జనసేన 'కృష్ణ జిల్లా'

జనసేన 'కృష్ణ జిల్లా' Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from జనసేన 'కృష్ణ జిల్లా', Political organisation, Vijayawada.

Full Video Link; https://www.youtube.com/live/e-LHFpIG0Hw?feature=shareకత్తిపూడి సభలో వారాహి వాహనం మీద నుండి మొదటి ప్రసం...
15/06/2023

Full Video Link; https://www.youtube.com/live/e-LHFpIG0Hw?feature=share

కత్తిపూడి సభలో వారాహి వాహనం మీద నుండి మొదటి ప్రసంగం చేసిన పవన్ కళ్యాణ్ గారు.....

ప్రసంగంలోని ముఖ్యాంశాలు 👇

👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ఎవరు చెప్పినా మొదట మోకరిల్లాల్సింది అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి 🙏.. వారికి నివాళులు అర్పిస్తున్నాను.....

👉 నేడు చేగువేరా జయంతి.....
ఆయనకి నా నివాళులు.....

👉 నన్ను పాలించేవాడు నాకంటే నిజాయితీ పరుడు అయ్యుండాలి....ఇక్కడ ఎవరూ నిజాయితీగా లేరు నేను తప్ప....
అందుకే నేను ఎవరికీ తలవంచను....

👉 వైసీపీని పడగొట్టేది నేనే.....
పథకాలు ఆపడానికి నువ్వెవిడివి??
వేలకోట్ల స్కాం చేసినా నువ్వా క్లాస్ వార్ గురించి మాట్లాడేది....

👉 ప్రతి ఒక్కరి వైసీపీ నాయకుల నీచ చరిత్ర నాకు తెలుసు.... నా నాలుగేళ్ల బిడ్డను కూడా తిడతారు వీళ్ళు.... నా సంస్కారం వారిని కాపాడుతుంది....

👉 నేను ఇక్కడికి రాకూడదు అని సెక్షన్ 30 పెట్టిన వ్యక్తి ఈ పిరికివాడు జగన్ రెడ్డి...

👉 అమరావతి మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని.... ఇది మా షణ్ముఖ వ్యూహం లో చెప్పాను...

👉 గోదావరి నది ఈ నేలను విడిచి ఎక్కడికీ వెళ్ళకుండా ఇక్కడే ఉంటుంది..... పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా అంతే..... ఇక్కడే ఉంటాడు....

👉 మద్యపాన నిషేధం అని చెప్పి నాలుగేళ్ళ నుండి మద్యం అమ్ముతున్నాడు.. ఆడబిడ్డలను ఇబ్బంది పెడుతున్నాడు....
సీపీఎస్ లాంటి హామీలు తప్పాడు......

👉 మెజారిటీ నామినేటెడ్ పదవులు రెడ్డి కులానికి కట్టబెట్టారు.....

👉 ఒక కులానికి సంబంధించిన రాజధాని అని ప్రతిపక్షంలో ఉండగా ఎందుకు చెప్పలేదు....5000 ఎకరాలు ఇంకా ఎక్కువ కావాలని ఎందుకు అడిగారు?? అమరావతి మాత్రమే రాజధాని అని మాట మీద నిలబడింది నేను మాత్రమే...

👉 కౌలు రైతుల చావుకి ప్రతి రైతుకి లక్ష రూపాయలు ఇచ్చిన మనిషిని నేను....ఇది సంక్షేమం అంటే...నా కష్టంతో చేసిన సేవ ఇది.....
నేను బటన్ నొక్కితే అభివృద్ధి అనుకునే మూర్ఖుడికి చెబుతున్నాను......
సంపద సృష్టిస్తేనే అభివృద్ధి..... ట్యాక్స్ పెంచి పాలన చేస్తే కాదు....

👉 అప్పులు చేసి అభివృద్ధి అంటే నేను ఒప్పుకోను....

👉 చేతులకు మీ బాబాయ్ నెత్తురు అంటించుకున్న వ్యక్తులని కాపాడే నువ్వా క్లాస్ వార్ గురించి మాట్లాడేది... నువ్వు పాపం పసివాడివా???

👉 సొంత బాబాయ్ కూతురు ఒంటరిగా పోరాడుతుంటే ఆవిడని చూసి నవ్వుతున్న వ్యక్తి జగన్ రెడ్డి....

👉 ఇంటి పన్నులు పెంచారు, రిజిస్ట్రేషన్ పన్నులు పెంచారు...... అప్పులు - పన్నులు మాత్రమే ఈ పాలన.. అంతకంటే ఏం లేదు....

👉 ఫీజ్ రీయింబర్స్మెంట్ చేయడం లేదు..యువతకు అన్యాయం జరుగుతోంది....

👉 నా కులాన్ని నేను పోగొట్టుకోను..‌నేను గౌరవిస్తాను.... నా రెల్లి, మాల,బీసీ,శెట్టిబలిజలు, బ్రాహ్మణులు, ప్రతి ఒక్కరి కోసం నిలబడతాను... జగన్ రెడ్డి లాగా 550 పోస్టులను రెడ్డి కులంతో నేను నింపను... దామాషా ప్రకారం వెళ్తాను..... మీకు మాట ఇస్తున్నాను ....

👉 ఎవరైనా నన్ను తిడితే వారిని ఒక పార్టీ ప్రతినిధిగా,‌కేవలం ఒక వ్యక్తిగా చూస్తాను... అతని కులాన్ని కాదు... సోషల్ ఇంజినీరింగ్ చేసే వ్యక్తిని నేను...

👉 జనసేన కులాల మధ్య సయోధ్య పెంచడానికి ఉంది...ఉదాహరణ శెట్టిబలిజ-కాపు కులాల కలయిక.... వైసీపీ సృష్టించిన కోనసీమ అల్లర్లు వారి కులాల మధ్య చిచ్చు పెట్టే సంస్కృతి....

👉 ఆంధ్రప్రదేశ్ ఆస్తులు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండే నాయకులు ఎవరూ అడగలేదు.... నేను ఒక్కడిని తప్ప.....

👉 సినిమా చూసినప్పుడు కలిసి ఎలా చూస్తారో , పార్టీలో , సమాజంలో అలానే కలిసి ఉండండి అందరూ.....

👉 స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే డబ్బు కావాలి..‌యువత కోసం నేను మాట్లాడతాను... మీరే ఈ దేశానికి నావికులు... షణ్ముఖ వ్యూహంలో నేను చెప్పిన విధానం అదే....పెట్టుబడి కోసం 10 లక్షల రూపాయలు నియోజకవర్గానికి 500 మందికి ఇస్తాం... ఉద్యోగాలు సృష్టించేది వాళ్ళే.... మన సంపద మనమే సృష్టించుకుందాం.....ఈ కార్యక్రమానికి సంవత్సరానికి 10000 కోట్ల రూపాయలు అవసరం....దోపిడీని ఆపితే ఇది సాధ్యం... నేను చేసి చూపిస్తాను..‌పెట్టుబడి పెట్టిస్తుంది జనసేన ప్రభుత్వం

👉 పంచాయితీలకు నిధులేవి??? ఏం చేస్తున్నారు ఆ పంచాయితీల డబ్బు??? చెత్త మీద మీద పన్ను ఎందుకు వేస్తున్నారు...... పంచాయితీలకు డబ్బు పంచాయితీలకు వచ్చేలా జనసేన ప్రభుత్వం చేస్తుంది .....

👉 క్లాస్ వార్ గురించి మాట్లాడే జగన్ రెడ్డి పేదల మీద ఈ పన్నుల బాదుడు ఏంటి??
కార్మికుల నిధుల 450 కోట్లు లాగేసిన నువ్వా క్లా‌స్ వార్ గురించి మాట్లాడేది??

👉 ఇసుక కార్మికులు బీసీ వారి కుల వృత్తి....
ఆ సంపద సృష్టిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది.... కానీ చిత్తూరు జిల్లా రెడ్డికి ఇసుక కాంట్రాక్ట్ కి అప్పజెప్పింది జగన్ రెడ్డి.. జనసేన ప్రభుత్వంలో ఇసుక ఉచితం..

19/04/2021
18/07/2020

Dr.Fauci USA Covid-19
గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూ తెలుగు అనువాదం మీముందు ఉంచుతున్నాను.
ఈ ఇంటర్వ్యూ సారాంశం మీరు చదివిన తరువాత వేరే వారికి కూడా share చేయండి.
డా.రాధా తోట
******************************************************************
"చికెన్ ఫాక్స్ "
ఇది ఓ వైరస్ ద్వారా వచ్చే వ్యాధి.
చాలా మందికి ఈ "చికెన్ ఫాక్స్ "వ్యాధి సోకి తగ్గి ఉంటుంది.
కానీ వారు ఈ వ్యాధి తగ్గాక దీనిని గురించి ఎక్కువగా ఆలోచించడం చేసి ఉండరు.
వారికి తెలియని విషయం ఏమిటంటే ఈ వ్యాధికి కారణ మైన వైరస్ వారి శరీరం లో ఎప్పుడూ ఉండి పోతుంది..
ఒక్కోసారి ముసలి తనంలో ఈ
"చికెన్ ఫాక్స్ "వైరస్ విజృంభించి నరాలలోనుండి చర్మం మీద బాధాకరమైన పొక్కుల రూపంలో బైటికి వస్తుంది..
ఈ వైరస్ కేవలం కొన్ని వారాలు మాత్రమే మీతో పాటు ఉంటుంది అనుకోవద్దు. తరువాత కూడా మీ ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది..
ఈ వైరస్ ఎన్నో సంవత్సరాలు గా తన ప్రభావం మనుషుల పై చూపుతూనే మన మధ్య నే ఉంది..
దీని మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి.
అందువలనే మనకు ఈ వైరస్ శరీరం లో శాశ్వతం గా ఉండి పోతుంది తరువాత కాలంలో కూడా దీని ప్రభావం మనిషి శరీరం పై చూపుతుంది అని తెలిసింది..
******************************************************************
"హెర్పిస్"
అనేది కూడా ఓ వైరస్.
ఒక సారి మనిషి శరీరంలో ఇది ప్రవేశించితే శాశ్వతం గా ఉండి పోతుంది..
మానసిక ఒత్తిడి కి ఆందోళన కు గురయ్యే సమయంలో ఈ వైరస్ విజృంభించి దాని లక్షణాలు బైటికి వస్తాయు..
నోటిలో నెప్పి తో కూడిన చిన్న పొక్కుల రూపంలో ఇది బైటికి వస్తుంది..
ఈ పొక్కుల ద్వారా ఈ వ్యాధి పక్క వారికి కూడా సోకుతుంది..
ఈ విషయాలు ఈ వైరస్ మీద సంవత్సరాలు తరబడి చేసి న పరిశోధనల వలన బైటికి వచ్చాయు..
ఎంతో కాలంగా ఈ వైరస్ మానవ జాతిని పీడిస్తూనే ఉంది..
******************************************************************
"హెచ్ ఐ వీ"
ఈ వైరస్ గురించి కూడా చాలా కాలం క్రితమే తెలిసింది..
ఈ వైరస్ శరీరంలో ని వ్యాధి నియంత్రణ శక్తి ని బలహీన పరచి మనిషి ఇతర బాక్టీరియా,వైరస్ ల బారిన పడే అవకాశం కల్పిస్తుంది..
ఈ వైరస్ వలన వచ్చేవ్యాధి లక్షణాల జాబితా చాలా పెద్దది..
ఈ లక్షణాలు వ్యాధి వలన వచ్చే రుగ్మతలు మనిషిని బ్రతికి నంత కాలం పీడిస్తూనే ఉంటాయు..
ఈ వ్యాధి కి మెరుగైన వైద్యం అందుబాటులో కి వచ్చి వ్యాధి గ్రస్తులు కొంత మెరుగైన జీవితం గడపడం డానికి కొన్ని పదుల సంవత్సరాలు పట్టింది..
ఒక సారి ఇది మీ శరీరం లో ప్రవేశించిన ట్లయుతే అది శాశ్వతం గా ఉండి పోతుంది. దీనిని పూర్తిగా నశింప చేసే వైద్యం ఇప్పటికీ అందు బాటులో లేదు.
ఈ వైరస్ వ్యాధిగ్రస్తుల శరీరం నుండి పన్ను వసూలు చేస్తూనే ఉంటుంది..

