01/06/2026
ప్రజల సంక్షేమమే మా ప్రాధాన్యత.. వర్షంలోనూ కొనసాగిన పెన్షన్ పంపిణీ - బీటెక్ రవి
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, ఈరోజు పులివెందుల మున్సిపాలిటీ, పెద్దకొండప్ప కాలనీ పరిధిలోని భేతెల్ చర్చి లైన్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను.
కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలాఖరు వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా, ఒకటో తారీఖునే ఉదయాన్నే పెన్షన్ పంపిణీని విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల కోసం పడ్డ ఇబ్బందులను అధిగమించి, నేడు పేద ప్రజలకు సకాలంలో సాయం అందిస్తున్నాం.
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏడాదికి 33 వేల కోట్ల రూపాయలను కేవలం పెన్షన్ల కోసమే ఖర్చు చేస్తున్న గొప్ప మనసు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు.