సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాయలసీమ రాష్ట్ర శాఖ

  • Home
  • India
  • Vijayawada Buckinghampet
  • సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాయలసీమ రాష్ట్ర శాఖ

సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాయలసీమ రాష్ట్ర శాఖ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాయలసీమ రాష్ట్ర శాఖ, Political Party, Vijayawada Buckinghampet.

Congratulating our Rayalaseema State Fighter Sri Ali Ahmed elected as a member of the Samajwadi Forward Bloc Party Parli...
29/05/2018

Congratulating our Rayalaseema State Fighter Sri Ali Ahmed elected as a member of the Samajwadi Forward Bloc Party Parliament Committee ..............

సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పార్లమెంట్ కమిటీ సభ్యునిగా ఎన్నికైన మన రాయలసీమ ముద్దుబిడ్డ శ్రీ అలీ అహమ్మద్ గారికి శుభాకాంక్షలు..............

నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలతో ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా కృషి చేస్తున్న జాతీయపార్టీ సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ నందు...
10/05/2018

నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలతో ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా కృషి చేస్తున్న జాతీయపార్టీ సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ నందు సభ్యత్వం నమోదు చేసుకోవడానికి ఆసక్తి కలవారు సంప్రదించండి.........!!!

వినోద్ కుమార్
సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ
అనంతపురం జిల్లా అధ్యక్షులు
సెల్ : 7702480771

కొంతమంది ఇలాంటి చీడపురుగులు సమాజంలో ముఖ్య నాయకుల మధ్య తిరుగుతూ వారితో ఫోటోలు దిగి వారి పరువుకి భంగం కలిగే విధంగా ప్రవర్త...
02/05/2018

కొంతమంది ఇలాంటి చీడపురుగులు సమాజంలో ముఖ్య నాయకుల మధ్య తిరుగుతూ వారితో ఫోటోలు దిగి వారి పరువుకి భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తు వారి ప్రతిష్టను కూడా దిగజారుస్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబునాయుడు గారిని అవమానపరుస్తున్నామనుకొని స్వాతంత్ర సమరయోధులను అవమానపరుస్తున్నారు.
అసలు మీరు కడుపుకి అన్నం తింటున్నారా లేక ఇంకేదైనా తింటున్నారా. సుభాష్ చంద్రబోస్ గారి పేరు పలకడానికి కూడా అర్హతలేని వారు కూడా ఆయనను అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవలసివస్తుంది......
అసలు ఆయన గురించి కొంచమైనా తెలుసా ఇలాంటి వారికి మీరు ఇలాగే స్వాతంత్ర సమరయోధులను కించపరిస్తే వారి అభిమానులమైనా మేము చూస్తుకుర్చోము పిచ్చి కుక్కలను కొట్టినట్టు పరిగెత్తించి పరిగెత్తించి కొడతారు ఖబడ్దార్.........

వెంటనే ఫేస్ బుక్ నుండి ఆ పోస్టింగ్ తొలగించి క్షమాపణలు చెప్పకపోతే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ దేశవ్యాప్తంగా పార్టీ శాఖల తరపున సన్నాహాలు చేస్తున్నది.......

గమనిక : ఇలాంటి కొంతమంది ఇలాంటి వారు రాజకీయ పార్టీల పేర్లు, ప్రజా సంఘాల పేర్లు చెప్పుకుంటూ ఘర్షణలు స్పష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులారా ఇలాంటి సంఘవిద్రోహశక్తులతో జాగ్రత్త

కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.......సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ.........
01/05/2018

కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.......

సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ.........

02/04/2018

సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతపురం నగరములోని N.G.O Home నందు నిన్న ఘనంగా నిర్వహించబడినది. ఈ కార్యక్రమమలో రాష్ట్ర కార్యదర్శి అలీ అహమ్మద్ గారు ప్రసింగిస్తూ రాయలసీమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశిస్తూ రాయలసీమ ప్రజలకు న్యాయం చెయ్యలేని పక్షంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలను మొదలుపెట్టాలని భావించి సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో చర్చించి దేశ వ్యాప్తంగా ఒకే సారి నిరసనలు తెలపాలని కార్యచరణ రూపొందించడమైనది.