"హెచ్ ఐ వీ" వ్యాధి గ్రస్తులు గుండె జబ్బులు,మూత్ర పిండాల్లో వ్యాధులు,షుగర్ వ్యాధి,ఎముకల జబ్బులు,లివర్ జబ్బులు ఇంకా కొన్ని రకాల కాన్సర్ వ్యాధుల బారిన పడే అవకాశం మిగిలిన వారి కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది...
ఈ విషయాలు మనకు ఎందుకు తెలిశాయి అంటే ఈ "హెచ్ ఐ వీ"
వైరస్ మానవ జాతి ని ఎన్నో సంవత్సరాలు గా పీడిస్తూనే ఉంది..
దీని మీద ఎన్నో విస్తృతమైన పరిశోధనలు శాస్త్రవేత్తలు చేశారు...
******************************************************************
ఇక ఇప్పుడు COVID-19
ఈ వైరస్ చాలా తొందరగా వ్యాపిస్తుంది..
పూర్తి స్థాయి లక్షణాలు,మానవ శరీరం పై ఆరోగ్యం పై దీని ప్రభావం చాలా కొద్దిగా మాత్రమే తెలుసు...
ఇది ఆరంభం మాత్రమే..
ఇప్పటి వరకు తెలిసిన COVID-19 వ్యాధి లక్షణాలు..
1.జ్వరం
2.తొందరగా అలసిపోవటం
3.దగ్గు
4.న్యూమోనియా
5.చలి/వణుకు
6.గాలి అందక పోవడం
7.ఊపిరితిత్తులు చెడిపోవడం (శాశ్వతం గా)
8.రుచి తెలియకుండా పోవడం(నగరాలకు సంభంధించి వ్యాధి లక్షణం)
9.గొంతు నెప్పి
10.తల నెప్పి
11.శ్వాస లో ఇబ్బంది
12.మానసిక ఒత్తిడి ఆందోళన
13.విరోచనాలు
14.వికారం,వాంతులు
15.ఆకలి లేక పోవడం
16.చిన్న వయసువారిలో కూడా కోవిడ్ బారిన పడిన వారిలో" హార్ట్ ఎటాక్ " రావడం జరిగింది
17.కళ్ళు ఉబ్బసం
18.రక్తం గడ్డ కట్టడం
19.బిట్స్ రావడం
20.లివర్ చెడిపోయినట్టా పోవడం
21.మూత్ర పిండాల్లో చెడి పోవడం
22.శరీరం పై దద్దుర్లు
23.కాలి వేళ్ల దెబ్బ తినడం

COVID-19 పరీక్ష చేయుంచు కొని పాజిటివ్ వచ్చిన వారు 60 రోజుల తరువాత కూడా కోలుకోక పోవడం కొంత మంది లో జరిగింది..
చాలామంది కొన్ని వారాల పాటు నలతగా ఉండి కోలుకున్న తరువాత కూడా ఉన్నట్టుండి మళ్ళీ క్షీణించడం జరిగింది.
సియాటి ల్ లో ఓ వ్యక్తి 62 రోజులు హాస్పిటల్ లో ఉండి కొంత మెరుగైన తరువాత (అప్పటి కే 1.1 మిలియన్ డాలర్లు బిల్ అయ్యింది)
కూడా ఇంకా ఎంతో కోలుకోవలసిన పరిస్థితి లో ఉన్నాడు.
******************************************************************
ఇక MIC-C
అంటే Multi system inflammatory syndrome.
ఇది చిన్న పిల్లల్లో కనిపిస్తూంది.
ఈ విధమైన కోవిడ్ వ్యాధి లో శరీరం లోని వివిధ అవయవాలు వాచి పోతాయు.
గుండె ,ఊపిరితిత్తులు,మెదడు,చర్మం,
కళ్ళు,కడుపు,ప్రేగులు ఈ వాపు కు గురవుతాయు.

ఈ MIS-C తో బాధ పడే పిల్లల కు ఉండే లక్షణాలు..
1.కడుపు నొప్పి
2.వాంతులు
3.విరోచనాలు
4.మెడనొప్పి
5.శరీరం పై దద్దుర్లు
6.కళ్ళు ఎర్రబడటం
7.ఎక్కువ గా అలసిపోవటం
అరుదుగా వచ్చినా సరే ఈ MIS-C వలన రోగి చనిపోవడం జరుగుతోంది.
*********************************
ఈ COVID-19 వ్యాధి ఎన్నో సంవత్సరాలు గా మన మధ్య లేదు.
కేవలం 6 నెలల క్రితమే దీనిని గుర్తించడం జరిగింది..
ఎవరికీ ఈ వ్యాధి గురించి పూర్తి అవగాహన లేదు.
ఈ వ్యాధి సోకిన వారికి భవిష్యత్తు లో ఎటువంటి సమస్యలు ఎదురవుతోంది తాయో చెప్పలేం.
మనకి ఈ వ్యాధి గురించి ఏమి తెలియదో ఇప్పటి కీ తెలియదు.
జాగ్రత్త లు తీసుకొనే వారిని "పిరికివారిగా" లెక్కగట్టే వారికి,
చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడానికి ,
వారిని వారి పక్క వారిని కూడా రక్షించు కోవడానికి ఇష్ట పడని వారిని
నేనొక్కటే ప్రశ్న అడుగుతాను
1.మనకెంత ధౌర్యం?
2.పెద్ద వీరుడిలా ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలో నెట్ట డానికి మీకెంత ధౌర్యం?
3.నీ వలన మామూలు ప్రజలు ఈ వ్యాధిబారిన పడ డానికి నువ్వు స్వాగతిస్తున్నావు అంటే
నీకెంత ధౌర్యం?

