Telugu Desam Party : Varikuntapadu Mandal

Telugu Desam Party : Varikuntapadu Mandal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu Desam Party : Varikuntapadu Mandal, Political Party, Varikuntapadu.

ఇప్పటికే 2023-24 సంవత్సరానికి బీసీ, ఈబీసీ, సంచార జాతుల విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ.254.48 కోట్లను భరించడానికి అంగీక...
04/03/2025

ఇప్పటికే 2023-24 సంవత్సరానికి బీసీ, ఈబీసీ, సంచార జాతుల విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ.254.48 కోట్లను భరించడానికి అంగీకరించిన చంద్రబాబు గారు... తాజా బడ్జెట్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ప్రీ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పుల కోసం రూ.3377 కోట్లు కేటాయించారు.





పదో తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ను నివారించడానికి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంటర్ విద్యార్థులకు...
04/12/2024

పదో తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ను నివారించడానికి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించారు. ఫలితంగా హాజరు శాతం పెరిగింది. 2019లో జగన్ వచ్చి పథకాన్ని ఆపేసాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు.


రైతుల నుంచి ధాన్యం సేకరణకు వైసిపి హయాంలో నానా ఇబ్బందులు పడటం కాకుండా డబ్బులు ఇచ్చేందుకు రెండు నెలలకు పైగా పట్టేది. కూటమి...
04/12/2024

రైతుల నుంచి ధాన్యం సేకరణకు వైసిపి హయాంలో నానా ఇబ్బందులు పడటం కాకుండా డబ్బులు ఇచ్చేందుకు రెండు నెలలకు పైగా పట్టేది. కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేకుండా, నిరీక్షించకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేసి, 48 గంటల్లోగా డబ్బులు చెల్లిస్తున్నారు. ధాన్యం రకాలకు నిర్ణయించిన ధర కూడా వైసిపి కంటే, కూటమి సర్కారు చెల్లిస్తున్నది ఎక్కువ.



భ‌ద్ర‌తా చ‌ర్య‌లు, నేరాల నియంత్ర‌ణ‌కు డ్రోన్లను వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశ...
04/12/2024

భ‌ద్ర‌తా చ‌ర్య‌లు, నేరాల నియంత్ర‌ణ‌కు డ్రోన్లను వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం సాయంత్రం స‌చివాల‌యంలో బెంగ‌ళూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ తాము రూపొందించిన మ‌ల్టీ ప‌ర్ప‌స్ డ్రోన్ల డెమోని సీఎం ముందు ప్ర‌ద‌ర్శించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో, ర‌వాణా స‌దుపాయాలు లేని ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు డ్రోన్ల ద్వారా మందులు చేర‌వేయాల‌న్నారు. పంచాయ‌తీలు, మున్సిపాల్టీలో డ్రోన్ల వినియోగం పెంచి ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగ‌వ‌డానికి, దోమ‌ల నియంత్ర‌ణ‌కు మందుల పిచికారికి పెద్ద ఎత్తున ఉప‌యోగించుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అడ‌వుల్లో కార్చిచ్చు లాంటి ప్ర‌మాదాల‌ను డ్రోన్ల ద్వారా ప‌రిశీలించి త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పుర‌పాల‌క‌శాఖ మంత్రి పి. నారాయ‌ణ‌, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంట‌ర్‌ప్రైజెస్ శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌, సీఎం కార్య‌ద‌ర్శి పీఎస్ ప్ర‌ద్యుమ్న‌, పెట్టుబ‌డులు మౌలిక‌స‌దుపాయాల శాఖ కార్య‌ద‌ర్శి ఎస్‌. సురేష్ కుమార్‌, ఏపీ డ్రోన్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ కె. దినేష్ కుమార్ పాల్గొన్నారు.

Address

Varikuntapadu

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party : Varikuntapadu Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share