జై రాయలసీమ జైహింద్

సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంఏప్రిల్ నెల 1వ తేదీన అనంతపురం జిల్లా నందు నిర్వహించాలని పార్...
24/03/2018

సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ఏప్రిల్ నెల 1వ తేదీన అనంతపురం జిల్లా నందు నిర్వహించాలని పార్టీ ముఖ్యనేతలు నిర్ణయించడమైనది.
ప్రజా సమస్యలపైనా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా విషయంలో అలాగే ముఖ్యంగా రాయలసీమతో జరుపుకున్న శ్రీభాగ్ ఒడంబడిక విషయంలో పాలకుల నిర్లక్ష్యధోరణి మీద అలాగే రాయలసీమ రాష్ట్ర సాధన గురించి పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలు చర్చించాలని నిర్ణయించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ "మురళీధర్ దేశ్ పాండే" గారు హాజరుకానున్నారు.
అలాగే పార్టీ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షకులు శ్రీ వెంకట రమణారావు గారు, పార్టీ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ శ్రీ అల్లాఉద్దీన్ గారు, కార్యదర్శి శ్రీ అలీ అహమ్మద్ గారు తదితర రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు.
కావున రాష్ట్ర ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది.....

వేదిక : NGO HOME, ప్రెస్ క్లబ్ ప్రక్కన, అనంతపురం‌.

సమయం : 10 : 00 AM - 4 :00 PM

వివరాలకు :
వినోద్ కుమార్
సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ
అనంతపురం జిల్లా కార్యదర్శి
సెల్ : 9676026419

జైరాయలసీమ. జైహింద్

ఆ.. యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. బ్రిటీష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే సెల్యూట్ చేస్తారు. పన్నెండేళ్ల...
22/03/2018

ఆ.. యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. బ్రిటీష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే సెల్యూట్ చేస్తారు. పన్నెండేళ్లకే ఆ వీరుడు భరతజాతి విముక్తి కోసం కంకణం కట్టాడు. పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగుపెట్టాడు. ఇరవైమూడేళ్లకే బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిల్చాడు. ఆయనే భగత్ సింగ్.

భగత్ సింగ్... ధైర్యానికి ప్రతీక. దేశభక్తికి ప్రతిరూపం. భగత్ సింగ్... ధీరత్వానికి మారుపేరు. నవతరానికి ఒక స్ఫూర్తి. భయమెరుగని భారతీయుడు భగత్ సింగ్. అంతులేని ధైర్యానికి కొలమానం. ఉరితాడుతో ఉయ్యాలలూగిన భారత తేజం. ఆ విప్లవవీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రే లేదు.

