17/02/2026
రాయలసీమ భవిష్యత్తుకు బలమైన బడ్జెట్ పేదల జీవితాల్లో మార్పు తెచ్చేలా కేటాయింపులు, విద్యారంగం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు, అన్ని ప్రాంతాలు, వర్గాలకు సమన్యాయం, సీఎం చంద్రబాబుకు, పయ్యావులకు ధన్యవాదాలు, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు
నందికొట్కూరు P4 కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలకుల చేతకానితనంతో కుదేలైన రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ఒక అద్భుతమైన ‘బ్లూఫ్రెంట్ అని కొనియాడారు.
కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పూర్తి నిబద్ధతతో ఈ బడ్జెట్ను రూపొందించినందుకు ముఖ్య మంత్రి చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు ధన్యవాదాలు తెలిపారు ఇది కేవలం అంకెల గారడీ కాదని, ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలా వారి జీవితాల్లో మార్పు తెచ్చేలా రూపొందించిన ‘చేతల బడ్జెట’ అని కొనియాడారు. రూ.3,32,205 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అన్నివర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.53,915 కోట్లు కేటాయించడం ప్రభుత్వ సాహసోపే తమైన నిర్ణయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేవలం మాటల తోనే రైతులను మభ్యపెట్టిందని మండిపడ్డారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తి చేసేందుకు ఊతం
కూటమి ప్రభుత్వం రైతన్నను నిజమైన రాజును చేసేందుకు వ్యవసాయం, దాని అను బంధ రంగాలకు రూ.13,598 కోట్లు కేటాయించింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత ఐదేళ్లుగా జరిగిన నిర్లక్ష్యాన్ని వీడి, అటు మేజర్ ప్రాజెక్టులతో పాటు ఇటు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఈ బడ్జెట్ అద్దం పడుతోందని ఆమె వివరించారు. పేద వాడికి సొంత ఇల్లు ఉండా లనే లక్ష్యంతో గత బడ్జెట్ (రూ.2000 కోట్లు) కంటే మూడు రెట్లు అధికంగా ఈ ఏడాది రూ.6,357 కోట్లు కేటాయించడం గర్వకారణమని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం ఏకంగా రూ.91,000 కోట్లు కేటా యించాం. సాధారణ సంక్షేమ పథకాలకు గత ఏడాది రూ. 41,000 కోట్లు ఉంటే ఈసారి దాన్ని రూ.53,000 కోట్లకు పెంచ డం మా ప్రభుత్వ చిత్త శుద్ధికి నిదర్శనమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు, పేర్కొన్నారు.