణపై అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మత్స్యకారులు దిగుబడి పెంచుకునేందుకు మెలకువలు తెలుసుకోవాలని సూచించారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మస్యకారులకు అతి తక్కువ వడ్డీతో రుణాలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మత్స్యకారులు చేపలు విక్రయించుకోవడానికి అందుబాటులో ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమానికి పెబ్బేరు ఫిషరీస్ కళాశాల నుంచి వచ్చిన ప్రొఫెసర్ల నుంచి రైతులకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే తెలుసుకోవాలని తెలియజేశారు.

ఈ సందర్భంగా గోపాల్పేట మండలం చాకలి పల్లి గ్రామానికి చెందిన మహిళా పారిశ్రామిక సహకార సంఘానికి ధ్రువపత్రాన్ని అందజేశారు.

కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, పెబ్బేరు మత్స్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవానంద్, సిఎస్సి ప్రతినిధి మాలిక్, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లాలోని మస్స్యకార సహకార సంఘాల నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు. Collector Wanaparthy
Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేది: 8-5-2026                             వనపర్తి జిల్లా        సకల సదుపాయాలతో రూపొందించిన సమీకృత మార్కెట్ సముదాయాన్ని ...
08/05/2026

తేది: 8-5-2026
వనపర్తి జిల్లా
సకల సదుపాయాలతో రూపొందించిన సమీకృత మార్కెట్ సముదాయాన్ని వ్యాపారస్థులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి కోరారు.
వనపర్తి పట్టణంలోని పాత మార్కెట్ యార్డు ప్రాంతంలో నూతనంగా సకల సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయంలోని మొదటి అంతస్తులో శుక్రవారం రిజిస్ట్రేషన్ అస్యూరెన్స్ కార్యాలయాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అర్చకులు వేద మంత్రాలతో
ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ సమీకృత మార్కెట్ సముదాయం పూర్తి అయి దాదాపు సంవత్సరం పైగా అవుతున్నప్పటికీ షాపుల అద్దె ఎక్కువగా ఉండటంతో షాపులు తీసుకోడానికి వ్యాపారస్తులు ఎవరు ముందుకు రాలేదన్నారు. పరిస్థిని గమనించి జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకొని నిర్ణయించిన రేట్లలో సగానికి తగ్గించి ప్రతిపాదనలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ను పంపించగా అట్టి ప్రతిపాదనలు ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమీకృత మార్కెట్ లో షాపులు పొంది ప్రార్భోత్సవాలు చేసుకున్న రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది, దస్తావేజు లేఖరులకు శుభాకాంక్షలు తెలిపారు. సమీకృత మార్కెట్ సముదాయంలో ఇంకా డిమాండు ఉందని, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అవసరమైన వారందరికీ షాపులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సమీపంలో ఉన్న టౌన్ హాల్ ను సైతం వినియోగంలోకి తీసుకువస్తామని అదేవిధంగా దాని చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో బంగారు షాపులను నిర్మించి ఇక్కడే గోల్డ్ బజార్ ఏర్పాటుకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ప్రస్తుతం కొన్ని వసతి గృహాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, త్వరలోనే ప్రభుత్వ భవనాల్లోకి మార్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు .
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి మాట్లాడుతూ సమీకృత మార్కెట్ సముదాయంలో షాపులు పొందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ దాదాపు ఒకటిన్నర సంవత్సరాల నుండి నిరుపయోగంగా పడిఉన్న సమీకృత మార్కెట్ సముదాయాని శాసన సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల షాపు ధరలు తగ్గించి లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా షాపుల కేటాయింపు చేయడం జరిగిందన్నారు. సామాన్యంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న షాపులకు మాత్రమే డిమాండు ఉంటుందనీ కానీ పై అంతస్తులో తీసుకోడానికి సామాన్యంగా ఎవరు ఇష్టపడరు అన్నారు. అందుకే పై అంతస్తులో రిజిస్ట్రేషన్ శాఖ పెట్టడం వల్ల డిమాండు పెరిగి అన్ని షాపులకు డిమాండు పెరిగిందన్నారు. పట్టణం మధ్యలో సమీకృత మార్కెట్ ఉండటం చాలా బాగుందని తెలిపారు.
వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత పాలకులు అసంపూర్తిగా వదిలిన భవనానికి దాదాపు 23 లక్షలు అదనంగా ఖర్చు చేసి ట్రాన్స్ ఫార్మా సైతం ఏర్పాటు చేసి నేడు వినియోగంలో తెచ్చినందుకు శాసన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి, జిల్లా రిజిస్ట్రార్ ఫణీంద్ర, సబ్ రిజిస్ట్రార్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. Collector Wanaparthy Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేది: 7-5-2026                            వనపర్తి జిల్లా          భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు వచ్చిన సమర్థవంతంగా ఎదుర్...
07/05/2026

