16/07/2022
పత్రిక ప్రకటన
పోలీస్ కమిషనర్ కార్యాలయం
నిజామాబాద్
తేదీ:-15-07-2022
మహిళల మరియు బాలల సహాయ భరోసా సెంటర్ ప్రారంభం కార్యక్రమం
నిజామాబాద్ పోలీస్ లైన్ యందు భరోసా సెంటర్ గురించి నూతనంగా నిర్మాణం కోసం "భూమి పూజ" కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేడు మధ్యాహ్నం 2:59 గంటలకు భరోసా సెంటర్ మహిళాల మరియు బాలల సహాయ కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ C. నారాయణ రెడ్డి, ఐ.ఏ.ఎస్., గారు మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కే.ఆర్. నాగరాజు, ఐ.పీ.ఎస్., గారు శిలాఫలకాన్నీ ప్రారంభించి, భూమి పూజ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్రీ C.నారాయణ రెడ్డి, ఐఏఎస్., మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్.నాగరాజు, ఐ.పీ.ఎస్., గారు మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ సేఫ్టీవింగ్ పర్యవేక్షణలో నిజామాబాద్ జిల్లా యందు మూడు సబ్ డివిజన్ పరిధిలో ముగ్గురు ఎస్సైలు ఇన్చార్జిలతో షీ టీమ్స్ విజయవంతంగా పనిచేస్తున్నాయి. మహిళల మరియు పిల్లల రక్షణ గురించి మెరుగైన సేవలు అందించాలని ఉద్దేశంతో"భరోసా" కేంద్రం నిర్మాణ పనుల కోసం ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని డిజిపి సార్ గారు, మరియు స్వాతిలకు మేడం గారు ,ఫార్చువల్ గా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.
అత్యాచార బాధితులు, వేధింపులకు గురైన చిన్నారులు, మహిళలకు అండగా భరోసా కేంద్రం పనిచేయునుంది. 24 గంటల పాటు మహిళా పోలీసులు అందుబాటులో బాధితులకు భరోసా ఇస్తారు. ప్రస్తుతం హైదరాబాదులో పనిచేస్తున్న ఈ కేంద్రాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
మోసపోయిన బాధితులు మళ్లీ వంచనకు గురికాకుండా చూడటం, వారికి తిరిగి స్వేచ్ఛ జీవితాన్ని కల్పించడంలో భరోసా కేంద్రాలు కీలకంగా పనిచేస్తున్నాయి.
ప్రస్తుతం ఫోక్సో మరియు క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్ కు సంబంధించిన కేసులలో సత్వర న్యాయం చేయుట కొరకు భరోసా సెంటర్ కి బదిలీ చేయడం వలన మెడికల్ ఎగ్జామినేషన్, బాధితురాలి వాంగ్మూలం నమోదు, బాధితురాలికి మానసిక దృఢత్వానికి కౌన్సిలింగ్ ఇప్పించడం,164 c.r.p.c స్టేట్మెంట్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నమోదు చేయడం, బాధితురాలికి షెల్టర్ ఇవ్వటం వంటివి కల్పించడం చేయవచ్చు.
తద్వారా బాధితురాలు పోలీస్ స్టేషనులకు పదేపదే తిరగాల్సిన అవసరం ఉండదు. వారు కూడా తమకు భరోసా కల్పించే అధికారులతో మనసు విప్పి జరిగిన అన్యాయాన్ని వివరించగలుగుతారు.
చాలామంది బాధితురాళ్లు తమకు ఎదురైన సమస్యను పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయుటకు భయపడుతూ మరలా మరలా అదే ఆకృత్యాలకు గురి అవుతుంటారు. అటువంటి వారికి అండగా నిలిచేదే భరోసా కేంద్రం.
# భరోసా-సపోర్ట్ సెంటర్ ఫర్ ఉమెన్ మరియు చిల్డ్రన్ అనేది హింసకు గురి అయిన మహిళలకు, ప్రైవేట్ మరియు పబ్లిక్ ప్రదేశాలలో, కుటుంబంలో, సంఘంలో ,మరియు కార్యాలయంలో, మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడింది. మహిళలకు శారీరక ,లైంగిక, భావాద్వేగా, మానసిక మరియు ఆర్థిక వేధింపులను ఎదుర్కొంటున్నారు ,వయస్సు, తరగతి, కులం, విద్యా స్థితి,వైవాహిక స్థితి, జాతి వంటి వాటిలా ఎలాంటి సంబంధం లేకుండా వారికి సమస్యలను పరిష్కరిస్తుంది. లైంగిక వేధింపులకు ప్రయత్నించడం, లైంగిక వేధింపులు, గృహహింస, అక్రమ రవాణా, సంబంధిత నేరాలు, యాసిడ్ దాడులు లేదా మంత్రగత్తే ,వేట కారణంగా హింసను ఎదుర్కొంటున్న బాధిత మహిళలకు భరోసా కేంద్రంలో ప్రత్యేక సేవలు అందించబడతాయి.
