Swadeshi Jagaran Manch - AP

Swadeshi Jagaran Manch - AP Swadeshi Jagaran Manch - Andhra Pradesh

19/02/2026
22/01/2026



శ్రీకాకుళం, 22 జనవరి 2026:

స్వదేశీ జాగరణ్ మంచ్, ఆంధ్రప్రదేశ్ – ఉత్తర ఆంధ్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “రన్ ఫర్ స్వదేశీ – 3 కి.మీ పరుగు” కార్యక్రమం గురువారం శ్రీకాకుళం పట్టణంలో ఉత్సాహభరితంగా, విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కాలేజ్), శ్రీకాకుళం విద్యార్థులు, HPN డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, మాజీ సైనికులు (Ex-Servicemen), స్వదేశీ అభిమానులు, మహిళలు మరియు సాధారణ ప్రజలు కలిపి సుమారు 500 మంది పాల్గొన్నారు. పరుగు కార్యక్రమం ఆర్ట్స్ కాలేజ్ నుండి ప్రారంభమై RTC కాంప్లెక్స్ మీదుగా బాలగ జంక్షన్ వరకు కొనసాగింది.

పరుగు కార్యక్రమం అనంతరం ఆర్ట్స్ కాలేజ్ సెమినార్ హాల్‌లో “స్వదేశీ వస్తువుల వినియోగం ద్వారా ఆర్థిక అభివృద్ధి” అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించబడింది. ఈ ఉపన్యాస కార్యక్రమానికి స్వదేశీ జాగరణ్ మంచ్ – ఉత్తర ఆంధ్ర విభాగ కన్వీనర్ డా. హెచ్. శేషగిరి గారు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. వై. పోలినాయుడు, ఇంగ్లీష్ లెక్చరర్ డా. శేషి భూషణ్, ఆర్ఎస్ఎస్ నుండి వసంత్ రావు ముఖ్య అతిథులు మరియు వక్తలుగా పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడుతూ, స్వదేశీ ఉత్పత్తుల వినియోగం ద్వారా దేశ ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని, ప్రతి పౌరుడు తన దైనందిన జీవితంలో స్వదేశీని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టి. ప్రవీణ్, వి. ప్రవీణ్, పి. బాలకృష్ణ (మాజీ సైనికుడు), P. రాజశేఖర్, Ex-Service Sangh ప్రతినిధి ఎస్. రామారావు, Ex-Service మహిళా ప్రతినిధి పద్మావతి, ఇంగ్లీష్ లెక్చరర్ చంద్రభూషణ్ గారు తదితరులు చురుకుగా పాల్గొన్నారు. మాజీ సైనికులు మరియు మహిళల చురుకైన పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వక్తలు మాట్లాడుతూ, యువత స్వదేశీ భావనను స్వీకరించి ఆచరణలో పెట్టినప్పుడే ఆత్మనిర్భర భారత్ లక్ష్యం సాకారమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమం శాంతియుతంగా, క్రమబద్ధంగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు.

ధన్యవాదములతో,

స్వదేశీ జాగరణ్ మంచ్
ఆంధ్రప్రదేశ్
ఉత్తర ఆంధ్ర విభాగం

21/01/2026

20th జనవరి 2026, ఉదయం, వివేకానంద మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థులు స్వదేశీ పరుగు లో పాల్గొనడం జరిగింది.

పరుగు అనంతరం ముఖ్య వక్త గా శ్రీ. లక్ష్మణ్ జీ - విభాగ్ ప్రచారక్ RSS, యుగంధర్ జీ RSS ప్రాంత కార్యకారిణి సభ్యులు, శ్రీ మహేష్ చుండూరు గారు All India Radio Asst. డైరెక్టర్, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు SJM ప్రాంత సంయోజక్, కీర్తి చంద్ రెడ్డి SJM ప్రాంత యువ ప్రాముఖ్ విద్యార్థులకు స్వదేశీ వస్తు వాడకం , స్వదేశీ వ్యవహార శైలి గురించి సందేశం ఇచ్చారు

21/01/2026

20- 01- 2026
సాయంత్రం

స్వదేశీ ఉత్పత్తుల వినియోగంపై అవగాహన కల్పించేందుకు కడపలో ‘రన్ ఫర్ స్వదేశీ’ నిర్వహించారు.
కార్యక్రమానికి *స్వదేశీ జాగరణ మంచ్ రాష్ట్ర కన్వీనర్, శ్రీనివాస్ రెడ్డి గారు నాయకత్వం వహించారు*

KSRM వైస్ చైర్మన్ డా. కందుల చంద్ర ఒబుల్ రెడ్డి గారు ముఖ్య అతిధి గా విచ్చేసి, పరుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
RSS ప్రాంత కార్యవర్గ సభ్యులు యుగంధర్ జీ , మరియు స్వదేశీ జగరణ్ మంచ్ ప్రాంత యువ ప్రాముఖ్ కీర్తి చంద్ర రెడ్డి ప్రసంగం చేశారు. ఈ పరుగు లో దాదాపు 600 మంది విద్యార్థులు, 70 మంది కడప ప్రముఖులు పాల్గొన్నారు.

12/01/2026

11/01/2026 ఉదయం స్వదేశీ పరుగు కార్యక్రమం "రెడ్డి సేవా సమితి" ఆధ్వర్యం లో జరిగింది.

ఇందులో లెక్కల కొండా రెడ్డి గారు, SI ప్రతాప్ రెడ్డి గారు, రెడ్డి సేవా సమితి కమిటీ సభ్యులు దుడ్ల ఆది నారాయణ రెడ్డి గారు, YVU prof. రామ సుబ్బారెడ్డి గారు, Adv .రవీంద్రనాథ్ రెడ్డి గారు, మహేష్ జీ rss జిల్లా ప్రచారక్ గారు, స్వదేశీ జాగరణ మంచ్ కీర్తి చంద్ రెడ్డి మరియు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు

Address

100 Feet Road, Autonagar
Vijayawada
520007

Alerts

Be the first to know and let us send you an email when Swadeshi Jagaran Manch - AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Swadeshi Jagaran Manch - AP:

Share

Category