ఎవరు కొద్ది పాటి నలతతో బైట పడతారు?
ఎవరు చనిపోయే వరకూ వెళతారు?
మాకు తెలిసిన విషయం ఏమిటంటే
కొంతమంది లో ఈ వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.
20,30 ఏళ్ళ వయస్సు వారూ చనిపోయారు.
మారధాన్ రన్నర్స్ కూడా చనిపోయారు.
అత్యంత బలంగా ఆరోగ్యంగా ఫిట్నెస్ కి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేవారూ ఈ వ్యాధి బారిన పడి చనిపోయారు..
వైద్య శాస్త్రం లో నిష్టాతుల కంటే నీకెక్కువ తెలుసా?
మాకిప్పటికీ ఈ కోవిడ్ 19 గురించి చాలా విషయాలు తెలియవు.
ఈ వైరస్ ఎంత సులువుగా వ్యాపిస్తుంది నీకు తెలుసా ?
అందుకే శ్రద్ధ గా వినండి
ఈ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు....
1.మాటిమాటికీ చేతులు కనుక్కోవడం
2.సామాజిక దూరం పాటించడం
3.ఇతరులను సాధ్యమైనంత గా కలవకూరు పోవడం
4.మాస్క్ ధరించటం
5.దగ్గిర నప్పుడు తుమ్మి నప్పుడు ముఖానికి చెయ్యు అడ్డు పెట్టు కోవడం
6.ఎవరూ మీ ముఖాన్ని తాకకుండా చూసుకుని కోవడం..
7.ఎక్కువ గా తాకే ఉపరి తలాలను శానిటైజ్ చేయడం

ఇవన్నీ ఎంత ఎక్కువగా పాటిస్తే అంత ఈ COVID-19 బారిన పడకుండా తప్పించు కోవచ్చు..
ఈ విధమైన జాగ్రత్త ల వలన వైద్యులపై అధిక భారం పడకుండా ఉంటుంది..
అత్యవసర సేవలు అందించే వైద్యులు సరైన సేవలు అందించలేక చతికిలపడే పరిస్థితి కల్పించ వద్దు..
ఈ జాగ్రత్తల వలన అనవసరమైన బాధ ,చావు నివారించ వచ్చు.
ఈ విధంగా మీరు సైంటిస్టులకు వైద్యులకు కొంత సమయం ఇవ్వ గలిగితే ఈ వైరస్ గురించి విశ్లేషించడానికి వీలు పడుతుంది.
ఈ వైరస్ గురించి పూర్తి స్థాయి లో విశ్లేషించి వెంటనే వచ్చే అవాంతరాలు
కొంత కాలం తరువాత వచ్చే ప్రమాదాలు గురించి తెలుసుకోవచ్చు.
చివరిగా నేను ప్రత్యేకంగా చెప్పేదేమిటంటే
దీనిని
"కేవలం ఓ వైరస్ "
అనుకోవద్దు..
ఏముంది లే వచ్చి తగ్గి పోతుంది
అనుకోవద్దు..
అలా అనుకోవడం అంటే
మీరు నిర్లక్ష్యంగా
బద్ధకంగా
మనస్సాక్షి లేకుండా
ఆలోచిస్తున్నారు,ప్రవర్తిస్తున్నారు
అని అర్ధం..
*********************************
మూలం Dr .Fuci USA కోవిడ్-19 గురించిన ఇంటర్వ్యూ
స్వేచ్ఛానువాదం: డా.రాధా తోట
India

19/06/2020

🙏🏾🙏🏾🙏🏾

04/06/2020

జనసేన మేనిఫెస్టోలోలో పెట్టిన ముఖ్యమైన పథకం 60 ఏళ్ళు దాటిన సన్నకారు రైతులకు 5000 పెన్షన్ ఇస్తాము అని పెట్టిన పవన్ కళ్యాణ్ గారు...

ఇప్పుడు కేంద్రం కూడా 3 వేలు ఇస్తా అనడం హర్షణీయం. వృద్ధాప్య పెన్షన్ తో పాటు ఈ 3 వేలు కలిపి రాష్ట్రం కూడా కొంత వేసుకొని రైతులకు మొత్తం ఇవ్వాలి..

