Telugu Desam Party: Tirupati

Telugu Desam Party: Tirupati Official Page of TDP Tirupati

రష్యాలోని అతిపెద్ద రోలింగ్ స్టాక్ తయారీదారు & అగ్రశ్రేణి  ప్ర‌పంచ‌ సరఫరాదారు అయిన ట్రాన్స్ మాస్ హోల్డింగ్ జెఎస్‌సీహెడ్ ఆ...
05/06/2026

రష్యాలోని అతిపెద్ద రోలింగ్ స్టాక్ తయారీదారు & అగ్రశ్రేణి ప్ర‌పంచ‌ సరఫరాదారు అయిన ట్రాన్స్ మాస్ హోల్డింగ్ జెఎస్‌సీ
హెడ్ ఆఫ్ గ్లోబల్ ఫైనాన్స్ నిర్వాహ‌కుల‌తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... శ్రీసిటీ (తిరుపతి జిల్లా)లోని ఆల్స్టోమ్ భారీ మెట్రో రోలింగ్ స్టాక్ సదుపాయానికి ఆనుకొని ఒక ప్రధాన రైలు విడిభాగాల అసెంబ్లీ ప్లాంట్‌ను స్థాపించాల‌ని ఆహ్వానించారు. దక్షిణాసియా అంతటా భారీ పారిశ్రామిక రైలు ప్రాజెక్టులకు సరఫరా చేయడానికి, ప్రత్యక్ష రహదారి అనుసంధానాన్ని ఉపయోగించుకుంటూ, అధిక సామర్థ్యం గల సరుకు రవాణా లోకోమోటివ్ & బోగీ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాల‌ని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మెట్రో నెట్‌వర్క్‌ల కోసం కీలకమైన సాంకేతిక ఏకీకరణను అందించే స్మార్ట్ సిగ్నలింగ్, ట్రాఫిక్ నియంత్రణ ఆర్&డీ కేంద్రాలు స్థాప‌న‌కు భాగ‌స్వాములు అవ్వాల‌ని కోరారు.



మెగా డీఎస్సీ 2025లో ఎంపిక కాని అభ్యర్థులను రెచ్చగొడుతూ తన రాజకీయ ప్రయోజనాల కోసం యువత విలువైన కాలాన్ని వృధా చేస్తున్నాడు ...
05/06/2026

మెగా డీఎస్సీ 2025లో ఎంపిక కాని అభ్యర్థులను రెచ్చగొడుతూ తన రాజకీయ ప్రయోజనాల కోసం యువత విలువైన కాలాన్ని వృధా చేస్తున్నాడు జగన్. అభ్యర్థులకు, ప్రజలకు వాస్తవాలతో పాటు జగన్ కుట్రలను తెలియ చేయాలన్న బాధ్యతతో సాక్షి మీడియా ముందుకు వచ్చిన కొందరు అభ్యర్థులు ఎందుకు అనర్హత పొందారో తెలియజేస్తున్నాం.

అందులో భాగంగా మెగా డీఎస్సీ అభ్యర్థులు గెరివి అంజనప్ప, కంచర్ల శరత్ బాబు, పాక సతీష్, రాణి కందుల విషయంలో వాస్తవం ఇది.



ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ...
05/06/2026

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైకిళ్లు తొక్కుతూ ర్యాలీలు నిర్వహించారు. పర్యావరణ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు.


05/06/2026

5 కోట్ల సీడ్ బాల్స్‌తో పచ్చదనం పెంచేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ పెంచే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నాం..


05/06/2026

నెట్ జీరో క్యాంపస్‌గా ఏయూను తీర్చిదిద్దాలని ఆదేశించాను. సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలి. భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి. ఏయూకు 450 ఎకరాల భూమి ఉంది. ఖాళీ ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలి. ఏయూ క్యాంపస్‌ను బయోడైవర్సిటీ పార్క్‌గా రూపాంతరం చెందేలా అభివృద్ధి చేయాలి.


05/06/2026

నెట్ జీరో విధానం అమలులో అన్ని విద్యాసంస్థలకు మార్గదర్శకంగా నిలిచేలా ఏయూను అభివృద్ధి చేయాలి.


05/06/2026

విశాఖలో జరుగుతున్న సీఫుడ్ ఎగుమతులపై జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ వీధుల్లో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో  ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పాల్గొన్నారు....
05/06/2026

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ వీధుల్లో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పాల్గొన్నారు. ఏయూ క్యాంపస్ నుంచి నోవోటెల్ హోటల్ వరకూ సీఎం చంద్రబాబు సైకిల్ తొక్కుకుంటూ, ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.


ఈరోజు (05.06.2026) ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి మన్నూరు సుగు...
05/06/2026

ఈరోజు (05.06.2026) ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి మన్నూరు సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో ఘనంగా సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ఎన్‌టీఆర్ సర్కిల్ నుండి ప్రారంభమై పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా సుగుణమ్మ గారు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ఇంధన పొదుపు మరియు సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. భావితరాలకు పరిశుభ్రమైన, హరిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీలో తిరుపతి పార్లిమెంట్ ప్రెసిడెంట్ పనబాక లక్ష్మీ గారు,రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నరసింహ యాదవ్ గారు,రాష్ట్ర నాయకులు అన్నా అనిత గారు,బుల్లెట్ రమణ గారు,బిజి కృష్ణ యాదవ్ గారు,సూరా సుధాకర్ రెడ్డి గారు,మన్యం శ్రీనివాసులు గారు,వెంకటేష్ గారు,రాజారం గారు,ఆముదాల తులసి గారు,సుబ్రమణ్యం గారు, విజయ్ కుమార్ గారు,బ్యాంక్ శాంతమ్మ గారు,రేవతి గారు,హేమావతి గారు,రేఖ గారు,మురళి గారు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు మరియు పర్యావరణ ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



ఐదేళ్ళలో ఒక్క ఉద్యోగ  నియామకం కూడా చేయని జగన్ కి నియామకాలు ఎలా జరుగుతాయో అన్న అవగాహన లేదు. సుప్రీం కోర్టు ఆదేశాల మీద ఈ హ...
05/06/2026

ఐదేళ్ళలో ఒక్క ఉద్యోగ నియామకం కూడా చేయని జగన్ కి నియామకాలు ఎలా జరుగుతాయో అన్న అవగాహన లేదు. సుప్రీం కోర్టు ఆదేశాల మీద ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఇవ్వాలని 2023 ఆగష్టు 2వ తేదీన జీవో నెం.77 ఇచ్చిందే జగన్ ప్రభుత్వం. కేవలం రాజకీయం చేయడానికి మెగా డీఎస్సీలో సెలక్ట్ కాని అభ్యర్థులను ముందు పెట్టి యువతను తప్పుదారి పట్టిస్తున్నాడు.



Address

Tirupati
517501

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Tirupati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share