10/10/2025
🚨
G.O.RT.NO 107 పై Telugu Desam Party (TDP) ఫేక్ ప్రచారం
1.అబద్ధాన్ని నిజం చేయడానికి చంద్రబాబు నాయుడుగారి ఆధ్వర్యంలోని టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి.
2. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించేదిశగా చేస్తున్న ప్రయత్నాలపై, తన ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించాయి.
3. అసలు ఆపార్టీలో ఉన్నవాళ్లకు కనీస అవగాహన లేకుండా ప్రచారం చేస్తున్నారు. భాష రాకపోతే ఎవరిచేతనైనా చదివించుకుని అర్థం తెలుసుకుంటే మంచిది. అలా చేయకుండా అబద్ధాలు పట్టుకుని ప్రచారం చేయడంవల్ల ఉపయోగం ఉండదు. నిజాల ముందు ఇలాంటి తప్పుడు ప్రచారాలు పనిచేయవు.
4. ఫిబ్రవరి 6, 2020న వైయస్సార్సీపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు, ఆపార్టీకి చెందిన వారు వక్రీకరిస్తున్నారు.
5. వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య రంగంలో విప్లవాత్మక చర్యగా ఉన్న ఆస్పత్రులను, ఇప్పటికే ఉన్న గవర్నమెంటు మెడికల్ కాలేజీల్లో నాడు-నేడు పనులు చేపట్టాలని, అలాగే కొత్తగా మెడికల్ కాలేజీలు, వాటితోపాటు బోధనాసుపత్రులను నిర్మించాలని తలపెట్టింది.
6. అనేక దఫాలుగా దీనిపై చర్చలు జరిగిన యాన్యునిటీ విధానంలో ఈపనులు చేపట్టాలని మొదటి నిర్ణయించింది. ఈమేరకు జీవో జారీచేసింది.
7. యాన్యునిటీ మోడల్ అంటే, ప్రభుత్వం కోరుకున్న పనిని కాంట్రాక్టర్ కడతారు, కట్టిన వెంటనే కొంతమొత్తాన్ని చెల్లిస్తుంది, మిగిలిన మొత్తాన్ని సంవత్సరాల వారీగా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే వాయిదాల పద్దతిలో చెల్లింపు లాంటిది. కాంట్రాక్టర్కు ఎలాంటి హక్కులు ఉండవు. యాజమాన్యం, ఆస్తులన్నీ ప్రభుత్వానికే చెందుతాయి.
8. ఫిబ్రవరి 6, 2020న G.O.RT.NO 107లోని నాలుగో పేరాలో ఈ విషయాలు స్పష్టంగా ఉన్నాయి.
4. The Government after examination of the matter, hereby accord permission
to the MD, APMSIDC, Mangalagiri for the following:
1. In Principle to go ahead with suitable annuity model for Phase-
III to take up construction of District Hospitals and Teaching Hospitals.
2. To call for International Expression of Interest (IEoI) on
20.02.2020 as few International agencies are expressing interest in this
model.
3. In order to assist in structuring the international EOI, appropriate domain
experts be contracted as transaction advisors.
9. కాని, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతి అలా కాదు. మొత్తం ఆస్తి, యాజమాన్యం అంతా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లిపోతుంది. ఆ ప్రైవేటు వ్యక్తి ఎంబీబీఎస్ సీట్లను అమ్ముకుంటాడు. టీచింగ్ ఆస్పత్రికి వచ్చే రోగులనుంచి ఫీజులు పిండి వసూలు చేస్తాడు. తన లాభార్జనే ధ్యేయంగా ముందుకెళ్తాడు.
10. ఈ యాన్యుటీ మోడల్లో వైద్యరంగంలో ఈ నిర్మాణాలకోసం వైయస్సార్సీపీ ప్రభుత్వం మొదట EOAను ఆహ్వానించింది. కాకపోతే… తదుపరికాలంలో యాన్యునిటీ స్థానంలో, సొంతంగానే నబార్డు సహా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా నిర్మాణాన్ని చేపట్టింది.
11. అసలు అమలుచేయని, PPPకి సంబంధం లేని ఈ జీవోను పట్టుకుని, అడ్డంగా గవర్నమెంటు మెడికల్ కాలేజీలు అమ్మేస్తూ ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహాన్ని తప్పించుకోవడానికి ఫేక్ ప్రచారానికి టీడీపీ దిగింది.
12. టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు చెప్తున్నట్టుగా వైయస్సార్సీపీ ప్రభుత్వమే PPP మోడల్లోనే మెడికల్ కాలేజీలు నిర్మాణం అయితే, చంద్రబాబుగారి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఆ పనులు ఎందుకు ఆపినట్టు, కొత్తగా మళ్లీ పీపీపీ మోడల్లో టెండర్లు ఎందుకు పిలిచినట్టు?