CITU Repalle

CITU Repalle CITU

రేపల్లె టౌన్.. #ఆర్టిసి  #హైర్  #బస్ మరియు  #ఆన్  #కాల్  #డ్రైవర్ల  #సమస్యలు  #పరిష్కరించాలి...KMPL పేరుతో డ్యూటీల ఆపరాద...
05/06/2026

రేపల్లె టౌన్.. #ఆర్టిసి #హైర్ #బస్ మరియు #ఆన్ #కాల్ #డ్రైవర్ల #సమస్యలు #పరిష్కరించాలి...KMPL పేరుతో డ్యూటీల ఆపరాదు,కండిషన్ లేని బస్ లా డామేజ్ కు డ్రైవర్లను బాధ్యులు చేయరాదు,ఆన్ కాల్ డ్రైవర్లుకు డ్యూటీకి 1600 నుండి 2000కి పెంచి అమలుచేయాలి... మదర్ థెరిసా హెయిర్ బస్ డ్రైవర్స్ యూనియన్ (సిఐటియు) రేపల్లె డిపో గౌరవాధ్యక్షులు సిహెచ్.మణిలాల్... సిఐటియు రేపల్లె కార్యాలయంలో రేపల్లె డిపో హైర్ బస్ ఆన్ కాల్ డ్రైవర్ల యూనియన్ సమావేశం యూనియన్ అధ్యక్షులు జి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి యూనియన్ గౌరవాధ్యక్షులు సిహెచ్. మణిలాల్ మాట్లాడుతూ రేపల్లె డిపో పరిధిలో ఆన్ కాల్ డ్రైవర్లకు డ్యూటీలు చేస్తున్నా డ్రైవర్లను కెఎంపిఎల్ పేరుతో డ్యూటీలు ఆపటం,కండిషన్ లేని బస్సులు సరైన రోడ్డు సదుపాయాలు లేని చోట డ్యామేజ్ అవుతుంటే డ్రైవర్లతో డబ్బులు కట్టించడం మానుకోకపోతే ఆందోళన నిర్వహిస్తామని అన్నారు,రాష్ట్ర వ్యాప్తంగా చాలా డిపోలో ఆన్ కాల్ డ్రైవర్లకు డ్యూటీకి 1600 నుండి 2000 రూపాయలు పెంచి అమలు చేస్తుంటే రేపల్లె డిపోలో పెంచకపోవడం దారుణమన్నారు అదేవిధంగా బ్రేక్ డౌన్ రిపేర్ అప్పుడు పూర్తి డ్యూటీ డబ్బులు ఇవ్వాలని అన్నారు,అనేక సంవత్సరాల నుండి డిమాండ్ చేస్తున్న హెయిర్ బస్ డ్రైవర్లుకి ఆర్టీసీ ఎండిగా అంగీకరించినటువంటి సర్కులర్ ప్రకారం పిఎఫ్,ఎస్ఐ అమలుచేయాలని అన్నారు,ఈ సమావేశాల్లో మదర్ తెరిసా హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్ రేపల్లె డిపో కన్వీనర్ కేశన.గోపి, ఉపాధ్యక్షులు భాను,నాగరాజు, ఇమ్రాన్,తదితరులు పాల్గొన్నారు

05/06/2026

రేపల్లె టౌన్.. #ఆర్టిసి #హైర్ #బస్ మరియు #ఆన్ #కాల్ #డ్రైవర్ల #సమస్యలు #పరిష్కరించాలి...KMPL పేరుతో డ్యూటీల ఆపరాదు,కండిషన్ లేని బస్ లా డామేజ్ కు డ్రైవర్లను బాధ్యులు చేయరాదు,ఆన్ కాల్ డ్రైవర్లుకు డ్యూటీకి 1600 నుండి 2000కి పెంచి అమలుచేయాలి... మదర్ థెరిసా హెయిర్ బస్ డ్రైవర్స్ యూనియన్ (సిఐటియు) రేపల్లె డిపో గౌరవాధ్యక్షులు సిహెచ్.మణిలాల్... సిఐటియు రేపల్లె కార్యాలయంలో రేపల్లె డిపో హైర్ బస్ ఆన్ కాల్ డ్రైవర్ల యూనియన్ సమావేశం యూనియన్ అధ్యక్షులు జి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి యూనియన్ గౌరవాధ్యక్షులు సిహెచ్. మణిలాల్ మాట్లాడుతూ రేపల్లె డిపో పరిధిలో ఆన్ కాల్ డ్రైవర్లకు డ్యూటీలు చేస్తున్నా డ్రైవర్లను కెఎంపిఎల్ పేరుతో డ్యూటీలు ఆపటం,కండిషన్ లేని బస్సులు సరైన రోడ్డు సదుపాయాలు లేని చోట డ్యామేజ్ అవుతుంటే డ్రైవర్లతో డబ్బులు కట్టించడం మానుకోకపోతే ఆందోళన నిర్వహిస్తామని అన్నారు,రాష్ట్ర వ్యాప్తంగా చాలా డిపోలో ఆన్ కాల్ డ్రైవర్లకు డ్యూటీకి 1600 నుండి 2000 రూపాయలు పెంచి అమలు చేస్తుంటే రేపల్లె డిపోలో పెంచకపోవడం దారుణమన్నారు అదేవిధంగా బ్రేక్ డౌన్ రిపేర్ అప్పుడు పూర్తి డ్యూటీ డబ్బులు ఇవ్వాలని అన్నారు,అనేక సంవత్సరాల నుండి డిమాండ్ చేస్తున్న హెయిర్ బస్ డ్రైవర్లుకి ఆర్టీసీ ఎండిగా అంగీకరించినటువంటి సర్కులర్ ప్రకారం పిఎఫ్,ఎస్ఐ అమలుచేయాలని అన్నారు,ఈ సమావేశాల్లో మదర్ తెరిసా హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్ రేపల్లె డిపో కన్వీనర్ కేశన.గోపి, ఉపాధ్యక్షులు భాను,నాగరాజు, ఇమ్రాన్,తదితరులు పాల్గొన్నారు

29/05/2026

రేపల్లె... #రాజకీయంగా #ప్రత్యర్థులను #భయపెట్టేందుకు #కేంద్ర #దర్యాప్తుసంస్థలను #బీజేపీప్రభుత్వం #దుర్వినియోగం #చేయటం #సిగ్గుచేటు,కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ పై ఈడీ దాడులను ఖండిస్తూ రేపల్లెలో సిపిఎం నిరసన ఈరోజు రేపల్లె నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్. మణిలాల్ మాట్లాడుతూ ఈ కాలంలో 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఇడీ లాంటి స్వచ్ఛందంగా వ్యవహరించవలసిన వాటిని బీజేపీ రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగించడం సిగ్గుచేటు,కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈడీ అధికారులు పినరయి విజయన్ కుటుంబ సభ్యుల ఇళ్లపై దాడులు నిర్వహించడం వెనుక బీజేపీ,కాంగ్రెస్ కుమ్మక్కు స్పష్టమవుతోందన్నారు.కేరళలో అనేక సంవత్సరాల పాటు ప్రజా పరిపాలన అందించడంలో కమ్యూనిస్టు పార్టీ అగ్ర భాగాన నిలిచింది,కానీ రాజకీయ కక్షలతో కేరళలో పది చోట్ల, బెంగళూరులో 2 చోట్ల ఏక కాలంలో సోదాలు జరిపినా ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు.ప్రజా నేతగా ఎదిగిన విజయంపై గతంలో కాంగ్రెస్, బీజేపీలు నిరాధారమైన అనేక ఆరోపణలు అధికారంకోసం,రాజకీయాల కోసం ఆరోపణలు చేశారు,ఈ దాడుల ద్వారా మనీలాండరింగ్ కేసుగా మలిచేందుకు బిజెపి కుట్ర పన్నింది,గత దర్యాప్తుల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోయినా మళ్లీ దాడులు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని విమర్శించారు.గంటల తరబడి తనిఖీలు చేసిన అధికారులు చివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని,లిఖిత పూర్వకంగా తెలిపి వెళ్లారని విమర్శించారు,కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని కమ్యూనిస్టులు భయపడబోరన్నారు,దేశవ్యాప్తంగా ఈడీ దాడులపై పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యవాదులు నిరసనలు తెలిపారు.ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందన్నారు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవలసిన ఇడి లాంటి వ్యవస్థలు బిజెపి తొత్తుగా మారి నిరాధారమైనటువంటి దాడులు చేస్తే ప్రజలు తిరగబడతారని అధికారం ఉంది కదా అని బిజెపి కమ్యూనిస్టులను అవినీతిపరులుగా చూపించే ప్రయత్నం చేయాలనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని నిజాయితీగా ప్రజల కోసం అనేక త్యాగాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టులు అని అన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు వై.కిషోర్, కే.ఆశీర్వాదం,కే.రమేష్,సిహెచ్.ప్రకాష్, జే.ధర్మరాజు,జి.దానియేలు,ఎం.వెంకటేశ్వరావు,వి.మావో తదితరులు పాల్గొన్నారు