1907 సెప్టెంబర్ 28న నేటి పాకిస్తాన్లోని లాయల్పూర్ జిల్లా బంగాలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించారు. చిన్ననాటి నుంచే నరనరాల్లో దేశభక్తిని ఇనుమడింపచేసుకున్నాడు భగత్ సింగ్. అందుకే దశాబ్దాలు గడిచినా ఆ విప్లవవీరుడి త్యాగం ఇంకా సజీవంగానే ఉంది. దేశవిదేశాల్లో ఎన్నో పోరాటాలకు ఆజ్యం పోసింది. కోట్లాదిమందిలో తెగువ నింపింది.
ఉరకలేస్తున్న యవ్వనం దేశానికి అంకితం
ఉరకలేస్తున్న యవ్వనాన్ని దేశానికి అంకితం చేశాడు. పరవళ్లు తొక్కే పౌరుషాన్ని స్వాతంత్ర్యం సాధించుకునేందుకు పణంగా పెట్టాడు. 12 ఏళ్ల వయసులోనే జలియన్ వాలాబాగ్ దారుణాలను చూసి భగత్ రగిలిపోయాడు. సామ్రాజ్యవాద బ్రిటీష్ పాలకులపై కసి పెంచుకున్నాడు. 14 ఏళ్ల ప్రాయంలోనే మహాత్ముడి పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకాడు. గాంధీ అకస్మాత్తుగా సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపేయడం భగత్ సింగ్ కు నచ్చలేదు. అందుకే తన పంథాలోనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు నచ్చే వేదికలను వెదుక్కున్నాడు. 1926లో నవజవాన్ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి స్వాతంత్య పోరాటాన్ని కొనసాగించాడు.
సైమన్ కమిషన్..పోలీసుల దాడి.. లాలాలజపతిరాయ్ మృతి
1928లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు పోలీసుల దాడిలో... లాలాలజపతిరాయ్ చనిపోవటంతో భగత్ సింగ్ నెత్తురు ఉడికిపోయింది. సహచరులతో కలిసి జాతీయ అసెంబ్లీలో బాంబులు వేయాలన్న ప్లాన్ వేశారు. విజిటర్స్ గ్యాలరీ నుండి బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలు వెదజల్లారు.
1931 మార్చి 23న లాహోర్లో ఉరి
బ్రిటీష్ హై కమిషనర్ సాండర్స్ ను కాల్చి చంపాడనే అభియోగం కింద భగత్ సింగ్ తో పాటు రాజ్ గురు, సుఖ్ దేవ్ లను 1931 మార్చి 23న లాహోర్లో ఉరి తీశారు. అనంతరం అత్యంత పాశవికంగా భగత్ సింగ్ మృతదేహాన్ని తెగ నరికి దహనం చేశారు. కానీ భగత్ సింగ్య ఎవరిని చంపలేదని సాక్షాత్తు పాకిస్ధాన్ పోలీస్ శాఖ లాహోర్ న్యాయస్ధానానికి తెలిపింది. దీన్ని బట్టి చూస్తే పోరాటయోధుడిని కావాలనే బ్రిటిష్ ప్రభుత్వం హత్య చేసిందని తెలుస్తోంది. ఉరిని తప్పించుకునే అవకాశం ఉన్నా... తన ఉరి దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని పెంచుతుందని చావును ఆహ్వానించాడు.
చరిత్ర వీరుల్ని, విప్లవ ధీరుల్ని పుట్టిస్తుంది. అలాంటి పోరాట యోధుడే భగత్ సింగ్. భరతమాత సంకెళ్లను తెంచేందుకు, ఉరితాడునే పూలమాలగా మెడలో వేసుకున్న ధైర్యశాలి. త్యాగం, ఆదర్శానికి భగత్ సింగ్ నిదర్శనం. అదే నేటి వెలుగు దారి.

రాయలసీమ జిల్లాలలో రోజు రోజుకి మహిళలపై ఆకతాయిల వేధింపులు ఎక్కువ అయ్యాయి. అలాంటి ఆకతాయిల మీద ప్రత్యేక నిఘా ఉంచి వారిని అదు...
12/03/2018

రాయలసీమ జిల్లాలలో రోజు రోజుకి మహిళలపై ఆకతాయిల వేధింపులు ఎక్కువ అయ్యాయి. అలాంటి ఆకతాయిల మీద ప్రత్యేక నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకొని చట్టపరంగా కఠినమైన శిక్షలు విధించి మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నిర్ణయించింది. అందుకోసం నిన్న (12-3-2018) సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాయలసీమ కార్యదర్శి శ్రీ అలీ అహమ్మద్ గారు అమరావతిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళి అక్కడి ఉన్నతాధికారులను సంప్రదించి వారికి రాయలసీమలోని పరిస్థితులను వెళ్ళడించి తక్షణమే ఇలాంటి వారి వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకొని పూర్వపు బాధితులకు న్యాయం చేయాల్సిందిగా కోరడమైనది...........

