I TDP మనం_మన తెలుగుదేశం

I TDP మనం_మన తెలుగుదేశం promotion of TDP OF CBN

✅ TDP is not a Political Party - It's a Social System (ప్రతీ తెలుగుదేశం కార్యకర్త తప్పక చదవాలి)చంద్రబాబు గారి కుటుంబానిక...
28/02/2026

✅ TDP is not a Political Party - It's a Social System

(ప్రతీ తెలుగుదేశం కార్యకర్త తప్పక చదవాలి)

చంద్రబాబు గారి కుటుంబానికి ఉన్న ఏకైక వ్యాపారం Heritage అని అందరికీ తెలిసిందే.. అందులోనూ అది ఒక Listed Company.. కాబట్టి Heritage విలువలో 41.3 శాతం మాత్రమే వీరి కుటుంబానిది కాగా.. 58.7 శాతం ఇన్వెస్టర్ల వాటాగా ఉంది.. Listed Company కావడంతో ఇందులో అవకతవకలు చేసే అవకాశం లేదు.. ప్రతీదీ చట్టపరమైన రెగ్యులేషన్స్ ప్రకారం నడవాల్సిందే..

ఇప్పుడు జగన్ రెడ్డి వ్యాపార సామ్రాజ్యం చూద్దాం - తల్లిని చెల్లిని తరిమేశారు కాబట్టి.. జగన్ రెడ్డి కుటుంబం అంటే కేవలం వారి భార్యాభర్తలు మాత్రమే... వారి వ్యాపారాలు ప్రాథమికంగా 4 రంగాల్లో విస్తరించి ఉన్నాయి..

◾A. మీడియా రంగం

1. జగతి పబ్లికేషన్స్ - సాక్షి పేపర్
2. ఇందిరా టెలివిజన్ - సాక్షి ఛానెల్
3. జనని Infra - సాక్షికి సంబంధించిన ఆఫీసులు కట్టడం మరియు maintainance కోసం

◾B. విద్యుత్ రంగం

4. సండూర్ పవర్ - కర్ణాటక - పేరు చూసి ఇది విద్యుత్తు ఉత్పత్తి చేసే కంపెనీ అని పోరబడకండి.. ఇక్కడ విద్యుత్ కోసం కేటాయించిన భూముల్లో Iron Ore mining చేస్తారు... వీళ్లకు 3000 కోట్ల రూపాయల సున్నపురాయి క్వారీలు కేటాయించినట్టు.. ఈ కంపెనీకి Mauritus దేశం నుండి 124 కోట్ల రూపాయలు నల్లడబ్బు తరలించినట్టు ED కనిపెట్టింది..

5. సరస్వతి పవర్ - అంధ్ర ప్రదేశ్ - ఇది కూడా ఇప్పటి దాకా ఒక్క యూనిట్ కరెంటు కూడా ఉత్పత్తి చేయలేదు.. పేరుకు చైనా నుండి సోలార్ ప్యానెల్స్ తెచ్చి అమ్ముతారు.. కానీ దీనికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1515.93 ఎకరాలు కేటాయించాడు రాజశేఖర్ రెడ్డి.. (అందులో 28.7 ఎకరాలు దళితుల అసైన్డ్ భూమి)..నిజానికి ఈ కంపెనీ డైరెక్టర్ గా విజయమ్మ ఉండేది.. ఈ కంపెనీ విషయంలోనే తన తల్లికి, చెల్లికి ఈ కంపెనీ ఆస్తుల్లో వాటా ఇవ్వడం కుదరదు అని జగన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు..

◾C. సిమెంట్ రంగం

6. భారతి సిమెంట్ - దీనికి కడపలో ఒక ప్లాంటు.. దానికి రెండింతల పెద్ద ప్లాంటు కర్ణాటకలో ఉన్నాయి.. 2024 ఎన్నికలలో ఘోరమైన ఓటమి తర్వాత జగన్ రెడ్డి బెంగళూరులోనే ఉండిపోయి.. ఈ సండూర్ పవర్, భారతీ సిమెంట్ కంపెనీల వ్యవహారాలు చూసుకుంటున్నాడు..

◾D. రియల్ ఎస్టేట్ రంగం

7. Classic Realty Private Ltd
8. Silicon Builders Private Ltd
9. Shalom Infrastructure
10. Capstone Infrastructure
11. Nivish Infrastructure

సరే 11 దగ్గర ఆపేద్దం..

👉👉 పైన వాటితో పాటు.. బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ లో గాలి జనార్ధన్ రెడ్డితో కలిపి జగన్ రెడ్డికి వాటాలు ఉండేవి.. కానీ 2018 లో అంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ కంపెనీకి ఇచ్చిన భూములు వెనక్కు తీసేసుకుంది.. దానితో పాటు.. చెన్నైలోని పాత సినిమా ప్రొడ్యూసర్ నాగి రెడ్డి (భారతి రెడ్డి తాత) కట్టిన విజయ హాస్పిటల్స్ లో కూడా భారతీ రెడ్డికి పుట్టింటి తరుపు నుండి వాటా ఉంది..

➡️ ఇది జగన్ రెడ్డి కుటుంబ వ్యాపార సామ్రాజ్యం.. వీటి విలువ ఎంత ఉంటుందో ఒక ఉదాహరణతో చెబుతాను.. జగన్ రెడ్డి కుటుంబంలో అగ్గి రాజేసిన సరస్వతి పవర్ కు గుంటూరు జిల్లాలో ఉన్న 1515.93 ఎకరాల భూముల మార్కెట్ విలువే.. దాదాపు 18,000 కోట్ల రూపాయలుగా ఉంది.. ఇక మిగతా కంపెనీల విలువ ఎంత ఉంటుందో.. రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర ఉన్న భూముల విలువ ఎంత ఉంటుందో.. మీరే ఊహించుకోండి.. .

మొత్తంలో గమ్మత్తు అయిన విషయం ఏంటంటే.. జగన్ రెడ్డి కుటుంబ వ్యాపారాల్లో.. ఒక్కటి కూడా Listed Company కాదు... దేశంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీలలో ఒకటైన భారతీ సిమెంట్ ను కూడా Listed Company చేయలేదు.. తన వ్యాపారాలు చట్టాల చట్రంలో ఇరుక్కోకుండా జగన్ రెడ్డి బానే ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు.. CBI కేసుల్లో జాప్యం జరగడానికి కూడా ఈ ముందు జాగ్రత్తే కారణం...

ఇన్ని లక్షల కోట్లకు అధిపతి అయినా.. జగన్ రెడ్డి.. పిల్లికి కూడా బిచ్చం పెట్టడు అనే సంగతి అందరికీ తెలిసిందే.. ప్రభుత్వ సొమ్ముని విచ్చలవిడిగా తన విలాసాలకు వాడుకోవడం, మధ్యమధ్యలో ప్రభుత్వ సొమ్ముతో చిన్న చిన్న దానాలు చేస్తూ.. తన సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప.. జగన్ రెడ్డి కనీసం కార్యకర్తల కుటుంబాల్లో ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా తన సొంత డబ్బు ఒక్క రూపాయి ఇచ్చి ఆదుకున్న సందర్భం లేదు.. తన పార్టీ కార్యక్రమాలకు, భారీ ర్యాలీలకు కూడా పార్టీ నాయకుల జేబులకు చిల్లు పెడతాడు తప్ప,, అతని జేబులో నుండి రూపాయి తియ్యడు.. అని వైసీపీ MLA టికెట్ ఆశావహులు బాధ పడటం అందరికీ తెలిసిందే...

ఇప్పుడు చంద్రబాబు గారి కుటుంబాన్ని చూద్దాం..

వీళ్లకు ఉన్న ఏకైక వ్యాపారం Heritage ద్వారా వచ్చిన ఆదాయంతో వీరు NTR Charitable Trust నడుపుతారు.. దానిద్వారా వీళ్ళు ఏమేమి చేస్తున్నారో చూద్దాం

బ్లడ్ బ్యాంకులు - హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి కేంద్రాలుగా 4 బ్లడ్ బ్యాంకులు నడుస్తాయి.. తలసేమియా వ్యాధితో బాధ పడుతున్న పిల్లల కోసం Specialized Transfusion Systems ను ఈ బ్లడ్ బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేశారు..

2️⃣ Medical Camps పెట్టి Medical Kits పంపిణీ చేయడం - సంవత్సరానికి కనీసం 300 చొప్పున ఇప్పటికీ 8000+ మెడికల్ క్యాంపుల ఏర్పాటు చేశారు..

3️⃣ NTR "విద్యా జ్యోతి" - దీని కింద ఇప్పటికీ 2113 మంది అనాథ పిల్లలకు KG నుండి PG దాకా ఉచిత చదువు అందించారు..

4️⃣ NTR "Model School" - దీని కింద 159 ప్రభుత్వ బడుల్లో మెరుగైన సౌకర్యాల కల్పన చేసారు.. ఇప్పుడు latest గా నారా లోకేష్,, నిడమర్రు ప్రభుత్వ పాఠశాలను ఇదే విధంగా దత్తత తీసుకుని, తమ సొంత డబ్బులతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేశారు..