ఆయన ఓడిపోయిన ఆయన ఐడియాలజీ నిలబడింది💪✊✊,, ఇప్పుడయినా రైతులకు మంచి జరగాలి🙏🙏🙏

జై కిసాన్🌾🌾🌾 జై హింద్🇮🇳



https://economictimes.indiatimes.com/news/economy/agriculture/new-scheme-to-provide-social-security-pension-to-farmers/articleshow/69890993.cms

PM Kisan Maan Dhan Yojana: Farmers can get ‘free’ Rs 3000 pension for life – Here’s how-https://www.financialexpress.com/money/pm-kisan-samman-nidhi-to-fund-kisan-maan-dhan-modi-govt-pension-scheme-here-is-how/1701727/

ఇందులో కొన్ని తేల్చిన బాబాయ్-అబ్బాయ్ బంధం లేదని నేను నమ్ముతా....చంద్రబాబే పింక్ డైమండ్ దొబ్బేసాడన్నారు మన సాయి రెడ్డి గా...
01/06/2020

ఇందులో కొన్ని తేల్చిన బాబాయ్-అబ్బాయ్ బంధం లేదని నేను నమ్ముతా....

చంద్రబాబే పింక్ డైమండ్ దొబ్బేసాడన్నారు మన సాయి రెడ్డి గారు... మరి ఇంత వరకు చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు ???

టిడిపి నాయకుల మీద అనేక కేసులు నమోదయ్యాయి మరియు చంద్రబాబు గారి మీద ఓటు కు నోటు కేసు లు నడుస్తున్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వం టిడిపి పార్టీ నాయకులను మరియు చంద్రబాబుని ఈగ కూడా వాలకుండా చాలా బాగా చూసుకుంటున్నారు ఇదేనా మీ 60:40 రాజకీయాలు.

మొన్నటికి మొన్న అమరావతి రాజధాని భూమి సేకరణలో భారీ అవినీతి జరిగిందని ఆర్థిక మంత్రి వారు ఆధారాలతో సహా ఒక వీడియో క్లిప్పింగ్ వేశారు. మరి ఇప్పటి వరకు టిడిపి అవినీతి పరుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ???

ఆంధ్రప్రదేశ్ ప్రజలు లోకి బాగా వెళ్లిన 5 ఇయర్స్ టీడీపీ అవినీతి పధకాలు....

ఓటుకి నోటు కేస్,
హుద్ హుద్, తితిలీ స్కాం,
పుష్కరాలు లో 29 హత్యలు,
అమరావతి ల్యాండ్ స్కాం,
రాజధాని నిర్మాణం స్కాం,
వెంకటేశ్వర స్వామి నగలు స్కాం & పింక్ డైమండ్ మాయం,
పోలవరం స్కాం,
అగ్రిగోల్డ్ స్కాం,
ఇసుక స్కాం,
ఎర్ర చందనం,
కాల్ మనీ, సెక్స్ రాకెట్,
ఆడవాళ్ళని ఈడ్చి తన్నటం,
సుజనా బ్యాంకు స్కాం,
ఉన్న ఉద్యోగాలు పీకటం,
ఎల్లో మీడియాకి డబ్బులు,
బ్రోకర్ వ్యవస్థ అభివృద్ధి,
కోర్ట్ స్టేలు,
డేటా స్కాం,
వోట్లు స్కాం,
హత్యలు, హత్యాయత్నాలు,
నిరుద్యోగం,
108, ఆరోగ్య శ్రీ నిర్వీర్యం,
బినామీ వ్యవస్థ,
MLA లని కొనటం,
కమిషన్లు వ్యవస్థ,
దోమల పై స్కాం,
ఎలుకల స్కాం,
రైన్ గన్స్ స్కాం,
అన్నా కాంటీన్ స్కాం,
600 హామీలు అమలు కాకపోవడం,
రైతులు ఆత్మ హత్యలు,
దళితుల,మైనార్టీ ల అరెస్టులు,
సోషల్ మీడియా కేసులు,
విద్యా వ్యవస్త నాశనం,
అడ్డ దారి మంత్రి వర్గం.....
ఇంకా ఎన్నో అరాచకాలు...
ఇంకా ఎన్నెన్నో..

మడమ తిప్పం మాట తప్పం అనే డైలాగులు కట్టిపెట్టి మీకు నిజంగా దమ్ముంటే టిడిపి నాయకుల అవినీతిని నిరూపించి ఆస్తులను జప్తు చేసి ప్రజలు ముందు అవినీతి దోషులుగా నిరూపించండి.

ఎన్నికల లో మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. ఒకవేళ అలా చేయకపోతే జనసేన పార్టీ మీ 60:40 రాజకీయాలు ను తప్పకుండా ప్రజల ముందు బహిర్గతం చేస్తాము....