జై సుభాష్ చంద్రబోస్

సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిందాబాద్

జై రాయలసీమ. జైహింద్

నెల్లూర్ జిల్లా వెంకటగిరిలో నిన్న (3-3-2018) జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ ...
04/03/2018

నెల్లూర్ జిల్లా వెంకటగిరిలో నిన్న (3-3-2018) జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మురళీధర్ దేశ్ పాండే గారు, పార్టీ రాష్ట్ర పర్యవేక్షకులు శ్రీ రమణారావు గారు, రాష్ట్ర నాయకులు శ్రీ అల్లాఉద్దీన్ గారు, రాయలసీమ కార్యదర్శి శ్రీ అలీ అహమ్మద్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాలపై కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఫారూఖ్, వినోద్ కుమార్, అజీజుల్లా, అమన్ సుహైల్, నెల్లూరు జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాబోవు ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాలలో పోటీ చెయ్యడం కోసం సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు చర్చించడమైనది......

జైహింద్

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ముసలిపేడు గ్రామంలోని 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన శిథిలావస్థలో ఉన్న పురాతన శివాలయాన్న...
04/03/2018

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ముసలిపేడు గ్రామంలోని 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన శిథిలావస్థలో ఉన్న పురాతన శివాలయాన్ని పునర్నిమించడానికి శంకుస్థాపన సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాయలసీమ కార్యదర్శి శ్రీ అలీ అహమ్మద్ గారి చేతుల మీదుగా చెయ్యించడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. భారతదేశ హిందూ సాంప్రదాయాలను గౌరవించే వ్యక్తి మన అలీ అహమ్మద్ గారి చేతులమీదుగా ఈ కార్యక్రమం పూర్తి చెయ్యించడం దేశం హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర నాయకులు అల్లాఉద్దీన్ గారు, ఫారూఖ్ గారు, అనంతపురం జిల్లా అధ్యక్షులు వినోద్ కుమార్ గారు, మైనార్టీ నాయకులు అజీజ్, అమన్ సుహైల్, ముబారక్ మరియు పార్టీ కార్యకర్తలు, ముసలిపేడు గ్రామప్రజలు పాల్గొనడం జరిగినది.

జైహింద్

ఆడది అర్థరాత్రి ఒంటరిగా తిరినప్పుడే మనదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని పెద్దలు చెప్పారు. కాని మనదేశంలో పట్టపగలు...
27/02/2018

ఆడది అర్థరాత్రి ఒంటరిగా తిరినప్పుడే మనదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని పెద్దలు చెప్పారు. కాని మనదేశంలో పట్టపగలు కూడా ఒంటరిగా తిరగలేని పరిస్థితి. సమస్య ముందు పుట్టి ఆడపిల్ల తరువాత పుట్టిందేమో మనదేశంలో. ఆడపిల్ల అనగానే అర్థాంతరంగా ఎంతోమందిని తల్లి గర్భంలోనే చంపేస్తున్నారు. ఎలాగోలా పుట్టారు అంటే నా దేశంలో పసిపాప నుండి పండుముదుసలి దాకా ఏ ఒక్కరికి రక్షణ లేదు. ఆ మాత్రం దానికి మన ప్రభుత్వాలు సంవత్సరానికి రెండు సార్లు కొన్ని కోట్లు ఖర్చుపెట్టి స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అని వేడుకలు చేస్తున్నారు. ఈ వేడుకలకు ఖర్చుపెట్టే డబ్బులో సగం ఆడవారి రక్షణ కోసం ఖర్చు పెడితే నా దేశం వేరేలా ఉండేది. కనీసం తప్పు చేసిన వాడికైనా కఠిన శిక్షలు విధిస్తారా అంటే అదీ లేదు. పరాయి దేశాల్లో స్త్రీని వేధిస్తే ఎలాంటి కఠినశిక్షలు విధిస్తారో మన దేశంలో కూడా అలాంటి శిక్షలను ఎప్పుడు అమలు చేస్తారో....??? నా దేశ ఆడ పడుచు ధ్యైర్యంగా ఎప్పుడైతే ఒంటరిగా తిరుగుతుందో ఆ రోజు వరకు నా దేశానికి స్వాతంత్రం రానట్టే. దేశంలో ఆడవారు స్వేచ్ఛగా తిరగలేనప్పుడు దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందని మన ప్రభుత్వాలు వేడుకలు జరుపుతున్నారు. తెల్లదొరల నుండి ఐతే స్వాతంత్రం సాధించాము కాని మనదేశంలోనే పుట్టిన నల్లదొరల నుండి ఎప్పుడు స్వాతంత్రం సాధిస్తామో.................

