Golagani Hari Venkata Kumari,Mayor

Golagani Hari Venkata Kumari,Mayor Greater Visakhapatnam Municipal Corporation (GVMC) ex.Mayor.

14/04/2026
14/04/2026

రాజ్యాంగశిల్పి అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకల్లో మహా విశాఖ నగర మాజీ మేయర్ శ్రీమతి శ్రీ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్

08/04/2026

వైఎస్ఆర్సిపి మహిళ నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ మీద నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీలో పాల్గొన్న మహావిశాఖ నగర మాజీ మేయర్ శ్రీమతి శ్రీ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్

21/12/2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా వృద్ధులకు మరియు పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో మహా విశాఖ నగర మాజీ మేయర్ శ్రీమతి శ్రీ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్

21/12/2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో మహా విశాఖ నగర మాజీ మేయర్ శ్రీమతి శ్రీ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌ॥శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల...
04/06/2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌ॥శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు తేదీ 04-06-2025 బుధవారం నాడు మహా విశాఖ నగర మాజీ మేయర్ శ్రీ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో ఆరిలోవ ప్రాంతం నుండి 200 ద్విచక్ర వాహనాలు మరియు 10 ఆటోలతో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి ర్యాలీ గా వెళ్లడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా విశాఖ మాజీ మేయర్ శ్రీమతి గొలగాని హరి వెంకట కుమారి గారు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆరిలోవ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లు అప్పారావు గారు ,మక్బూల్ గారు ,షాకీనా గారు మరియు నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు,మాజీ వాలంటీర్లు పాల్గొనడం జరిగింది

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు విశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, పార్టీలకు అతీతంగా ప్రతి కార్పొరేటర్ కు...
22/04/2025

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు విశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, పార్టీలకు అతీతంగా ప్రతి కార్పొరేటర్ కు సమదృష్టితో మనస్ఫూర్తిగా నిధులు కేటాయిస్తూ విశాఖ అభివృద్ధికి కృషి చేశానని, ఈ 4 సంవత్సరాలలో ఎంతో జటిలమైన సమస్యలను పరిష్కరించామని , కరోనా వ్యాప్తి సమయంలో ప్రజలకు అండగా ఉంటూ వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపామన్నారు.ముఖ్యంగా అడివి వరం నుండి గోశాల రోడ్డు, జగదాంబ నుండి పూర్ణ మార్కెట్ పాత పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్లు, "బస్ బే" లు, జంక్షన్ల అభివృద్ధి మొదలైనవి చేపట్టడం జరిగిందని. నేడు నాకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి కార్పొరేటర్ కు తెలుసని వారికి నిధులు కేటాయింపులో ఎటువంటి వివక్షతను చూపలేదని అలాగే నాలుగు సంవత్సరాల ఒక నెలపాటు మేయర్ క్యాంప్ కార్యాలయం నా సొంత భవనాన్ని వినియోగించుకున్నందున కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని , అలాగే విశాఖ నగరం మరో ఢిల్లీ కాకూడదని ఉద్దేశంతో విశాఖ నగరం కాలుష్యానికి గురికాకుండా, ప్రజల ఆరోగ్యమే పరమావధిగా భావిస్తూ ప్రతి సోమవారం తమ సొంత వాహనాన్ని వదిలి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో జీవీఎంసీ కి రావడంతో పాటు జీవీఎంసీ ఉద్యోగులను కూడా వారి వాహనాలను వదిలి వచ్చేలా అవగాహన కల్పించామన్నారు. జీవీఎంసీ మేయర్ గా తమ క్యాంపు కార్యాలయంలో జీవీఎంసీ ఏర్పాటుచేసిన ప్రతి వస్తువును తిరిగి జీవీఎంసీకి అప్పజెప్పడం జరుగుతుందని ఆమె తెలిపారు. విశాఖ నగర అభివృద్ధికి కృషి చేస్తూ,నగర ప్రజలకు ఎన్నో సేవలను అందించిన సంతృప్తిని ఆశ్వాదించే భాగ్యానికి నోచుకోకుండా , అన్ని వార్డుల్లో కార్పొరేటర్లకు వార్డు అభివృద్ధి పనులను మేయర్ గా మంజూరు చేసిన నాకు నేడు మేయరు పై అవిశ్వాస తీర్మానం పెట్టిన తీరు ఎంతో కలచి వేసిందని, ఆవేదనకు లోనయ్యానని ఆమె విషాదాన్ని వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో యాదవ కులానికి చెందిన బీసీ మహిళనైన నేను విశాఖ నగర మేయర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి స్వచ్ఛ సర్వేక్షన్ లో ఎన్నో ర్యాంకులు సాధించామని అందుకు ఇప్పటివరకు సహకరించిన నగర ప్రజలకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ,కార్పొరేటర్లకు పార్టీ పెద్దలకు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి, వైఎస్ఆర్సిపి నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వారికి, మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ వారికి,మాజీ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ వారికి, కురసాల కన్నబాబు వారికి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు,మరీ ముఖ్యంగా నా విశాఖ నగర ప్రజలుకు ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుతూ మేయర్ గా సెలవు తీసు కుంటున్నాని నగర మేయర్ శనివారం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.