జనసేన మరో విజయం..  కంగ్రాట్స్ Satyanarayana Bolisetty గారు..అంథ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోక గట్టి మొట్టికాయ... ...
01/05/2020

జనసేన మరో విజయం..

కంగ్రాట్స్ Satyanarayana Bolisetty గారు..

అంథ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోక గట్టి మొట్టికాయ...
•••••••••••••••••••••••••••••••••••••••••••••
అంథ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో పేదలందరికీ ఇళ్ళు అనే పథకంలో భాగంగా
విలువైన భూములు గల కాకినాడ పట్టణంలోని 50 వార్డులకు చెందిన 24,388 మంది లబ్ధిదారులను ఎంపికచేసి, వారికి నగరంలో పూర్తి స్థాయిలో భూమి లభించక పోయే సరికి, కాకినాడ పోర్టు అభివృద్ధి కోసం కేటాయించిన భూములు 1978/79 నుంచి అభివృద్ధి చేయలేదు అనే ఉద్దేశంతో, సర్వే నంబరు.376 పార్టు, 375/1, 1985/పార్టు మరియు 2004/పార్టులో ఉన్న 100 ఎకరాల పైన మడ అడవులు ఉన్న భూమిని కలెక్టరు గారు ప్రజా ప్రయోజనాల నిమిత్తం తీసుకోని పేదలకు ఇళ్ళు పథకం అమలు కింద జత చేసి, మడ అడవులను నరికివేసి, అక్కడ నేలను పూర్తిగా మట్టి పోసి చదును చేయటం, అందునా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ నిభంథనలు దేశమంతా అమలులో ఉన్న సమయంలోనే చేయటంతో, స్థానికంగా ఉన్న దుమ్మల పేట, పర్లో పేట గ్రామాలకు చెందిన పల్లేకారులు రోడ్డు పైకి వచ్చి అథికారుల ప్రవర్తనను నిరసించటం జరిగింది లాక్ డౌన్ నిభంథనలను కూడా ఉల్లంఘన చేసి.

ఈ విషయాన్ని ప్రముఖ పర్యావరణ పరిరక్షణవేత్త శ్రీ బోలిశెట్టి సత్యనారాయణ గారి దృష్టికి స్థానిక పల్లేకారులు తీసుకురావటంతో అయన సదరు మడ అడవులు కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిథిలో ఉన్న భూములుగా గుర్తించి, దీని పైన ప్రథాన మంత్రి, కేంద్ర అటవీశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర పర్యావరణ సంస్థల దృష్టిలో పెట్టినప్పటికి, మడ అడవుల నరికివేత కోనసాగుతూ ఉండటంతో, సి.అర్.జెడ్. నిబంధనలు, 2011 మరియు 2019; పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986; అటవీ పరిరక్షణ చట్టం, 1980; వన్య ప్రాణుల పరిరక్షణ చట్టం, 1972 జాతీయ జీవ వైవిధ్య చట్టం,2002 మరియు రాజ్యాంగ అథికరణాలు.48-A, 51-A(g) ఉల్లంఘనలు కింద జాతీయ హరిత ట్రిబ్యునల్, చెన్నై లో O.A.No.65/2020ని ది.16-04-2020న దాఖలు చేయటం జరిగింది. దీని పైన కేంద్ర, రాష్ట్ర అటవీ శాఖలను, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టరు లను ప్రతివాదులగా చేర్చటం జరిగింది.

దీని పైన జాతీయ హరిత ట్రిబ్యునల్ లో నేడు అనగా ది.30-04-2020న వాదనలు జరిగినవి.

దీని పైన రాష్ట్ర హైకోర్టులో కూడా ఇదే అంశం పైన కేసు దాఖలు చేయటం జరిగింది మరియు యథాతథ స్థితిని కోనసాగించాలని ది.27-04-2020న ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది, హైకోర్టు ఉత్తర్వులు నేపథ్యంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ అత్యవసరంగా ఈ కేసును వినాల్సిన అవసరం లేదంటూ వాదించగా, పిటిషనరు తరపు న్యాయవాది సదరు వాదనను తిప్పికోడుతూ, హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ, ఇంకా అక్కడ పనులు జరుగుతున్నాయి అనే వాదన చేయటంతో, జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పందించి దిగువ తెలిపిన విథంగా ఉత్తర్వులు మథ్యంతరంగా జారీ చేయటం జరిగింది. అవి

1) ఐదుగురు సభ్యులతో కూడిన పరిశీలన బృందాన్ని నియమించటం జరిగింది. దీనిని చెన్నైకి చెందిన కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖకు చెందిన ప్రాంతీయ కార్యాలయం సీనియర్ అథికారి నేతృత్వం వహిస్తారు. దీనిలో రాష్ట్ర కోస్తా తీర ప్రాంతం అథారిటీ సీనియర్ అథికారి, రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాథికారి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు మరియు కాకినాడ జిల్లా అటవీ అథికారి సభ్యులుగా ఉంటారు.