తేది: 7-5-2026
వనపర్తి జిల్లా
భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కోడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కేంద్ర విపత్తు నిర్వహణ లీడ్ కల్సల్టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బహల్ ఆదేశించారు.
కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
రాష్ట్రంలో అకస్మాత్తుగా భారీ వర్షాలతో వరదలు రావడం, పరిశ్రమల్లో భారీ అగ్ని ప్రమాదాలు జరగటం, అడవుల్లో మంటలు చెలరేగడం, రోడ్డు, రైలు ప్రమాదాలు జరిగినప్పుడు జిల్లా యంత్రాంగం ఏ విధంగా వ్యవహరించాలి, ప్రాణ నష్టం జరుగకుండా, క్షతగాత్రులను ఏ విధంగా రక్షించాలి అందుకు కమ్యూనికేషన్ వ్యవస్థ ఏవిధంగా ఉండాలి అనేది సంబంధిత శాఖల అధికారులు తమ బాధ్యతల పై టేబుల్ ఎక్సర్సైజ్ చేయాలని సూచించారు. మే, 15 వరకు టేబుల్ ఎక్సర్సైజ్ నిర్వహించి మే, 18వ తేదీన మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. సంబంధిత శాఖల అధికారులు తమ బాధ్యతలు ఏంటి వాటిని ఏవిధంగా నిర్వర్తించాలి అనే విషయాలను టేబుల్ వర్క్ ద్వారా నేర్చుకోవడమే కాకుండా ప్రాక్టికల్ గా చేస్తేనే ప్రమాదాలు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాలను వరద ప్రమాద జిల్లాలు గాను, 5 జిల్లాలను పరిశ్రమల ప్రమాద జిల్లాలు గాను, అటవీ ప్రాంతం అధికంగా ఉన్న జలాల్లో అగ్ని ప్రమాద జిల్లాలుగా గుర్తించినట్లు తెలిపారు.
హైదరాబాద్ నుండి ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్, సెక్రెటరీ హరిచందన దాసరి, వనపర్తి జిల్లా నుండి అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, జడ్పీ సి ఈ ఓ యాదయ్య, సి.పి. ఒ హరికృష్ణ, జిల్లా ఫైర్ ఆఫీసర్ బి. ధర్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. Collector Wanaparthy
Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

తేది: 6-5-2026                             వనపర్తి జిల్లా       *భారత దేశంలో బాగా డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలను సాగు చేసి ...
06/05/2026

తేది: 6-5-2026
వనపర్తి జిల్లా
*భారత దేశంలో బాగా డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలను సాగు చేసి అత్యధికంగా లాభాలు పొందండి*
*వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించండి - రైతులను సూచించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నా రెడ్డి*
*రాబోయే తరానికి ఆరోగ్యవంతమైన వ్యవసాయ భూమిని అందించేందుకు రైతులు సాయిల్ హెల్త్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి - జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి*

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం స్థానిక దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా ఉద్యానవనాలు మరియు పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంటల మార్పిడిపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో పాటు ప్రణాళికా సంఘం అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. జి. చిన్నా రెడ్డి మాట్లాడుతూ 140 కోట్ల మంది జనాభా కలిగిన భారత దేశంలో ప్రజలకు అవసరమైన మేరకు ఆయిల్ గింజలు, పప్పు దినుసులు లేవని వాటిని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొవటానికి మన ఫోరెన్సిక్ నిల్వలు బయటి దేశాలకు వెళ్లి పోతున్నాయని చెప్పారు. అందుకే మన దేశంలోనే ఆయిల్ గింజలు సాగు చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.
నూనె గింజల్లో అత్యధికంగా ఆయిల్ వచ్చే పంట కేవలం పామాయిల్ పంటకే ఉందని, అత్యధికంగా లాభసాటి పంట ఏదైనా ఉందంటే అది పామాయిల్ పంట అని కొనియాడారు. అందుకే రైతులు వరి పంట కాకుండా పామాయిల్, పప్పు గింజలు, కూరగాయల వైపు దృష్టి మళ్లించాలని సూచించారు. తన 90 ఎకరాల పొలంలో 75 ఎకరాలు పామాయిల్ సాగు చేస్తున్నట్లు తెలిపారు.
పామాయిల్ సాగుకు ప్రభుత్వం మొక్కకు సబ్సిడీ నుంచి ఎరువులు, డ్రిప్, గుంతలు తవ్వడానికి, 4 సంవత్సరాల పాటు అంతర్ పంట సాగుకు సైతం ప్రభుత్వం సబ్సిడీనిస్తుందని అన్నారు. రైతులు పామాయిల్ పంట సాగు చేసి దాదాపు 30 సంవత్సరాల పాటు అత్యధికంగా లాభాలు పొందాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ రైతులు తమ భూములను సారవంతంగా ఉంచుకొని వరి కి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు అవగాహన కల్పించడానికి ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రతి రైతు భూ సారా కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు రైతు ఉత్పత్తిదారుల సంస్థ (Former Producer Organisation) లో సభ్యత్వం తీసుకోవాలని తద్వార కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే అనేక పథకాలకు అర్హత సాధిస్తారని సూచించారు. అదేవిధంగా ప్రతి రైతు కిసాన్ క్రెడిట్ కార్డు పొందటం, సహకార సంఘంలో సభ్యత్వం తీసుకోవడం వంటివి చేయాలని చెప్పారు.
పామాయిల్ పంట వేసుకునేందుందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి పామాయిల్ సాగు చేస్తున్న రైతుల వద్దకు తీసుకువెళ్లి అవగాహన కల్పిస్తామని చెప్పారు. రైతులు వరి మాత్రమే కాకుండా ఇతర పంటల సాగు వైపు దృష్టి సారించాలని కోరారు.
రైతు కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, ప్రత్యేక నోడల్ అధికారి ప్రసాద్ రావు, మాజీ జాయింట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ కృపాకర్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డి, వీణా, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి విజయ్ భాస్కర్, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు. Collector Wanaparthy

Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana

Address

ROOM NO. 29, IDOC WANAPARTHY
Wanaparthy
509103

Website

Alerts

Be the first to know and let us send you an email when DPRO Wanaparthy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share