Telugu Desam Party: Vizianagaram

Telugu Desam Party: Vizianagaram Official Page of TDP Vizianagaram

02/06/2026

ప్రతి నిర్ణయం, ప్రతి పెట్టుబడి, ప్రతి పరిశ్రమ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం..


SIRపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్. హాజరై దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వర్క్ షాప్ లో ప...
02/06/2026

SIRపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్. హాజరై దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వర్క్ షాప్ లో పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, పరిశీలకులు,


02/06/2026

"ఎన్టీఆర్ భరోసా" పెన్షన్ సౌకర్యం గురించి కల్లుగీత కార్మికుడు సింహాచలంను ఆరా తీసి, అతనికి వృద్ధాప్య పెన్షన్ రూ. 4000 స్వయంగా అందించిన సీఎం చంద్రబాబు.





02/06/2026

కాకినాడ జిల్లా ప్రజావేదిక కార్యక్రమంలో మున్సిపల్ పరిపాలన, పట్టణ పరిశుభ్రతపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు గారు..





02/06/2026

కాకినాడ జిల్లా, తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు గారు.





02/06/2026

'పేదల సేవలో' భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలంతో నడుస్తూ మాట్లాడిన సీఎం వృత్తిని గురించి, వారి ఆదాయం, జీవన విధానం గురించి తెలుసుకున్నారు. సింహాచలం తాటి చెట్టు ఎక్కి కల్లుతీసే విధానాన్ని పరిశీలించిన సీఎం తాజా కల్లును రుచి చూశారు.
#పేదలసేవలో



02/06/2026

డేటా సెంటర్లు మంచివి కావని అంటూ కొంతమంది సృష్టిస్తున్న అపోహలపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు.

"డేటా సెంటర్లు మంచివి కావు" అంటూ అమెరికా ఉదాహరణ చెబుతున్నారు. అమెరికాను చూసుకుంటే, మన దేశంలో వన్ నేషన్ - వన్ గ్రిడ్ ఉంది. అమెరికాలో అది లేదు.

నీటి విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం గోదావరి నుంచి దాదాపు 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఇది వియత్నాం లేదా బ్రెజిల్ దేశాల మొత్తం వార్షిక నీటి వినియోగంతో సమానం.

మేము నిర్మించాలనుకుంటున్న 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే అవసరం. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్, ఒక గిగావాట్ డేటా సెంటర్ కంటే 7 రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుంది.

కానీ ప్రతి ఒక్కరూ డేటా సెంటర్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప, థర్మల్ పవర్ ప్లాంట్ల గురించి మాట్లాడటం లేదు. కాబట్టి యువతతో ఈ విషయాలపై చర్చించడం, వారి భయాలు మరియు అపోహలను తొలగించడం చాలా ముఖ్యం.


02/06/2026

ఒక ఆడియో చూపించి డీఎస్సీపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఆ వ్యక్తి SAP ఉద్యోగి కాదు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కూడా కాదు..

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆడియో సందేశాలు వెలుగులోకి వచ్చిన వెంటనే క్రీడల శాఖ స్వయంగా స్పందించి, 2025 జూలై 28న పల్లెకోన పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేసింది.

ఈ వ్యవహారంలో బొంత రోశయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నాం.


Address

Vizianagaram

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Vizianagaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Vizianagaram:

Share