12/03/2026
తాడేపల్లి..
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు. దీంతో జనసంద్రంగా మారిన పార్టీ కార్యాలయం.
మహానేత వైయస్ఆర్ చిత్రపటానికి పూలు సమర్పించి, నివాళులర్పించిన శ్రీ వైయస్ జగన్, ఆ తర్వాత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వందలాదిగా తరలి వచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈరోజు మరొక్కసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైయస్ఆర్ ను అభిమానించే ప్రతి గుండెకు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా వైయస్ఆర్ ను ప్రేమించే ప్రతి గుండె, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆ ప్రతి గుండెకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ శ్రీ వైయస్ జగన్ ప్రసంగాన్ని ముగించారు.
పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో పాటు, పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.