03/10/2024
Date : 3-10-24
Press note
అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన జంబో కమిటీ 56 మందితో ఉపయోగం లేదు ఎవరికి ప్రయోజనం లేదు
ఈ జంబో కమిటీ వలన అటు భక్తులకు ఇటు అధికారులకు తలపోట్లు తప్పవు.
56 మంది జంబో కమిటీ ఎక్కడ కూర్చుంటారు? చైర్మన్ రూమ్ లో కూడా 56 మంది కూర్చునేందుకు సదుపాయం లేదు? కొండపైకి ఎలా వస్తారు? వీరు వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేసుకుంటారు? అసలు మీరు సేవ చేస్తారా లేక దర్శనాలు ప్రసాదాలని అమ్మవారి ఆలయ ఆదాయానికి గండి కొడతారా? ఉత్సవ కమిటీ సభ్యులు వారి బంధువుల్ని మిత్రులను కుటుంబ సభ్యులు దర్శనాల పేర్లతో ఖచ్చితంగా అందరికీ ఇబ్బందులు కలగజేసే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తి కావస్తున్న ఇంతవరకు పాలకమండలి ఏర్పాటు చేసుకోలేని అసమర్థ పరిస్థితిలో ఉన్నారంటే ఇంతకన్నా కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు ఏమన్నా ఉందా? లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు చెబుతున్నారు. అధికారులందరూ కొత్తవారే ఉత్సవాలు ఎంతో పకడ్బందీగా సమన్వయంతో అన్ని శాఖల వారు ఎలా నడుపుతారొనని మాకు చాలా ఆందోళనగా ఉంది మరల ఈ జంబో కమిటీ వలన తలనొప్పులు తప్పవు. మూల నక్షత్రం రోజున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించే రోజున ఈ జంబో కమిటీ వలన గందరగోళం తప్పదు. దీనివలన అమ్మవారి భక్తులకు ఇబ్బందులే.
సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర ధర్మం ఎక్కడుంది? విజయవాడ నగరంలో అమ్మవారి దసరా ఉత్సవాలుకు వేసినా తాత్కాలిక కమిటీలో జనసేన పార్టీ విజయవాడ నుండి అవకాశం పొందిన వారెవరో ఒక్కసారి పరిశీలించండి. జనసేన పార్టీ విజయవాడ తరఫున అవకాశం పొందిన జంబో కమిటీలో సామాజిక న్యాయం సామాజిక సమతుల్యత లోపించింది. దసరా ఉత్సవాలకు ఏర్పాటుచేసిన జంబో కమిటీలో జనసేన పార్టీ తరఫున అమ్మవారి ధార్మిక సేవ మండలి సభ్యులలో ఒక్కరికి కూడా అవకాశం ఎందుకు కల్పించలేదు. అమ్మవారి ఆలయం 38వ డివిజన్లో ఉన్నది అక్కడ జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షుడు బిసి వర్గానికి చెందిన వ్యక్తి కనీసం తాత్కాలికే కమిటీలో అయిన అతనికి స్థానం కల్పించి ఉంటే బాగుండేది.
పోతిన వెంకట మహేష్
వైఎస్ఆర్సిపి నాయకులు విజయవాడ