# భరోసా సెంటర్లో సెంటర్ కో- ఆర్డినేటర్, మరియు సైకాలజిస్ట్, సపోర్ట్ పర్సన్ ,లీగల్ సపోర్ట్ ఆఫీసర్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఏ.ఎన్.ఎం) ,డాటా ఎంట్రీ ఆపరేటర్, మరియు అకౌంటెంట్, రిసెప్షనిస్టులతో భరోసా సెంటర్లో సేవలు అందించడం జరుగుతుంది.
భరోసా సెంటర్లో మహిళలకు బాలలకు అందించే సేవలు
*భరోసా సెంటర్ 24 గంటలు సేవలను అందిస్తుంది.
*భరోసా కేంద్రంలో పోక్సో లైంగిక నేరాల నుండి పిల్లలు రక్షణ మరియు రేప్ కేసులతో సంబంధిత బాధితులకు భరోసా కల్పిస్తుంది.
*భరోసా తక్షణ వైద్య సహాయం అందిస్తుంది.
*FIR నమోదు దశ నుండి, కోర్టులో తుది పరిష్కారానికి సంబంధించిన ప్రతి కేసుల్లో భరోసా చట్టప్రకారం సహాయాన్ని అందిస్తుంది.
* బాధితులను భరోసా సి.డబ్ల్యు.సి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరపరచడం జరుగుతుంది .
* బాధితుల అమ్మాయి/ మహిళల వివరాలను గోప్యంగా ఉంచుతుంది.
*భరోసా సెంటర్ నందు బాధితుల యొక్క161 c.r.p.c స్టేట్మెంట్ రికార్డ్ చేయబడును.
* సంబంధించిన బాధితులకు ఏమైనా మానసిక సమస్యలు ఉన్నట్లయితే, బాధితులను మానసిక రోగి చికిత్స /మనస్తత్వవేత్త (నిపుణుల) వద్దకు పంపడం జరుగుతుంది .
*బాధితురాలికి తాత్కాలికంగా మరియు అత్యవసర ఆశ్రయం అవసరమైతే సఖి కేంద్రానికి పంపివ్వడం జరుగుతుంది.
*భరోసా సెంటర్లో యుక్త వయసులో ఉన్న బాలికలు, అబ్బాయిలతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది .
*బాధితులకు కౌన్సిలింగ్ మరియు బాధితుల యోగక్షేమాలు తెలుసుకోవడానికి భరోసా సెంటర్ వారి యొక్క గ్రామాలకు వెళ్లడం జరుగుతుంది
*భరోసా సెంటర్ నందు పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాధిత బాలికలకు కిడ్స్ కీట్లు అందజేయడం జరుగుతుంది.
* నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ భరోసా సెంటర్ ద్వారా మహిళలకు సత్వర న్యాయం చేకూరే విధంగా తగు చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది.
ఈ భూమి పూజ కార్యక్రమంలో అదరపు డీ.సీ.పీ (అడ్మిన్) ఉషా విశ్వనాథ్ తిరునగరి ,అదనపు డీసీపీ (ఆపరేషన్స్) శ్రీ ఎం.నరేందర్ రెడ్డి, అదనపు డి.సి.పి (ఏ.ఆర్) శ్రీ గిరిరాజ్, నిజామాబాద్ ఏ.సి.పి శ్రీ ఏ. వెంకటేశ్వరరావు ,బోధన్ ఎ.సి.పి శ్రీ రామారావు, ఏ.ఆర్ ,ఏ.సి.పి శ్రీ సంతోష్ ,ట్రాఫిక్ ఏ.సి.పి శ్రీ నారాయణ ,ఏ.వో శ్రీ రామా రావు, పోలీస్ సూపర్డెంట్ శ్రీ శంకర్ ,పోలీస్ యూనిట్ హాస్పిటల్ డాక్టర్ సరళ మేడం, జిల్లా వెల్ఫేర్ అధికారి శ్రీమతి ఎమ్. ఝాన్సీ లక్ష్మి మరియు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇంఫస్ట్ట్రక్చర్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ పి.పి.రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పి.వి కృష్ణారెడ్డి, డైరెక్టర్ శ్రీ పి.రామా రెడ్డి ,డైరెక్టర్ శ్రీ పి. సుధా రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కె. ఆర్.నాగరాజు,IPS.,
కమిషనర్ ఆఫ్ పోలీస్
నిజామాబాద్