దేశానికి స్వాతంత్రం సాధించిన స్వాతంత్ర సమరయోధులు ఈ కాలంలో ఉండింటే మన దేశ ప్రస్తుత పరిస్థితులను చూసి దీని కోసమా మేము ఆంగ్లేయులతో పోరాడినది అని ఆత్మహత్య చేసుకునేవారేమో.....................???

రాయలసీమ రాష్ట్ర ప్రజలారా సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాయలసీమ రాష్ట్ర శాఖ తరపున మీకొక విజ్ఞప్తి.......రాష్ట్ర, కేం...
18/02/2018

రాయలసీమ రాష్ట్ర ప్రజలారా సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాయలసీమ రాష్ట్ర శాఖ తరపున మీకొక విజ్ఞప్తి.......

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిపాలనా ధోరణి వల్ల రాయలసీమ రాష్ట్రం ఎంత నష్టపోతోందో మీకు తెలుసా.......???
సీమ వాసులారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో మన సీమకు ఇచ్చిన వాగ్దానాలలో ఎన్ని నెరవేర్చారో మీకే తెలుసు. మన సీమతో శ్రీబాగ్ ఒప్పందం చేసుకొని దాదాపు 80 దశాబ్దాలు గడిచిపోయిన కూడా ఆ హామీలలో ఒక్కటి కూడా నేరవేర్చలేకపోయారు. మన సీమ హక్కుల కోసం మనం ఎన్ని నిరసనలు చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి స్పందన రాకపోవడం చూస్తేనే అర్థమవుతుంది. మన సీమ వాసులను కూరలో కరివేపాకుని తీసిపడేసినట్టు వారు ఎన్నికల సమయంలో మనల్ని ఓట్ల కోసం వాడుకొని అవతల పడేస్తున్నారని. రాయలసీమలో ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాల వల్ల రాయలసీమకు వారు ఏమి చెయ్యరు ఒకవేళ ఇస్తే ఏదైనా ప్యాకేజీని ఇవ్వచ్చు. ఆ ప్యాకేజీల వల్ల రాయలసీమ ప్రజలకు ఒరిగేదేమి లేదు. మనకు మన రాయలసీమ రాష్ట్రం ఏర్పడితేనే రాయలసీమ ప్రజల జీవితాలలో మార్పు చూడొచ్చు. భావితరాలకు బంగారు భవిష్యత్తును అందివ్వచ్చు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా రాయలసీమ చుట్టూ ఉన్న సరిహద్దులను మూసివేసి నిరసన తెలపాలని సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాయలసీమ రాష్ట్ర శాఖ కార్యదర్శి శ్రీ అలీ అహమ్మద్ గారు పిలుపునిచ్చారు. అందుకు రాయలసీమ రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని మనవి. అతి త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తాము....

వివరాలకు : సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాయలసీమ రాష్ట్ర శాఖ
అనంతపురం జిల్లా కార్యదర్శి
వినోద్ కుమార్
Cell : 7075363467

జై రాయలసీమ జైహింద్

Address

Vijayawada Buckinghampet

Website

Alerts

Be the first to know and let us send you an email when సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాయలసీమ రాష్ట్ర శాఖ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share