I-TDP Nayudupeta

I-TDP Nayudupeta i-TDP Naidupet Official website

05/06/2026

నెట్ జీరో క్యాంపస్‌గా ఏయూను తీర్చిదిద్దాలని ఆదేశించాను. సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలి. భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి. ఏయూకు 450 ఎకరాల భూమి ఉంది. ఖాళీ ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలి. ఏయూ క్యాంపస్‌ను బయోడైవర్సిటీ పార్క్‌గా రూపాంతరం చెందేలా అభివృద్ధి చేయాలి.


Nara Lokesh Rafi Shaik DrNelavala Vijaya Sree

05/06/2026

సైకిల్‌తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి..

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ వీధుల్లో సైకిల్ ర్యాలీ చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఏయూ క్యాంపస్ నుంచి నోవోటెల్ హోటల్ వరకు సైకిల్‌పై ప్రయాణించిన సీఎం చంద్రబాబు గారు.


జూన్ 4, 2024...ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు.విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్ర...
04/06/2026

జూన్ 4, 2024...
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు.
విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు.
ఆ విజయం మాకు అధికారం కాదు... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత.
ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా చేయాలనేది మా సంకల్పం.
నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తూ...
మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.

జై ఆంధ్రప్రదేశ్!
AndhraPradesh

04/06/2026

పంతం నెగ్గిన రోజు..🔥🔥

04/06/2026

సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు... 🔥🔥
గొడ్డలి పార్టీకి, ఏపీ ప్రజలు గొడ్డలి వేటు వేసిన రోజు..




*నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కీలక సమీక్షా సమావేశం విజయవంతం***గౌరవనీయులైన పార్టీ నాయకులకు మరియు పсуపు సైనికులకు నమస...
04/06/2026

*నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కీలక సమీక్షా సమావేశం విజయవంతం*
**గౌరవనీయులైన పార్టీ నాయకులకు మరియు పсуపు సైనికులకు నమస్కారం.**
మన ప్రియతమ ముఖ్యమంత్రి, తెలుగుజాతి నవనిర్మాత **శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి** ఆదేశాల మేరకు, అలాగే మన సూళ్లూరుపేట నియోజకవర్గ గౌరవ శాసనసభ్యురాలు **డాక్టర్ నెలవల విజయశ్రీ గారి** మార్గదర్శకత్వంలో..
నాయుడుపేట పట్టణ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ విభాగాల ఇన్‌చార్జీల అత్యంత కీలకమైన¹ సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించబడింది.
**ప్రతినెలా మొదటి వారం 'బుధవారం' స్థిర సమావేశం:**
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడానికి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాము. ఇకపై **ప్రతి నెల మొదటి వారం బుధవారం* తప్పనిసరిగా ఈ ఇన్‌చార్జీల సమన్వయ సమావేశం నిర్వహించబడుతుంది.
ప్రాధాన్యత కలిగిన సమావేశంలో పాల్గొని, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించిన:
* 🎯 *క్లస్టర్ ఇన్‌చార్జీలకు (Cluster In-charges)*
* 🎯*వార్డ్ ఇన్‌చార్జీలకు (Ward In-charges)*
* 🎯 *బూత్ ఇన్‌చార్జీలకు (Booth In-charges)*
* 🌟 సీనియర్ నాయకులకు మరియు కార్యకర్తలకు పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు ఎమ్మెల్యే విజయశ్రీ గారు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. నిరంతరం ప్రజల్లో ఉంటూ, వార్డుల వారీగా సమస్యల పరిష్కారానికి మరియు పార్టీ బలోపేతానికి మనమంతా సైనికుల్లా కలిసికట్టుగా శ్రమిద్దాం!
*ఇట్లు,*
*మీ 786 రఫీ గారు,*
టౌన్ పార్టీ అధ్యక్షులు, నాయుడుపేట
మీ చిత్తూరు సాయి హేమంత్
i-TDP నాయుడుపేట టౌన్
#786రఫీ

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియ గురించి జగన్ చేస్తున్న ప్రచారం మొత్తం ఫేక్ ప్రచారమే. దరఖాస్తుల సమర్పణ నుంచి...
03/06/2026

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియ గురించి జగన్ చేస్తున్న ప్రచారం మొత్తం ఫేక్ ప్రచారమే. దరఖాస్తుల సమర్పణ నుంచి ధ్రువపత్రాల అప్‌లోడ్, పరిశీలన, ధృవీకరణ, ప్రాధాన్యత జాబితా తయారీ వరకు మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించడం ద్వారా పూర్తి పారదర్శకత మరియు బాధ్యతాయుత మైన నియామకాలు జరిగాయి.


భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంపై మంగళవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర క...
03/06/2026

భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంపై మంగళవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొనడం జరిగింది.

త్వరలో చేపట్టనున్న "SIR" కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అమలు చేయాల్సిన కార్యాచరణ, ఓటర్ల నమోదు మరియు సవరణ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై సమగ్రంగా చర్చించడం జరిగింది.

ఈ అవగాహన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి N. Chandrababu Naidu గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు Palla Srinivasa Rao గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఓటరు హక్కును పరిరక్షించేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేసి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.








Address

Nayudupeta
Naidupeta

Alerts

Be the first to know and let us send you an email when I-TDP Nayudupeta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share