04/06/2026
టీటీడీ ఆధ్వర్యంలో నడిచే హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో, జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న “గుండ్లకమ్మకు హారిత హారం” కార్యక్రమ ఏర్పాట్లలో భాగంగా జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీ హరిహరావు గారు, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీ వెంకట్ రెడ్డి గారు, బంగారమ్మ గుడి ఛైర్మన్ శ్రీ గుంటక సుబ్బారెడ్డి గారితో కలిసి గుండ్లకమ్మ నది ఒడ్డున వెలసిన శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో చేపట్టనున్న హారితహారం కార్యక్రమం, మొక్కల నాటడం, పరిశుభ్రత చర్యలు మరియు ప్రజల భాగస్వామ్యంపై చర్చించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ధర్మ పరిరక్షణ కూడా సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించడం జరిగింది.
ప్రకృతిని సంరక్షించడం అంటే భవిష్యత్ తరాలకు జీవనాధారాన్ని అందించడం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి, దానిని సంరక్షించి పచ్చని ప్రకృతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాము.
🌱 గుండ్లకమ్మకు హారిత హారం
🌿 పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత
🙏 ధర్మ పరిరక్షణతో పాటు ప్రకృతి పరిరక్షణ కూడా మన కర్తవ్యం
#గుండ్లకమ్మకు_హారితహారం SaveNature PlantTrees GreenFuture JaiHanuman