5️⃣ NTR "విద్యా సేవ" - దీని కింద వివిధ వృత్తి విద్యా కోర్సుల కోసం స్పెషల్ కోచింగ్ క్లాసులు.. skill development కోర్సులు అందిస్తారు..

6️⃣ Excel Civils Academy - సివిల్ సర్వీసు పరీక్షల కోసం 7 సంవత్సరాల నుండి ఉచితంగా నడుపుతున్న Excel Civils Academy, దానికి అనుబంధంగా పోటీపరీక్షల కోసం ప్రత్యేక లైబ్రరీ ఫెసిలిటీ ఉపయోగించుకుని.. ఇప్పటికీ 120+ పైగా సివిల్స్ మరియు గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసులకు ఎన్నికయ్యారు..

7️⃣ కార్యకర్తల భీమా - తెలుగుదేశం కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద భీమా సౌకర్యం ఉంది.. తద్వారా కుటుంబ పెద్దను కోల్పోయిన ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులపాలు కాకుండా బయటపడగలిగాయి.. భీమాతో పాటు చనిపోయిన కార్యకర్తల బిడ్డలను దత్తత తీసుకుని వాళ్ల చదువులకు కూడా NTR ట్రస్టు బాధ్యత తీసుకుంటుంది..

బసవ తారకం కాన్సర్ హాస్పటల్ - రూపాయి లాభం కూడా సంపాదించని ఈ ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ ను బాలకృష్ణ గారు నడుపుతున్నారు.. ఈ హాస్పిటల్ ద్వారా కొన్ని వేల ప్రాణాలు క్యాన్సర్ కు బలి కాకుండా కాపాడగలిగారు..

చిట్టితల్లి పునర్వీక వ్యాక్సిన్ కోసం 6 కోట్లు ఇవ్వడం, నిడమర్రు పాఠశాలను 10 కోట్ల సొంత డబ్బుతో అభివృద్ధి చేయడం లాంటి బాధ్యతలు తీసుకుంటూ లోకేష్ గారు ఆ కుటుంబ సాంప్రదాయాన్నే కొనసాగిస్తున్నారు..

అందుకే అంటుంది.. తెలుగుదేశం అనేది ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు... ఒక బాధ్యత గల సామాజిక వ్యవస్థ.. తెలుగుదేశానికి మాత్రమే.. కరుడుగట్టిన కార్యకర్తలు ఉండడం వెనుక.. ఇంతటి వ్యవస్థీకృత కృషి ఉంది..

✍️✍️ చైతన్య కూరపాటి

25/07/2025
10/06/2025

Celebrating my 3rd year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

16/03/2025

*ఈ రెండు ఊర్లు భద్రాచలంలో ఉన్నాయి ఈ ఊర్లు పై భలే జోకులు ఉంటాయి* *తంత, తన్నించుకుంట* ఈ ఊర్లు మధ్య ప్రయాణం, ఎలావుంటుందో ఉహ...
23/10/2024

*ఈ రెండు ఊర్లు భద్రాచలంలో ఉన్నాయి ఈ ఊర్లు పై భలే జోకులు ఉంటాయి*

*తంత, తన్నించుకుంట*

ఈ ఊర్లు మధ్య ప్రయాణం,

ఎలావుంటుందో ఉహించుకుని నవ్వుకుందాం.

తంతానికి ఒక టికెట్ ఇవ్వండి.

తన్నించుకుంటానికి రెండు ఇవ్వండి.

సార్ చిల్లర ఇవ్వలేదు.
తంతానికి వెళ్ళేవాడికే ఇవ్వలేదు.నువ్వు తన్నిం చుకుంటానికి కదా!
చివరిదాకా వస్తావు కదా!
కంగారుపడకు.

వెనుకసీట్లో అయన : ఏరాబ్బాయి! ఈ మధ్య తంతానికి రావట్లేదు.

లేదు బాబాయ్! తన్నించు కుంటానికి వెళ్లిపోతున్నా బాబాయ్.
అక్కడ ఆర్డర్లు వస్తున్నాయి.

సరేరా! తన్నించు కుంటా అలవాటు అయిపోయి, తంత మాటే మరిచిపోయావు,

ఇంతలోడ్రైవర్ : తంతానికి ఎవరైనా వున్నారా?

కండక్టర్ : ఒక్కరే తంతానికి, అందరు తన్నించుకుంటానికే.
బాబూ తన్నించుకుంటానికి అందరు టికెట్లు చేత్తో పట్టుకోండి.

అప్పుడే మెలుకువ వచ్చిన పాసింజర్ : తంతానికి దిగాలి ఇప్పుడు ఎలా?

కండెక్టర్ విసుగ్గా : ఇంకో ఇరవై ఇచ్చి తన్నించు కుంటానికి దిగు

బస్ దిగుతూ బాబాయ్ పిన్నిని తీసుకుని ఒకసారి తన్నించుకుంటానికి రండి.

అన్నమయ్య వర్సెస్ బుడమేరు స్పెషల్ స్టోరీAs usual తెల్లవారుజామున లేచి అలవాటు లో మూడు పత్రికలు చదువుదాం అని చూస్తే .. అలవాట...
08/09/2024

అన్నమయ్య వర్సెస్ బుడమేరు
స్పెషల్ స్టోరీ

As usual తెల్లవారుజామున లేచి అలవాటు లో మూడు పత్రికలు చదువుదాం అని చూస్తే .. అలవాటు లో మొదట ఈనాడు చూస్తా కాబట్టి ఈరోజు శెలవు సోమవారం పునః దర్శనం అని బాధ్యతగా చూపింది. మొదట సాక్షి/ ఆంధ్రజ్యోతి చూసే వారికి Click here for latest edition చూసి ఎన్నో సార్లు నొక్కి నొక్కి అలుపు వచ్చి ఉంటుంది.

కాలక్షేపం కోసం ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మా అన్న పోస్ట్.. 8 పేరాలు. 1. 8 రోజులు అయినా దారీతెన్నూ లేదు 2. 50 మంది మరణించడం ఎపుడూ లేదు 3. రివ్యూ చేయకపోవడం 4. ప్రకాశం బ్యారేజీ ఖాళీ చేసి ఉంచక పోవడం 5. సచివాలయ సిబ్బంది వాలంటీర్లుని వాడకపోవడం 6. బియ్యం పప్పు ఇవ్వడం ఇదే తొలిసారి అనే ఆర్భాటం 7. ఉదారంగా సాయం చేయకపోవడం 8 వసూళ్ళకి దిగడం అనేది ప్రధాన అంశాలు. ఇవన్నీ చదువుతుంటే గతంలో అన్నమయ్య ప్రాజెక్టు ఆనవాళ్లు లేకుండా పోయినప్పుడు మనఃసాక్షి లేని మన సాక్షి లో ప్రచురించిన కథనం గుర్తొచ్చింది. కొన్ని అడగాలి అనిపించింది.

80% నిండుగా ఉన్నా 20% ఖాళీ చూపించి ఖాళీ గ్లాసు అని ప్రచారం చేయడం తగదు అని ఆనాడు ఈనాడుకి హితవు. ఈనాడు ఈనాడు కూడా ఆ 20% లోపాలు ఎత్తి చూపుతుందే కానీ అంతా బాగుంది అని రాయటం లేదు కదా! మాట మార్చింది మడమ తిప్పింది మన సాక్షి మాత్రమే అని 20% లోపాలు చూపించి ఖాళీ గ్లాసు అని చెబుతోంది మన విషవసనీయ పత్రిక కాదా!

50 మంది మరణించడం ఎపుడూ లేదా? ఆనాటి అన్నమయ్య అఫిషియల్ లెక్కే 33 కదా! నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల 5 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అయితే ప్రకాశం బ్యారేజి వచ్చే వరకు కృష్ణా ప్రవాహం 11 లక్షలు అదనంగా వచ్చిన (మూసీ బుడమేరు) నీరు అంచనా వేయలేం అని మన నీటిపారుదల స్పెషలిస్ట్ మాటే కదా! పింఛా ప్రాజెక్టు నుంచి అన్నమయ్య ప్రాజెక్టుకి ఉవ్వెత్తున వచ్చిన ఉపద్రవం అని కవర్ చేసుకున్నాం కదా! రివ్యూ చేయకపోవడం తప్పు ఖాళీ చేసి ఉంచక పోవడం దారుణం అనే మాట ఆనాడు వర్తించదా! ఆనాడు అలా ఫింఛాకు & ఫింఛా నుంచి వచ్చే నీరు అంచనా వేయలేం అని ఎవరైనా చెప్పారా?

