08/02/2024
*వేపగుంట - అక్కేరి రోడ్డు సమస్య పరిష్కారానికి మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా కృషి*
*రోడ్డు మరియు డ్రైనేజీ కాల్వ ఏర్పాటుకు స్థలం కేటాయించడానికి సానుకూలంగా స్పందించిన దక్షిణ రైల్వే అధికారులు*
***************************************************************
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.రోజా గారు పుత్తూరు రూరల్ మండలం వేపగుంట - అక్కేరి రోడ్డు సమస్య ను పరిష్కరించడానికి గురువారం సంఘటనా స్థలాన్ని సందర్శించి దక్షిణ రైల్వే అధికారులతో సమీక్షించారు.
పుత్తూరు రూరల్ మండలం వేపగుంట - వద్ద రైల్వే అధికారుల మరమతులతో అక్కేరి దళిత వాడ ప్రజలకు రహదారి సమస్య తలెత్తింది.
ప్రజల వినతులపై స్పందించిన మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.రోజా గారు గురువారం అక్కేరి దళితవాడ ను సందర్శించి రైల్వే అధికారులతో చర్చించారు.
వేపగుంట నుంచి అక్కిరి దళితవాడ వరకు రోడ్డు మరియు డ్రైనేజీ కాల్వ ఏర్పాటుకు స్థలం మినహాయించడానికి రాష్ట్ర మంత్రి వినతిమేరకు దక్షిణ రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు.
కాగా అక్కేరి దళితవాడ రోడ్డు సమస్య ను మరియు డ్రైనేజీ కాల్వ ఏర్పాటుకు స్థలం కేటాయించడానికి స్థానికులు మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారికి కృతఙ్ఞతలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పుత్తూరు మండల ప్రజాప్రతినిధులు, దక్షిణ రైల్వే అధికారులు, వైస్సార్సీపీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.