28/05/2026

రేపల్లె ఆర్టీసీలో కార్మికులు పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్న డీఎంగారి వైఖరికి నిర‌నగా,KMPL కౌన్సిలింగ్ పేరుతో వేధింపులు,అక్రమ ఓడిలు,వెహికిల్ కండీషన్ లేకపోయినా అక్రమ జరిమానాలు,అక్రమ ఛార్జిషీట్ లు నిరసిస్త గ్యారేజ్ గేట్ వద్ద SWF ఆధ్వర్యంలో ధర్నా..గ్యారేజ్ ముందు కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు అనుబంధం)సంఘంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసి గ్యారేజ్ ముందు నిరసన తెలిపారు,ఈ నిరసనలో SWF జిల్లా అధ్యక్షులు ఏ.సత్యనారాయణ,డిపో గౌరవ అధ్యక్షులు సీహెచ్.మణిలాల్ డిపో అధ్యక్షలు ఎస్.సురేష్,ఎన్ వి.సాగర్ లు మాట్లాడుతూ డిపోలో కార్మికులు సమస్యలు పట్ల,డ్యూటీలో భాగంగా డిపోలో వస్తున్న సమస్యలు విని పరిష్కారం చేయవలసిన డీఎం గారు మొండిగా వ్యవహరించటం వల్ల కార్మికులు ఆందోళన బాట పట్టవలసిన పరిస్థితి ఏర్పడింది,ఇప్పటికైనా డిఎం గారు కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరారు,స్త్రీ శక్తి వల్ల ప్రయాణికుల యద్దడి, బస్సుల పూర్తి స్థాయి కండిషన్ లో లేకపోవటం,రోడ్లు గుంతలు సమస్యలు వల్ల టైర్ పంచరవటం,గ్లాస్ లు పగిలిపోవడం,ఇతర రిపేర్ లు కి కండక్టర్లు, డ్రైవర్లనే బాధ్యులుగా చేసి జరిమానాలు విధించడం సమంజసం కాదు,డిపోలో వస్తున్న స్థానిక సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు దశల వారి పోరాటం కొనసాగిస్తామని అన్నారు,ఈ నిరసన కార్యక్రమంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రేపల్లె డిపో కమిటీ సభ్యులు నాంచారయ్య, కారంకి. శ్రీను,ఆర్ యస్ రావు,శ్యామ్ బాబు,జియస్ ప్రసాద్,గాంధీ, సుబ్బారావు, శ్రీనాథ్,బసవరాజ, సముద్రాలు,సతీష్,రత్తయ్య, చంద్రబాబు,యంవి.రావు, తదితరులు పాల్గొన్నారు

28/05/2026
27/05/2026
27/05/2026

రేపల్లె... #కొల్లూరులో #గొడవలు #కులాలు, #రాజకీయపార్టీలు #గొడవలుగా #మారకుండా #వెంటనే #గ్రామంలో #శాంతికమిటీని #ఏర్పాటుచేయాలి,దళితులను ఉద్దేశించి కులవివక్ష,హింసను ప్రేరేపిస్తూ మాట్లాడినా వారి మీద చర్యలు తీసుకోవాలి,అధికారులు,పోలీసులు సమన్వయంతో కొల్లూరులో శాంతి భద్రతలకు ఇబ్బందులు లేకుండా సాధారణ పరిస్థితి వచ్చేలాగా చూడాలి...సీపీఎం పార్టీగా రేపల్లె డీఎస్పీ,ఆర్డీవో లుకి వినతిపత్రాలు రేపల్లె సబ్ డివిజన్ పరిధిలో కొల్లూరు గ్రామంలో జరిగిన గొడవలు నేపథ్యంలో శాంతికమిటీనీ తక్షణం ఏర్పాటుచేయాలని,సాధారణ పరిస్థితులు వచ్చేలాగా చూడాలని రేపల్లె డిఎస్పి ఆవుల.శ్రీనివాసరావు గారికి,ఆర్డీవో ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ విజయేంద్రరావులకు వినతిపత్రాలు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా *సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.కృష్ణమోహన్,సిహెచ్. మణిలాల్ మాట్లాడుతూ* ఇరు వర్గాలు గొడవలో పోలీస్ స్టేషన్ వద్ద దాడులు పరిణామాలలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి,గొడవలతో సంబంధం లేనటువంటి దళితులు మరియు ఇరు వర్గాలు పేర్లు పోలీస్ కేసు నుంచి తొలగించాలి,గొడవల అనంతరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ మూటకట్టుకుని వెళతాం అంటూ దళితులు పట్ల కులవివక్ష,హింసను ప్రేరేపించేలాగా మాట్లాడిన వారి వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయని ఇలాంటి వ్యాఖ్యలు గ్రామాల్లో ప్రజల ఐక్యతను దెబ్బతీస్తాయి అని విమర్శించారు,గొడవలకు ముందు,గొడవల అనంతరము కూటమిలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు జనసేన, తెలుగుదేశం నాయకులు రాజకీయ విమర్శ,ప్రతి విమర్శలు వల్ల కొల్లూరు గ్రామంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి,భవిష్యత్తులో రోజువారి జీవన కార్యక్రమాల్లో ఆటంకాలు వస్తాయ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ గొడవలుకి కారణం అవుతున్న వారు ఏ రాజకీయ పార్టీలో నాయకులైన వారిపట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలి,ఇరు వర్గాల ప్రజలతో ప్రభుత్వ అధికారులు పోలీసులు శాంతికమిటీని ఏర్పాటుచేసి భవిష్యత్తులో వివాదాలు రాకుండా సమన్వయంతో వ్యవహరించేలాగా రేపల్లె ఆర్డీవో మరియు డిఎస్పీ గారు చొరవ చేయాలని,ఈ ఘటన కులాలు, రాజకీయాయ గొడవలు కారణం కాకుండా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి.ఆగస్టిన్,కే.ఆశీర్వాదం,సిహెచ్.ప్రకాష్ వి.మావో తదితరులు పాల్గొన్నారు.

Address

Repalle

Website

Alerts

Be the first to know and let us send you an email when CITU Repalle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category