28/07/2020
Ravi Varma Rudraraju
గౌరవనీయులైన
రాష్ట్రరావాణా శాఖా మాత్యులు
శ్రీ పేర్ని నాని గారికి నమస్కరించి
టాక్సీ యజమానులు వ్రాయునది.
అయ్యా !
మార్చి 23 కోవిడ్19 (కరోనా) దేశంలో ప్రబలుతున్న కారణంగా దేశమంతా
లాక్డౌన్ విధించటం జరిగింది.
ఆ రోజు నుండి ఇప్పటివరకు టాక్సీ యజమానులు మరియు డ్రైవర్లు పడుతున్న బాధలు అంతా ఇంతా కాదు,
ఇంటి అద్దెలు , కరంటు బిల్లులు కట్టలేక తినటానికి తిండి కోసం, ఎన్నో బాధలు పడుతూ అప్పులు చేసి బ్రతుకుతున్నారు, ఒకరకంగా బ్రతికి వుండగానే నరకాన్ని అనుభవించుచున్నాము,
ఇలాంటి సమయంలో మీరు ఇచ్చిన వాహన మిత్ర పథకం కొంత ఉపయోగ పడిన మాట వాస్తం, కానీ ఒక్కసారి మీ మంచి మనసుతో ఆలోచించండి మీరిచ్చిన 10,000/- రూపాయలతో ఒక కుటంబానికి ఎన్నిరోజులు నడిపించవచ్చు ?
గత 5 నెలలుగా ఇంటి అద్దెలూ, కరంటు బిల్లులూ, తినటానికి తిండి, ఇంకా పాల బిల్లులు కట్టుకొని జీవనం సాగించాలి,
అలాగే మాములుగా మా టాక్సీలు తిరిగితేనే వచ్చే ఆదాయం సరిపోవటంలేదని ఆ రోజు మన ప్రియతమ నాయకుడు
"వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారు" వాహనమిత్ర పథకం పెట్టి మమ్మలిని ఆదుకున్నారు,
అందులో కూడా తెల్ల రేషన్ కార్డు లేని వారికి ఆ పథకం కూడా అందలేదు.
అలాంటిది ఇప్పుడు కరోనా పుణ్యమా అని అసలు బయటకి వచ్చే పరిస్థితి లేదు,
అలాగే మ్యాక్సీ క్యాబ్ లకు కట్టాల్సిన త్రైమాసిక పన్ను రద్దు చేస్తారని ఎదురు చూసి చూసి జూన్ నెలలో అప్పులుచేసి మరీ టాక్స్ కట్టాము,
మళ్లీ ఈ నెలలో టాక్స్ కట్టమని అంటున్నారు, మళ్లీ అప్పులకు మేమందరమూ రోడ్డుమీద పడినా ఇప్పుడు ఎవ్వరూ అప్పులు ఇవ్వటం లేదు,
ఇప్పుడు కొత్తగా ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఫోన్ లు చేసి ప్రతినెలా ఋణదాతకు చెల్లించే వాయిదాలు ("ఈఎంఐ") అడగటం మొదలు పెట్టేసారు,
ఆదాయంలేక అప్పులు ఇచ్చేవారు లేక
టాక్స్ లు కట్టలేక మేము చాలా డిప్రెషన్ లో ఉన్నాము, నిన్న ఉయ్యురు లో జరిగిన సంఘటన ఒక ఆరంభం
మాత్రమే,
2 లేక 3 "మ్యాక్సీ క్యాబులు" ఉన్న వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది కావున
దయచేసి మీరు మా యందు దాయవుంచి "త్రైమాసిక పన్ను రద్దు" చేయటమే కాకా
ఆర్థికంగా కూడా టాక్సీ రంగ కార్మికులని ఆదుకోవాలని వేడుకుంటున్నాము.
మరీ ముఖ్యంగా 6 నెలల నుండి రోడ్డెక్కని వాహనాలకి టాక్స్ కట్టించుకోవటం చాలా అన్యాయం, దుర్మార్గం.
మమ్మల్ని మీరు ఆదుకోక పోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం"
కరోనా కారణంగా ప్రత్యక్షముగా కలవలేక మేము మా భాదని ఇలా విన్నవించుకొంటున్నాము.
CC To
గౌరవనీయులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి
మరియు
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి గారికి.