03/06/2026
శ్వాస ఆడక మనిషి ప్రాణం పోయే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ సాంఘీక సంక్షేమ వసతి గృహాలను సందర్శించాలి.
మా ప్రియతమ నాయకులు, హ్యాట్రిక్ రూరల్ ఎమ్మెల్యే Kotamreddy Sridhar Reddy గారికి ఒక వినమ్ర విజ్ఞప్తి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థుల కష్టాలను తెలుసుకునేందుకు ఒక రోజు ఈ హాస్టల్లో గడపి లేదా మీరు విజిట్ చేసి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతున్నాం."
సాంఘీక సంక్షేమ వసతి గృహాల్లో దయనీయ పరిస్థితులు – వెంటనే చర్యలు తీసుకోవాలి:
Kishore Gunukula గారు - JanaSena Party
ప్రధాన కార్యదర్శి,శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
నెల్లూరు దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సాంకేతిక సంక్షేమ వసతి గృహాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా సమాచారం అందడంతో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల సుబ్బారెడ్డి స్టేడియం పక్కన ఉన్న సాంఘీక సంక్షేమ వసతి గృహాలను సందర్శించారు.
ఈ సందర్భంగా హాస్టల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించిన కిషోర్ గునుకుల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్ ప్రాంగణమంతా దుర్గంధభరితంగా ఉండటం, నేలపై మట్టి పేరుకుపోవడం, బాత్రూములు శుభ్రం చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. సంబంధిత సిబ్బందిని ప్రశ్నించగా, ప్రస్తుతం కేవలం ఒక ఉద్యోగి మాత్రమే విధుల్లో ఉన్నారని, మిగిలిన సిబ్బంది సెలవుల్లో ఉన్నారని తెలిపారు.
హాస్టల్లో ఉన్న విద్యార్థులతో మాట్లాడగా, మెను ప్రకారం భోజనం అందించడం లేదని, నెలల తరబడి శుభ్రత పనులు జరగడం లేదని, వాటర్ ప్లాంట్ ఉన్నప్పటికీ పనిచేయడం లేదని తెలిపారు. దీంతో విద్యార్థులు అనారోగ్య సమస్యలతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.
ఈ సందర్భంగా కిషోర్ గుణుకుల మాట్లాడుతూ,...
“శ్వాస ఆడక మనిషి ప్రాణం పోయే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ సాంఘీక సంక్షేమ వసతి గృహాలను సందర్శించాలి. విద్యార్థులు చదువుకోవాల్సిన చోట ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొన్నాయి. లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనాలను అధికారులు నిర్లక్ష్యంతో దుర్గంధభరితంగా మార్చడం బాధాకరం.
గతంలో కోవూరు నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలో పరిస్థితులు బాగోలేవని తెలుసుకుని అక్కడే రాత్రి బస చేసి సమస్యలను తెలుసుకుందాం అని జనసేన తరపున చెప్పినపుడు ఎమ్మెల్యే Vemireddy Prashanthi Reddy గారు ఉదాహరణను ప్రస్తావించారు..
“మన ప్రియతమ నెల్లూరు రూరల్ హట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వినతి ఒకరోజు ఈ హాస్టల్లో ఉండి విద్యార్థుల పరిస్థితులను స్వయంగా పరిశీలిద్దాం... మేమంతా కూడా మీతో కలిసి ఉండేందుకు సిద్ధంగా ఉన్నాం”
దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎలా జీవిస్తున్నారు, ఏ ఆహారం తీసుకుంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రదాన కారంయదర్శి కిషోర్ గునుకుల తో జనసేన పార్టీ నాయకులు శరవణ,కుమార్,ప్రశాంత్ గౌడ్,హేమచంద్ర యాదవ్, హరి,దివానం సురేష్,వర్షన్,బ్లూ బర్డ్ అదినేత వేముల శివకృష్ణ,రాఘవ,కరణం రవి, కుప్పం శ్రీనివాసులు, మురళి, పెంచలయ్య, మచ్చ చిన్న గురవయ్య, ప్రభ, జనార్ధన్, శివ, సాయిబాబా, యాకసిరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh Ram Talluri Nadendla Manohar Naga Babu Ajaya Kumar Vemulapati Nara Lokesh