02/05/2024
11111111111111
22222222222222
నారాయణ ప్రభంజనం.....
శ్రీ చైతన్య ఘన విజయం...
మావే అన్ని ర్యాంకులు... రికార్డులు మొత్తం బద్దలు...
ఉత్తమ బోధనకు మేమే బ్రాండ్ అంబాసిడర్....
ఇది విన్నారా......రిజల్ట్ వచ్చిన క్షణానికే ఈ నినాదాలు ఆల్ ఛానెల్స్ లో మోత మోగుతాయి.....వినలేక చెవులు పగిలిపోతాయ్. సరే ఇప్పుడు అసలు మ్యాటర్ కొద్దాం.కాసేపు రియాల్టీ గమనిద్దాం.ఏ కార్పోరేట్ విద్యా సంస్థలో నైనా సీటు కావాలన్నా, ఫీజు తగ్గియాలన్నా పైరవీ చేయాలి.ఇవన్నీ అయ్యాకా...పిల్లల్ని రుద్ది రుద్దీ వదిలేయగా వచ్చిన ర్యాంకుల తో పెద్ద డబ్బానే కొట్టుకుంటుంటాయి కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు. సరే కాసేపు మానవత్వం అనే పదం పక్కన పెడదాం.ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థలను కూడా తప్పు పట్టొద్దు.ఎందుకంటే అది వారి బిజినెస్.
కానీ ఏ సార్థమూ,ఎలాంటి ప్రచారమూ చేసుకోకుండా ర్యాంకులు సాధించగలిగే ఓ సంస్థ ఉందంటే మీరు నమ్మగలరా.వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా మీరు విన్నదే నిజం.ఎందుకంటే వాళ్లకు డబ్బా కొట్టుకోవడం తెలియదు.ప్రకటన లకు అయ్యే లక్షల ఖర్చుతో కొంత మంది పేద పిల్లలను చదివించవచ్చు అనేది వారి కాన్సెప్ట్.
ఇక ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గుమ్మి రాంరెడ్డి,స్వగ్రామం చిట్యాల, జిల్లా నల్గొండ.ప్రస్తుతం హైద్రాబాద్ లో ARK అనే స్వచ్ఛంద సంస్థను నడుస్తున్నారు రాంరెడ్డి.పదవ తరగతి ఉత్తీర్ణులు అయిన పేద విద్యార్దులకు ఉచిత విద్య నందించడం సంస్థ ముఖ్య ఉద్దేశం. రైతు కుటుంబంలో జన్మించిన రాంరెడ్డి,చిన్న నాటి కష్ట నష్టాల నుంచి ఓ ఆలోచన పుట్టుకొచ్చింది.ఆ ఆలోచన లక్ష్యం గా మారింది.పేద విద్యార్థులను ఉన్నత స్థాయి లో చూడాలన్నదే ఆయన అంతిమ మార్గమై పోయింది..ఆ ఆలోచనకు పదును పెట్టారు రాంరెడ్డి.అనుకున్న విజయం సాధించ గలుగుతున్నారు.ఇయర్ అకాడమీ లో సుమారుగా 100 మంది విద్యార్థుల చదువుకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు.కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే ఆయన అండగా నిలబడుతున్నారు.ఇలా పేద విద్యార్థి, విద్యార్ధినిల ప్రతిభా నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని ఉత్తీర్ణులు గా తీర్చిదిద్దుతున్నరు.అందుకు నిదర్శనమే తాజా ఘటన.
ఆఫ్షన్ జబీన్. మైనార్టీ వర్గానికి చెందిన ఓ నిరుపేద విద్యార్థిని. ఈమె ఇంటర్ చదువుకు ఆర్ధిక భరోసా కల్పించారు ARK ఫౌండేషన్ CMD గుమ్మి రాంరెడ్డి. ఇప్పుడీ అమ్మాయి 438/440 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది.మరో పేద విద్యార్థి అఖిల్ కూడా 461/470 మార్కులతో చక్కటి ర్యాంకు సాధించి ఘనత సృష్టించారు.కార్పొరేట్ చదువులు కాదు కాబట్టి ఈ పిల్లల ర్యాంకులు టీవీలో మోగలేదు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.ఎంతో మంది పేద విద్యార్దులకు,సరస్వతి పుత్రులకు గుమ్మి రాంరెడ్డి విద్యను అందించే మెడిసిన్ అయ్యారు.
కోటీశ్వరులు కోట్లలో ఉండురు గాక.ఉన్న డబ్బును ఇన్వెస్ట్ మెంట్ చేసి రెట్టింపు డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న ఈ రోజుల్లో....వచ్చిన సంపాదన ను పేద విద్యార్థులకు ఖర్చు పెడుతున్న గుమ్మి రాంరెడ్డి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.కార్పొరేట్ విద్యా సంస్థలకు కనువిప్పు కలిగిస్తున్నారు.మానవ సంబంధాలు మనీ బందాలుగా మారుతున్న సమాజానికి ఉచిత విద్య ద్వారా చక్కటి మెసేజ్ అందిస్తున్నారు.
శభాష్ రాంరెడ్డి గారు 🌹....
Source: కిరణ్ రెడ్డి వరకాంతం.(ఐన్యూస్ జర్నలిస్ట్)