06/09/2021
స్వచ్ఛాంధ్ర కోసం కృషి చేస్తా.
స్వచ్ఛాంధ్ర సంస్థ కార్పొరేషన్ చైర్ పర్సన్ పోనకా దేవసేనమ్మ
గూడూరు :
గూడూరు పట్టణంలోని రాణిపేట ప్రాంతంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం జరిగింది.
స్వచ్ఛాంధ్ర సంస్థ కార్పోరేషన్ చైర్ పర్సన్ గా తొలి కార్యక్రమానికి పొనకా దేవసేనమ్మ హాజరయ్యారు.
పరిశుభ్రత పాటించేందుకు తడి,పొడి, ప్రమాదకరమైన చెత్తను వేర్వేరుగా చేసి బుట్టల్లో ఉంచేందుకు అవసరమైన
డస్ట్ బిన్ లను స్వచ్చంద సంస్థ కార్పోరేషన్ చైర్ పర్సన్ పొనకా దేవసేనమ్మ,ఎమ్మెల్యే వరప్రసాద్ రావు
చేతుల మీదుగా మహిళలకు అందజేశారు. ఒక్కొక్కరికీ మూడు బుట్టలు వంతున అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్వచ్చంద సంస్థ చైర్ పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ..
కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఊహించని పదవి వరించిందని సంతోషం వ్యక్తం చేశారు. నాకల నెరవేరుతుందని పేర్కొంటూ
గూడూరు అభివృద్దికి మార్గం సుగమం అయ్యిందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కోసం తనవంతు కృషి చేస్తామని,
ప్రజలు కూడా సహకరించాలన్నారు. తడి,పొడి, ప్రమాదకర చెత్తలను వేరుగా ఉంచాలని ఆమె పేర్కొన్నారు.