18/08/2025
తేది:18/08/2025, నగరపాలక సంస్థ, విజయనగరంవిజయనగరం... యువజన విద్యార్థి సంఘాల ప్రవేశం పై జారీ చేసిన ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోవాలని 18న రాష్ట్ర వ్యాపితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాలు అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా విజయనగరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు వైయస్సార్ సీపీ యువజన విద్యార్థి విభాగం అధ్యక్షతన నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోకి యువజన విద్యార్థి సంఘాలు ప్రవేశించొద్దని కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన పదిహేను నెలల్లోనే విద్యారంగాన్ని పూర్తిగా నీరుగార్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు బహిర్గతం అవుతాయనే భయంతోనే విద్యార్థి సంఘాలని ప్రభుత్వ విద్యాసంస్థల్లోకి రాకుండా చీకటి ఉత్తర్వులిచ్చిందని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలతో సమావేశాలు నిర్వహించిన లోకేష్ నేడు ఇలాంటి ఉత్తర్వులివ్వడం ఏంటని ప్రశ్నించారు. పాఠశాలల్లో విద్యార్థులకిచ్చిన బ్యాగులు నెల రోజుల్లోనే చిరిగిపోతున్నాయని, మధ్యాహ్న భోజనం అత్యంత నాసిరకంగా ఉండడం గమనించమని, ఆంగ్ల బోధన అటకెక్కించారని, నాడు - నేడు రద్దు చేసి పాఠశాలల్ని నీర్వీర్యం చేశారని, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కనీస వసతుల్ని కల్పించలేకపోతున్నారని ప్రత్యక్షంగా పర్యవేక్షించి జిల్లా కలెక్టర్ దృష్టికి వినతిపత్రం ద్వారా తెలియపరిచామని అన్నారు. ఇలాంటి సమస్యలన్నీ విద్యార్థి సంఘాల దృష్టికి వస్తాయనే లోకేష్ ఉత్తర్వులిచ్చారని విమర్శించారు. విద్యార్థుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసేది విద్యార్థి సంఘాలే అని తెలిపారు.రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కలుషితాహారం వల్ల విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నా కుడా లోకేష్ స్పందించడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ కార్యక్రమాల గురించి విద్యార్థి నేతలు విద్యార్థులతో మాట్లాడే స్వేచ్ఛ ఉండేదని గుర్తుచేసారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి అప్రజాస్వామికమైన ఉత్తర్వులు ఐదేళ్లలో సీఎం గా జగన్ మోహన్ రెడ్డి ఇవ్వలేదని, డా. బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రజాస్వామిక హక్కుల్ని లోకేష్ కాలరాస్తున్నారని తెలిపారు. విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాలు రాకూడదంటూ పాఠశాల విద్యా శాఖ, ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగ ఇన్చార్జ్ ఈశ్వర్ కౌశిక్ గారు ,విద్యార్థి విభాగ అధ్యక్షలు కరుముజు సాయి గారు , పట్టణ యువజన విభాగ ఇన్చార్జ్ బోడసింగి ఈశ్వర రావు గారు యువజన విభాగ నాయకులు భార్గవ్, వర్ధన్, లంక సురేష్, ఉమా , లంక నరేష్, బాలి ప్రతాప్, గౌతమ్, ధనరాజ్ మరియు పట్టణ విద్యార్థి విభాగ నాయకులు పొన్నాడ మణికంఠ, వివేక్, హర్ష, మణి భగవాన్, బన్నీ, జస్వంత్ లతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన మరియు విద్యార్థి విభాగ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ..