07/06/2024
నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలకు పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. ఒకటో రాణా పరిధిలో గురువారం డీటీవో ఉమామహేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో నంబరు ప్లేట్లు పూర్తిగా లేనివి, పాక్షికంగా లేనివి, నంబర్లు తారుమారు చేసిన వాహనాలను పట్టుకొని జరిమానాలు విధించారు. సరైన పత్రాలు లేని 70 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి నిరంతరం కొనసాగుతా యని వారన్నారు. మైనర్లకు వాహనాలిస్తే చర్యలు తప్పవని హెచ్చరిం చారు. ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ, ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.