East Godavari District Police

East Godavari District Police Safety, Security of the People and Social Justice are our concern.

జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నాన్ క్యాడర్ ఎస్పీ శ్రీ ఏ.వి సుబ్బరాజు గారుతూర...
03/06/2026

జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నాన్ క్యాడర్ ఎస్పీ శ్రీ ఏ.వి సుబ్బరాజు గారు

తూర్పుగోదావరి జిల్లాలో అదనపు ఎస్పీగా విధులు నిర్వహిస్తూ పదోన్నతి పొందిన శ్రీ ఏ.వి. సుబ్బరాజు గారు నేడు తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో నాన్-కేడర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పీ)గా బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం ఈ రోజు క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ డి నరసింహ కిషోర్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

రాజమహేంద్రవరం ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు 17 కేసులు నమోదు – 3 మందికి జైలు శిక్ష, 14 మందికి రూ.1.40 లక్షల...
02/06/2026

రాజమహేంద్రవరం ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

17 కేసులు నమోదు – 3 మందికి జైలు శిక్ష, 14 మందికి రూ.1.40 లక్షల జరిమానా

ఈరోజు (02.06.2026) తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, రాజమహేంద్రవరం ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ వై. శ్రీకాంత్ గారి పర్యవేక్షణలో రాజమహేంద్రవరం నగర పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 17 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని గౌరవనీయులైన 1st Special Judicial 2nd Class Magistrate Court, Rajamahendravaram నందు హాజరుపరచగా, గౌరవ మెజిస్ట్రేట్ పి.ఈశ్వరి గారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో శిక్షలు విధించడం జరిగినది.

శిక్షల వివరాలు:

ఒక కేసులో మద్యం సేవించి ఆటో నడిపిన వ్యక్తికి 7 రోజుల జైలు శిక్ష విధించారు.

ఒక కేసులో 3 రోజుల జైలు శిక్ష విధించారు.

ఒక కేసులో 2 రోజుల జైలు శిక్ష విధించారు.

అదేవిధంగా, మిగిలిన 14 మంది వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున, మొత్తం రూ.1,40,000 జరిమానా విధించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు.

అనపర్తి పోలీస్ స్టేషన్‌లో  నూతనంగా నిర్మించిన  అదనపు కార్యాలయ గదుల ప్రారంభంప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించ...
02/06/2026

అనపర్తి పోలీస్ స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన అదనపు కార్యాలయ గదుల ప్రారంభం

ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడంతో పాటు పోలీసు సిబ్బందికి మెరుగైన కార్యాలయ వసతులు కల్పించే లక్ష్యంతో అనపర్తి పోలీస్ స్టేషన్‌లో నూతనంగా ఎర్పాటు చేసిన అదనపు కార్యాలయ గదులను జిల్లా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిశోర్, ఐపీఎస్ గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్లలో మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా పోలీసు సిబ్బంది పనితీరు మరింత మెరుగుపడి, ప్రజలకు వేగవంతమైన మరియు నాణ్యమైన సేవలు అందించడానికి దోహదపడుతుందని తెలిపారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈ అదనపు కార్యాలయ గదులు సిబ్బందికి అనుకూలమైన పని వాతావరణాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు.

పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణ, సౌకర్యాల విస్తరణ ద్వారా స్మార్ట్ పోలీసింగ్ లక్ష్యాలను మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని ఎస్పీ గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డిఎస్పి శ్రీమతి బి. విద్య గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. ఎల్. వి.కె. సుమంత్ గారు, ఎస్సైలు శ్రీ ఎల్.శ్రీను నాయక్, శ్రీ బి. దుర్గ ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "ప్రజా సమస్యల పరిష్కార వేదిక "పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం”,...
01/06/2026

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "ప్రజా సమస్యల పరిష్కార వేదిక "పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం”, (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్., గారు ఈరోజు అనగా ది. 01.06.2026 వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.

జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించి వారి కష్టాలను, బాధలను స్వయంగా అడిగి తెలుసుకుని, వెనువెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాది దారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసినదిగా ఉత్తర్వులు ఇచ్చినారు.

నేటి పోలీసు “పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం” కార్యక్రమానికి 29 ఫిర్యాదులు రాగా, వీటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు మరియు ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడమైనది.

నేరస్తులు, రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో నడుచుకోవాలి రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన తూర్పు గోదావరి జిల్లా పోలీసులు తూ...
31/05/2026

నేరస్తులు, రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో నడుచుకోవాలి

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన తూర్పు గోదావరి జిల్లా పోలీసులు

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నేరనియంత్రణ మరియు శాంతిభద్రత పరిరక్షణలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారు, చెడు నడత కలిగిన వ్యక్తుల కోసం కౌన్సిలింగ్ కార్యక్రమాలను నిర్వహించారు.

• నేరాలకు దూరంగా ఉండాలి, సత్ప్రవర్తనతో జీవించాలి.
• అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు.
• గంజాయి, మత్తుపదార్థాల వినియోగం లేదా రవాణా చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని.
• చెడు వ్యసనాలను మాని, మంచి నడవడికను అలవర్చుకోవాలి.
• సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు.

రౌడీ షీటర్లు, క్రైమ్ సస్పెక్ట్‌ల కదలికలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని, వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎటువంటి గొడవలు, నేరాలలో పాల్గొన్నా వెంటనే లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే, భవిష్యత్తులో ఏవైనా చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కంప్యూటర్ ఆపరేటర్లు, కోర్టు కానిస్టేబుళ్ల పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశంతూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో జ...
30/05/2026

కంప్యూటర్ ఆపరేటర్లు, కోర్టు కానిస్టేబుళ్ల పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశం

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐ.పి.ఎస్., గారు జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు చెందిన కంప్యూటర్ ఆపరేటర్లు మరియు కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లలో నిర్వహించాల్సిన డేటా ఎంట్రీ, కేసుల రికార్డుల నిర్వహణ, సీసీటీఎన్‌ఎస్ (CCTNS) నమోదు, డిజిటల్ డాక్యుమెంటేషన్, కోర్టు కేసుల పురోగతి, సమన్లు మరియు వారెంట్ల అమలు, పెండింగ్ కోర్టు వ్యవహారాలపై సమీక్షించారు.

కోర్టు కానిస్టేబుళ్లు కేసుల విచారణలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొంటూ, సమన్లు మరియు వారెంట్ల అమలు, సాక్షుల హాజరు, కేసు డాక్యుమెంట్ల సమర్పణ వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులు మరియు కోర్టు సిబ్బందితో సమన్వయం పెంపొందించడం ద్వారా కేసుల కన్విక్షన్ రేటును గణనీయంగా మెరుగుపరచవచ్చని సూచించారు.

అలాగే కంప్యూటర్ ఆపరేటర్లు పోలీస్ స్టేషన్లలో డేటా నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టి, సీసీటీఎన్‌ఎస్ మరియు ఇతర సాంకేతిక వ్యవస్థల వినియోగంలో ఎటువంటి లోపాలు లేకుండా పనిచేయాలని ఆదేశించారు.

డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా పోలీసింగ్‌లో పారదర్శకత, మరియు పనితీరు మరింత మెరుగుపడుతుందని ఎస్పీ గారు తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్ అమలు, సమర్థవంతమైన కోర్టు నిర్వహణ, అధిక కన్విక్షన్ రేటు సాధన లక్ష్యాల కోసం పనిచేయలని ఆదేశించారు.

తూర్పుగోదావరి జిల్లా పోలీసు విభాగంలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన అధికారులను ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం...
30/05/2026

తూర్పుగోదావరి జిల్లా పోలీసు విభాగంలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన అధికారులను ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., గారు.

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పదవీ విరమణ సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పదవీ విరమణ చేసిన 1) శ్రీ కె. ఆంజనేయులు గారు సబ్ ఇన్‌స్పెక్టర్ (జిల్లా స్పెషల్ బ్రాంచ్) 2) శ్రీ ఆర్.డి. సోమేశ్వరరావు గారు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (జిల్లా స్పెషల్ బ్రాంచ్) 3 శ్రీ కొప్పిశెట్టి రామకృష్ణ గారు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఉండ్రాజవరం) 4) శ్రీ చిట్టిబొమ్మ వరప్రసాద్ గారు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏ.ఏ.ఓ. జిల్లా పోలీసు కార్యాలయం) గార్లను జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్., గారు సాలువ కప్పి ఘన౦గా సన్మానం చేసి పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికను అందజేసినారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ... వీరు పోలీస్ డిపార్ట్మెంట్ కు చేసిన సేవలను ప్రత్యేకంగా కొనియాడినారు. వారి భావి జీవితం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి (ఎస్.బి) శ్రీ బి. రామకృష్ణ గారు, డి.ఎస్.పి (ఏ.ఆర్) శ్రీ టి.ఆర్.కె రవి కుమార్ గారు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు ఘనంగా...
28/05/2026

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు అధికారులు

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., గారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా ది. 28.05.2026 తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి అడిషనల్ ఎస్పీ (ఏ.ఆర్) శ్రీ ఎల్. చెంచిరెడ్డి గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడుతూ... తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్.టి.ఆర్ గారన్నారు. సినీరంగంలో అపూర్వ విజయాలను సాధించి, అనంతరం రాజకీయ రంగంలో ప్రవేశించి ప్రజా సేవకు అంకితమై పనిచేశారన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. సమాజ సేవ, క్రమశిక్షణ, ప్రజల పట్ల అంకితభావం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి (ఎస్.బి) శ్రీ బి.రామకృష్ణ గారు, డి.ఎస్.పి (ఏ.ఆర్) శ్రీ టి.వి.ఆర్.కె కుమార్ గారు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

బక్రీద్ పండుగను మతసామరస్యంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలితూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్....
27/05/2026

బక్రీద్ పండుగను మతసామరస్యంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., గారు.

బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం మత పెద్దలకు, ముస్లిం సోదర సోదరీమణులకు, జిల్లా ప్రజలకు ఎస్పీ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

బక్రీద్ పండుగను శాంతి, సౌభ్రాతృత్వం మరియు మతసామరస్యానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ గారు పిలుపునిచ్చారు.

పండుగ సందర్భంగా జిల్లాలోని మసీదులు, ఈద్గాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ప్రజలంతా పరస్పర గౌరవం, సోదరభావంతో పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీగారు ఆకాంక్షించారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "ప్రజా సమస్యల పరిష్కార వేదిక "పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం”,...
25/05/2026

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "ప్రజా సమస్యల పరిష్కార వేదిక "పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం”, (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా ది. 25.05.2026 వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.

నేటి పోలీసు “పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం” కార్యక్రమానికి 31 ఫిర్యాదులు రాగా, వీటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు మరియు ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడమైనది.

Address

Police Quarters, Lalacheruvu
Rajamahendravaram
533106

Telephone

100

Alerts

Be the first to know and let us send you an email when East Godavari District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to East Godavari District Police:

Share