బియ్యం పప్పు ఇవ్వటమే తొలిసారి ఇవ్వడం ఆర్భాటం అయితే ఆనాడు మనం ఇచ్చింది ఏమేరకు? పార్టీ తరపున ఇప్పటిదాకా చేసింది రెండు వాటర్ బాటిల్లు & ఒక పాలు ప్యాకెట్ పై మనం చేసిన ఆర్భాటం సంగతి ఏంటి? ఆనాడు మన సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఉండి చేసింది ఏంది? ఇపుడు ఈఎంఐ వెసులుబాటు, ఫైరింజన్లతో ఇల్లు క్లీనింగ్ , ఇన్సూరెన్స్, పోయిన సర్టిఫికెట్లకి ఏర్పాట్లు వంటి గ్రౌండ్ లెవెల్ సమస్యలు పరిష్కారం చేస్తున్న బాబు కృషి ఆనాడు పది రోజుల తర్వాత తీరిగ్గా పరదాలతో రాకుండా ముందే వచ్చి ఉంటే అర్థం అయ్యేవి.

08.09.20 నాడు బుడమేరు ఆధునీకరణ పనులు ప్రీ క్లోజర్ చేసినట్లు మనం మన హయాంలో ఇచ్చిన జీవో స్పష్టంగా కనపడుతుంటే బాబు బుడమేరు నిర్వాకం అని అనడం ఎంతవరకు సమంజసం? ఇపుడు 64 గంటల్లో బుడమేరు గండ్లు యుద్ధప్రాతిపదికన పూడ్చారు.

ఆనవాళ్లు లేకుండా పోయిన అన్నమయ్య ప్రాజెక్టు పనులకు పరిపాలన అనుమతి ఇవ్వడానికి మనకు ఏడాది పట్టింది. కనీసం శంఖుస్థాపన చేయడానికి కూడా మన హయాంలో 27 నెలలు సరిపోలేదు. ఫింఛా ప్రాజెక్టు సంగతి సరేసరి వంద కోట్లు ఇవ్వడానికి చేతులు ఆడలేదు. రెండేళ్ళు అయినా సర్టిఫికెట్ అందలేదు అని పులపుత్తూరు సుధామణి, రైతుని కూలి అయ్యాను అని బగిడిపల్లి సుబ్బమ్మ వంటి బాధితుల సంగతి బిబిసి చెబుతుంది. సర్టిఫికెట్ ఇవ్వడానికి మన సచివాలయం ఏమైంది సిబ్బంది వాలంటీర్లు ఏమయ్యారు?

విరాళాలపై విమర్శలు ఎలా? ఆనాడు పాలన ఆరంభంలోనే Connect Andhra అనే వెబ్సైట్ పెట్టి విరాళాలు అడిగింది నిజం కాదా! మళ్ళీ అడిగి అభాసుపాలు అవడం ఎందుకు అని విరాళం అడగలేదు. మనల్ని నమ్మలేదు ఇవ్వలేదు బాబుని నమ్మారు విరాళాలు ఇస్తున్నారు. విశ్వసనీయత అని మన గురించి మనం చెప్పుకోవడం కాదు ఇతరులు చెప్పాలి. లోపాలు ఎత్తి చూపడం తప్పు కాదు‌ అది ప్రతిపక్షం బాధ్యత కానీ వరదలో బురద రాజకీయాలే.. తగదు. ✍️PPN

12/08/2024

మిత్రులందరికీ  స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు...!!
04/08/2024

మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు...!!

03/08/2024

*_🚩మెరుగైన జీవితానికి పంచసూత్రాలు🌴_*

మెదడు నిరంతరం చురుగ్గా ఉంటేనే
మీ మేధస్సు, నైపుణ్యాలు పెరుగుతాయి.
అందుకోసం ఇవి ప్రయత్నించండి:

1.కొత్త విషయాలను నేర్చుకోవడం ఆపొద్దు. అప్పుడే మీ మెదడు ఉత్తేజితమవుతుంది.

2.సౌకర్యవంతమైన పరిస్థితులను వదిలి ముందడుగు వేస్తేనే మీలో సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది.

సమస్యల పరిష్కారానికి అవసరమైన నైపుణ్యాలు అలవడుతాయి.

3.ఏ విషయాన్నైనా కొత్త కోణంలో చూడండి. ఇతరుల దృక్పథం నుంచి సమస్యలను పరిశీలిస్తేనే పరిష్కారానికి కొత్త ఆలోచనలు మొగ్గ తొడుగుతాయి.

4. లక్ష్యానికి దగ్గరి దారి ఎంచుకోవద్దు. అప్పుడే మీ సామర్థ్యాలు బలోపేతం అవుతాయి.

5.విభిన్న నేపథ్యం ఉన్న వ్యక్తులతో సంబంధాలు మెరుగుపర్చుకోండి. తద్వారా మీ జ్ఞానం విస్తృతం కావడంతో పాటు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయి.

Like me
02/08/2024

Like me

Address

Vishakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when I TDP మనం_మన తెలుగుదేశం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share