10/03/2025
# తేది: 09.03.2025 # PS Venkatapuram
వేసవికాలంలో ప్రజల యొక్క దాహార్తి తీర్చలనే ఉద్దేశ్యంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా ఒక ప్రతిష్టాత్మకమైన చర్య తీసుకోవాలనే సంకల్పంతో వెంకటాపురం పోలీసు వారు ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఫ్రిజ్ ని ఏర్పాటుచేసి చలివేంద్రంను ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వెంకటాపురం సిఐ గారు శ్రీ బండారి కుమార్, వెంకటాపురం ఎస్ఐ గారు శ్రీ కె. తిరుపతి రావు గారు, ఏ.ఎస్.ఐ అక్బర్ భాషా గారు, వారి సిబ్బంది మరియు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ సాయి ప్రకాష్ గారు హాజరవ్వడం జరిగింది.