29/12/2020
Sc St ప్రజా సమైక్య రాష్ట్ర కమిటీ. .................... మరియు జిల్లా కమిటీ మరియు అనుబంధ కమిటీల నియామకం ..............................అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం లోని ఆర్ అండ్ బి అతిథి గృహం నందు వ్యవస్థాపక అధ్యక్షులు మద్దెల చెరువు మళ్లీ గారి అధ్యక్షతన కమిటీల నియామకం చేయడం జరిగింది రాష్ట్ర కమిటీ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కల్లూరు ప్రసాద్ బాబు, రాష్ట్ర కార్యదర్శిగా రాచేపల్లి శ్రీనివాసులు, అనంతపురం జిల్లా లీగల్ అడ్వైజర్ గా లాయర్ రాజేష్ నాయక్, హిందూపూర్ పార్లమెంట్ అధ్యక్షులుగా kn బాబు, ప్రధాన కార్యదర్శిగా నవీన్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గా ప్రమీల, హిందూపురం పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలిగా లక్ష్మీదేవమ్మ, ను నియమించడం జరిగింది మద్దెలచెరువు మళ్లీ మాట్లాడుతూ కొత్తగా నియామకమైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల కోసం ముందుండి పనిచేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల భూములు లాక్కొని ఇళ్ల పట్టాల పేరిట తీసుకొని తిరిగే వారికి ఒక సెంటు స్థలం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ పోతుంది. ఎస్సీ ఎస్టీ ల పైన దాడులు జరుగుతున్నా నోరుమెదపని హోమ్ మినిస్టర్ గారు దళిత ఎంపీలు,ఎమ్మెల్యేలు మీరు దళిత గిరిజనుల కుటుంబాలలో పుట్టడం సిగ్గుచేటు, ఎస్సీ ఎస్టీల అన్యాయాలపై పార్లమెంట్ మరియు అసెంబ్లీలలో గళం విప్పాలని లేదంటే మీ ఇళ్లను ముట్టడిస్తామని చెప్పి ఈ విధంగా మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాలచర్ల ముత్యాలు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనాథ్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ నాయక్, మైలారి, సంజీవ్ రాయప్ప, నరసింహప్ప, హనుమంతప్ప, సంజప్ప, నల్లమ్మ, నారాయణప్ప, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు