30/03/2026
#రేపల్లె, #నిజాంపట్నం #మండలాల్లో #మత్స్యకారులు #యాత్రలో #నిజాంపట్నం #హార్బర్, #దిండి #ఆక్వా #ఫుడ్ #పార్క్ #నిర్మాణం #పనులు #వేగవంతంగాపూర్తిచేయాలని, #జిల్లాలో #టూరిజం #అభివృద్ధిలో #మత్స్యకారులు #ఉపాధికి #ఇబ్బందిలేకుండా #ప్రణాళికలు #రూపొందించాలి...మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొల్లాటి.శ్రీను డిమాండ్ చేశారు నిజాంపట్నం,రేపల్లె మండలాల పరిధిలో బాపట్ల జిల్లా మత్స్యకార్మిక సంఘం ఆధ్వర్యంలో నిజాంపట్నం మండలం పరిధిలో గోకర్ణమఠం, నిజాంపట్నం హార్బర్,నిజాంపట్నం గ్రామంలో ఫిషర్మెన్ కాలనీ, లైన్స్ కాలనీ,దిండి అదవల,నిర్మాణంలో ఉన్న బీచ్ రోడ్డు,దిండి ఆక్వా ఫుడ్ పార్కును, నిజాంపట్నం హార్బర్ ను,నక్షత్ర నగర్,కొత్తపాలెం,రేపల్లె మండలంలో మోళ్ళగుంట,గంగడిపాలెం,పిరాటలంక పెనుమూడి,జొన్నవారిపాలెం తదితర గ్రామాల్లో పర్యటించి అనేకమంది మత్స్య కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకోవడం జరిగింది,ఈ సందర్భంగా మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొల్లాటి.శ్రీను మాట్లాడుతూ ప్రధానంగా 450 కోట్ల రూపాయలతో నిజాంపట్నం హార్బర్ పనులు చేస్తున్నప్పటికీ వేగవంతంగా చేయకపోవడం మరియు హార్బర్ ఆధునీకరణలో భాగంగా వంతెన ఏర్పాటు చేయాలని బోట్ యజమానులు కోరుకుంటున్నప్పటికీ ఆ రకంగా అభివృద్ధి చేస్తారా లేదా అని అనేకమంది మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు మరియు భూసేకరణ సమస్యతో హార్బర్ నిర్మాణం పనులు మధ్యలోనే ఆగిపోతాయేమో అనే అనుమానాలు కూడా వ్యక్తంచేశారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మత్స్యకారులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలాగా హార్బర్ నిర్మాణం పూర్తి చేయాలని,85 కోట్లతో దిండి వద్ద నిర్మాణ పనులు ప్రారంభించినా ఆక్వా ఫుడ్ పార్కు సంబంధించిన పనులను వేగవంతంగా చేయాలని ఈ ప్రాంతంలో మత్స్యకార గ్రామాల్లో ఉన్న చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని,స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి,రాష్ట్రంలో అనేక చోట్ల మత్స్యకారులు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా,స్థానికులా అనుమతి లేకుండా విషపూరిత కెమికల్ ఫ్యాక్టరీలు నిర్మాణం చేస్తున్నారు,టూరిజం పేరుతో చాలాచోట్ల మత్స్యకారుల నివాసాలు ఖాళీ చేస్తున్నారు,అలాంటి వాటికి బాపట్ల జిల్లాలో తావు ఇవ్వకుండా ఈ ప్రాంతంలో మత్స్యకారులకు ఉపయోగపడేలాగా పరిశ్రమలు నిర్మాణం,టూరిజం అభివృద్ధిచేయాలని అన్నారు,బాపట్ల జిల్లా టూరిజం అభివృద్ధికి పలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఆ ప్రణాళికల వల్ల మత్స్యకారులు ఉపాధికి ఇబ్బంది లేకుండా టూరిజాన్ని అభివృద్ధి చేయాలని,నిజాంపట్నం మండలం పరిధిలో గతంలో 270 మందికి వేట నిషేధభృతి మత్స్య భరోసా అనేక కారణాలతో ఆపివేశారు,ఆ సమస్య పట్ల అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారూ, మత్స్యకారులు నష్టపోతున్నారని అన్నారు,నిజాంపట్నం మండలం పరిధిలో వచ్చినా సమస్యలు పట్ల బాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేపడతామని,ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు రాష్ట్రంలో మత్స్యకారులకు ప్రాతినిధ్య వహిస్తున్న మంత్రులకు వినతిపత్రాలు అందిస్తామని తెలిపారు.ఈ యాత్రలో నిజాంపట్నం మండలం పరిధిలో మత్స్యకారులు కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు,నిజాంపట్నం మండలం పరిధిలో జరిగిన యాత్రలో ఈ జాతాలో మత్స్య కార్మిక సంఘం నాయకులు,చేతి వృత్తుదారుల సంఘం నాయకులు,సిఐటియు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.బాబురావు,నాయకులు టి.కృష్ణమోహన్,ఎం.కొండయ్య,ప్రతాప్,ఏసుబాబు,బాబ్జి, బి.ఆర్య,ప్రతాప్, వి.మావో,సిహెచ్.మణిలాల్,కే.శరత్ బాబు,బి.అగస్టిన్,పి.మనోజ్,కే.గోపి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు