25/02/2026
విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్లు చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం పై వెంటనే చర్యలు తీసుకోవాలి.
తప్పుడు ప్రచారం చేస్తున్న శ్రీ లీలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
ఏలూరు జిల్లా డీఈఓ ను సస్పెండ్ చేయాలి
Sai Kumar Aisf రాష్ట్ర ఉపాధ్యక్షులు
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక స్ఫూర్తి భవన్ నందు ఏలూరు నగరంలో శ్రీ చైతన్య పాఠశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పాత్రికేయులు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సాయికుమార్ మాట్లాడుతూ ఒకవైపు విద్యా సంవత్సరం పూర్తిగా లేదు మరొకవైపు ప్రారంభం కాలేదు కానీ శ్రీ చైతన్య పాఠశాలల యాజమాన్యం మాత్రం మా పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి . విద్యార్థులు మూడు నెలలు ముందుగా జాయిన్ అయితే 30% , రెండు నెలలు ముందు జాయిన్ అయితే 20% అయ్యో ఒక నెల ముందు జాయిన్ అయితే 10% డిస్కౌంట్ ఇస్తామని బ్రాండ్ నెంబర్ జరగా పెట్టుకొని పోస్టల్ వేసి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏఐఎస్ఎఫ్ గా విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రుల పక్షాన శ్రీ లీలాను మేము అడుగుతున్నాం.... నీవు ఏమన్నా శ్రీ చైతన్య పాఠశాలలో చదువుకున్నావా లేక కళాశాలలో చదువుకున్నావా....? నీవు ఎక్కడ కూడా నీ విద్యను అటు పాఠశాలలో కానీ కళాశాలలో గాని శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యను అభ్యసించినటువంటి నీవు ఏ విధంగా విద్యార్థులారా మీరు శ్రీ చైతన్య పాఠశాలల్లో చదివితే మంచి మార్కులు వస్తాయి కళాశాలలో చదివితే ఎంబిబిఎస్ సీట్లు వస్తాయని ప్రచారం చేస్తావు...? తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి స్త్రీలపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఎందుకంటే విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు కళ్ళు కనిపించేటివి చెవిలకు వినిపించేటివి నమ్మి విద్యార్థులు జాయిన్ అయిన తర్వాత అక్కడ వారికి విద్య సరిగా లేకపోవడం మరియు మౌలిక వసతి లేకపోవడం ఫీజులు మాత్రం లక్షల లక్షలకు దండుకుంటున్నారు కానీ విద్యలో మాత్రం శూన్యం . ఒకటి... ఒకటి... రెండు రెండు ర్యాంకులన్నీ మావే మావే అంటారు మేము అడుగుతున్నాం శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యాన్ని మీ ర్యాంకులు ఏ బ్రాంచ్ లో వచ్చాయి చెప్పండి అప్పుడు తెలుస్తుంది విద్యార్థులు ఏ విధంగా మీ కళాశాలలో పాఠశాలలో చేరుతారు ఆ విధంగా చెప్పకుండా తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థుల్ని మోసం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు అని తెలిసినా ఏలూరు జిల్లా డీఈవో మేడం గారు చెవలికి వినిపిస్తున్న కళ్ళకి ఏలూరు నగరం వ్యాప్తంగా కనిపిస్తున్న పోస్టర్ రూపంలో వారు చేసే ప్రచారాన్ని మద్దతు పలికినట్టుగానే ఉంది ఎందుకంటే ఎటువంటి చర్యలు తీసుకోకుండా మౌన వహించడం స్పష్టంగా కనిపిస్తుంది . కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తున్నటువంటి విద్యాశాఖ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. విద్యాశాఖ అధికారి నారా లోకేష్ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మూతబడ్డ 4500 ప్రభుత్వ పాఠశాలను పున ప్రారంభిస్తామన్నాడు కానీ అది కూడా చేయకపోగా పుట్టగొడుగుల్లాగా కార్బెట్ ప్రైవేట్ విద్యాసంస్థలు పుట్టుకొస్తున్న వాటిపైన ఎటువంటి ప్రక్షాళన చేయకపోగా మౌనం వహిస్తున్నారు. ఎందుకని మేము అడుగుతున్నాం.... ఎందుకంటే కూటమి ప్రభుత్వం మంత్రివర్గంలో ఉన్నటువంటి మీయొక్క మంత్రులవే ఈ యొక్క కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలని మౌనం వహిస్తున్నారా ఇది సరైనది కాదు పేద మధ్యతరగతి విద్యార్థులు యొక్క రక్తాలు తాగుతున్నటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు లేని యెడల ఏలూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ముందస్తు అడ్మిషన్లను ప్రత్యక్షంగా అడ్డుకుంటామని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ నాయకులు సిద్దు, కృష్ణ, చంటి తదితరులు పాల్గొన్నారు.