2) సదరు పైన తెలిపిన కమిటీ నేటి నుంచి అరు నెలల వెనుక వరకు కేంద్ర అటవీ శాఖ అథ్వర్యంలో ఉన్న కాకినాడ మడ అడవుల సాటిలైట్ చిత్రాల అథారంగా సదరు ప్రాంతాన్ని పరిశీలన చేయాలి. దీనికి చెన్నై ప్రాంతీయ కార్యాలయం సహకారం అందించాలి.

3) సదరు కమిటీ కాకినాడ మడ అడవులు నరికివేత ఏ స్థాయిలో జరిగింది, ఏంత మేరకు జరిగింది, ఏంత మేరకు మడ అడవులకు నష్టం జరిగింది, మరలా మడ అడవి పునరుద్ధరణకు ఏంత ఖర్చు అవుతుంది, మడ అడవులను నరకటం వలన పర్యావరణానికి ఏంత మేరకు నష్టం జరిగింది అనే వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలన, పరిశోధన చేసి మూడు నెలలో సదరు కమిటీ తన పూర్తి స్థాయి రిపోర్టును జాతీయ హరిత ట్రిబ్యునల్లో దాఖలు చేయాలి మరియు దాని కాపీలను పిటిషనరు, ప్రతివాదుల న్యాయవాదులకు కూడా అందచేయాలి.

4) ఒకవేళ సదరు మడ అడవులు ప్రాంతంలో ఏదైనా నిర్మాణాలు జరిగిన పక్షంలో, అవి జాతీయ హరిత ట్రిబ్యునల్ తుది తీర్పుకు మాత్రమే లోబడి ఉంటాయి.

5) ఒకవేళ పై తెలిపిన కమిటీ నివేదికలో మడ అడవుల నరికివేత జరిగినట్లుగా తెలిసినచో, దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత ఉన్నతాథికారులు భాథ్యులు అవుతారని, పర్యావరణానికి జరిగిన నష్టానికి పూర్తి స్థాయిలో వారే భాథ్యులు అవుతారని, సదరు నష్టపరిహారం పూర్తిగా వారి నుంచే స్వాధీనం చేసుకుంటామని కూడా తెలియ చేసింది.

6) తదుపరి విచారణను ది.18-08-2020కి వాయిదా వేయటం జరిగింది.

ఇది నిజంగా రాష్ట్ర పర్యావరణవేత్త శ్రీ బోలిశెట్టి సత్యనారాయణ గారు సాథించిన మరోక ఘనవిజయం. అయన మా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ కావటం, మాకు గర్వకారణం. జనసేన పార్టీకి చెందిన 7 మూల సిద్దాంతాలలో చివరిదైన పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి అనే సిద్దాంతం పరిరక్షణ కోసం అయన నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు.

గతంలో చంద్రబాబు ప్రభుత్వం పైన కూడా కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాల పైన 100 కోట్లు రుపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అనే ఉత్తర్వులు జారీ చేయటానికి కారణమయ్యారు. కానీ నేటి రాష్ట్ర ప్రభుత్వం అటువంటిది ఏమీ జరగలేదు అంటూ, జాతీయ హరిత ట్రిబ్యునల్ లో అఫిడవిట్ దాఖలు చేసి, చంద్రబాబు అవినీతి బయట పడకుండా కప్పేట్టేశారు.

ఇప్పుడు కూడా కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిథిలో ఉన్న కాకినాడ మడ అడవులు నరికివేత వలన పర్యావరణానికి నష్టం జరిగిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, సంభందిత రాష్ట్ర ఉన్నతాధికారులను భాథ్యులు చేస్తూ ఉత్తర్వులు తేవటంలో సఫలం అయ్యారు.

ఈరకంగా అంథ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న శ్రీ బోలిశెట్టి సత్యనారాయణ గారికి, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏర్పడిన లాక్ డౌన్ నిభంథనలను ఉల్లంఘన చేసి మరీ అలుపేరగని పోరాటం చేసిన కాకినాడకు చెందిన స్థానిక మత్సకార ప్రజలకు కృతజ్ఞతలు.

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when జనసేన 'కృష్ణ జిల్లా' posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to జనసేన 'కృష్ణ జిల్లా':

Share