సమాజాభివృద్ధిలో కీలకపాత్ర మహిళలదేనగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి విశాఖపట్నం మార్చ్ 8: సమాజాభివృద్ధిలో మహిళలదే కీలక పా...
08/03/2025

సమాజాభివృద్ధిలో కీలకపాత్ర మహిళలదే

నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి

విశాఖపట్నం మార్చ్ 8: సమాజాభివృద్ధిలో మహిళలదే కీలక పాత్రని. నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం మద్దిలపాలెం కృష్ణ కాలేజీ రోడ్లో ఉన్న వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షరాలు పేడాడ రమణకుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తి, రెడ్డి వైయస్సార్ సిపి నాయకులు తిప్పల దేవన్, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, పలువురు కార్పొరేటర్లు వైయస్సార్ సిపి నాయకులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని సమాజాభివృద్ధిలో మహిళలదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. స్త్రీ లేనిదే జననం లేదు స్త్రీ లేనిదే జగత్తు లేదు యావత్ సమాజానికి మహిళలే మూలమని తెలిపారు. అలాంటి మహిళపై ఇప్పటికీ అక్కడక్కడ అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. మహిళలు ఇటు ఇంటిని చక్కదిద్దుతూ మరో ప్రక్క ఉద్యోగాలు చేస్తున్నారని అంతట ఓర్పు స్త్రీ మూర్తికే ఉందని పేర్కొన్నారు. ప్రతి ఏట మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా మహిళలందరికీ మేయర్ శుభాకాంక్షలు తెలిపారు.
తదుపరి మహిళలందరికీ సన్మాన కార్యక్రమం తో పాటు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం నారీమణులకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

కాలుష్య రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దుదాం.- నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారివిశాఖపట్నం, మార్చి 3: కాలుష్య రహిత నగరంగా...
03/03/2025

కాలుష్య రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దుదాం.

- నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి

విశాఖపట్నం, మార్చి 3: కాలుష్య రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దుటకు ప్రజలందరూ సహకరించాలని, విశాఖ నగరంలో కాలుష్య నియంత్రణకు సహకరిస్తూ ప్రతి ఒక్కరు వారంలో ఒకరోజు వ్యక్తిగత వాహనాలను విడనాడి ప్రజా రవాణాను వినియోగించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి విశాఖ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె తమ క్యాంపు కార్యాలయం నుండి ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులో జివిఎంసి ప్రధాన కార్యాలయానికి చేరుకొని అందరికీ ఆమె స్ఫూర్తినిచ్చారు.

ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నగరంలో కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా కాలుష్య నియంత్రణకు ప్రజలు వారంలో ఒకరోజు వ్యక్తిగత వాహనాలను విడనాడి ప్రజా రవాణాలను ఉపయోగించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న దృష్ట్యా జీవీఎంసీ ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించాలనే నిర్ణయం మేరకు జివిఎంసి అధికారులు, ఉద్యోగులు ప్రజా రవాణాలను ఉపయోగిస్తున్నారన్నారు. ఎకో-వైజాగ్ అభివృద్ధి నేపద్యంలో ఎకో-జీరో పొల్యూషన్ కార్యక్రమాలలో భాగంగా విశాఖ నగర పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నియంత్రణకు జివిఎంసి అనేక అవగాహనా పరమైన కార్యక్రమాలు నిత్యం చేపట్టడం జరుగుతోందన్నారు. నగరంలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు, నగర ప్రజలు సహకరించి వారంలో ఒక్కరోజు ప్రజా రవాణా వ్యవస్థను లేదా సైకిళ్లను ఉపయోగించడం వలన విశాఖ నగరంలో కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రించవచ్చునని అందుకు అందరూ సహకరించాలని నగర మేయర్ విజ్ఞప్తి చేశారు.

Address

18-97, Peda Gadili , Near Sivalayam, Old Dairy Form(post)
Visakhapatnam
530040

Alerts

Be the first to know and let us send you an email when Golagani Hari Venkata Kumari,Mayor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Golagani Hari Venkata Kumari,Mayor:

Share