31/08/2021
*మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి పైన స్వయంగా గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది*
*మీ రక్షనే మా బాధ్యత*
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి పైన ఏర్పడిన గుంతల వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని, ఇట్టి విషయాన్ని R&B అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లగా, ఆర్అండ్బి అధికారులు కూడా స్పందించి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బ్రిడ్జి పైన ఏర్పడిన గుంతలను పూడ్చివేసినారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజు గారు మరియు ట్రాఫిక్ సిబ్బంది, R & B అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ వర్షాకాలంలో వాహదారులు ట్రాఫిక్ నియమాలను తప్పక పాటిస్తూ, తమ వాహనాలను నెమ్మదిగా నడపాలని, విధిగా హెల్మెట్ ధరించాలని, వాహనంకు వాహనంకు మధ్య దూరం పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.