AIAWU Mahabubabad District Telangana

AIAWU Mahabubabad District Telangana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AIAWU Mahabubabad District Telangana, Political organisation, Mahabubbad.

16/04/2023

గ్రామీణ ఉపాధి పని పైన కేంద్ర ప్రభుత్వ వైఖరి

Hanmakonda AIAWU victoryతెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం  హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత ఎనిమిది నెలలుగా ఎల్కతుర్తి మండ...
22/11/2022

Hanmakonda AIAWU victory

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత ఎనిమిది నెలలుగా ఎల్కతుర్తి మండల పేదల పోరాడి ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న పక్కా ఇండ్లను ప్రారంభిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం పోతినేని సుదర్శన్ రావు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మరియు ఇతర నాయకులు

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న సంఘం ఆధ్వర్యంలో డ...
14/04/2022

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సందర్భంగా ఈ కార్యక్రమాల జనక వెంకన్న భూక్యా చంద్రు నాయక్ పెండ్ర చిన్న uppali వెంకన్న పోలే పొంగు సాలయ్య ఎంపీటీసీ మాజీ బాసి పొంగు రాము కిరణ్ తదితరులు పాల్గొన్నారు

https://youtu.be/vYbaMnmTI4s
13/04/2022

https://youtu.be/vYbaMnmTI4s

చేర్యాల తహసీల్దార్ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల ధర్నా || SSC NEWS News Is a local channel From Siddipet. The Chan...

03/01/2022
24 గంటల ధర్నా  November  25 -26హైదరాబాద్  జయప్రదం చేయాలని విన్నపం రైతు వ్యతిరేక చట్టాలు,  విద్యుత్  సవరణ చట్టం  రద్దు చే...
18/11/2021

24 గంటల ధర్నా November 25 -26
హైదరాబాద్ జయప్రదం చేయాలని విన్నపం

రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో చేస్తున్న ధర్నా సంవత్సరం పూర్తి అవుతుంది ఆ నాటికి.

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగానవంబర్‌ 25, 26 న 24 గంటల ధర్నాకార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్...
14/11/2021

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా
నవంబర్‌ 25, 26 న 24 గంటల ధర్నా

కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించాలని, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరవధిక ఆందోళన ప్రారంభమై సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా నవంబర్‌ 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో 24 గంటల నిరవధిక ధర్నాను నిర్వహించాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్లు టి సాగర్‌, వేములపల్లి వెంకట్రామయ్య, కెచ్చల రంగయ్య, వ్య.కా.స రాష్ట్ర అధ్యక్షులు బి ప్రసాద్‌ మాట్లాడారు. రాష్ట్రంలోని రైతు, ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

జిల్లా సదస్సులు :- కేంద్ర కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, రాష్ట్రంలోని వరి కొనుగోళ్ళు, పోడు రైతుల సమస్యలపై ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సదస్సులు నవంబర్‌ 17 నుండి 23 వరకు ఉమ్మడి జిల్లా సదస్సులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వరి కొనుగోళ్ళ విషయంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రైతుల సమస్యలను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. వానాకాలం వరి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు వస్తున్నది. కొనుగోలు కేంద్రాలను పెంచి, మద్దతు ధర సక్రమంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాలల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, గోనె సంచుల కొరత లేకుండ చూడాలన్నారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం దరఖాస్తు చేసుకున్న అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాల అమలులో భాగంగానే యాసంగిలో వచ్చే వరి కొనుగోలు చేయమని ప్రకటిస్తున్నదన్నారు. దేశంలో 2013 ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తే రాష్ట్రంలో పండిన పంటతోపాటు అదనంగా అవసరమౌతాయని అన్నారు. ప్రపంచ ఆకలి సూచికలో భారత దేశం మన పొరుగున ఉన్న చిన్న దేశాల కంటే వెనుకబడి ఉందన్నారు. దాదాపు 20 కోట్ల మంది ఆహార భద్రత సమస్యను ఎదుర్కొంటుందన్నారు. వీరందరికి ఆహార ధాన్యాలను సరఫరా చేస్తే తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో పండిన ఆహార ధాన్యాలన్ని సరిపోతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించకుండా పేదలందరికీ ఆహార ధాన్యాలను సరఫరా చేయాలన్నారు. రైతులు పండించిన పంటలన్నింటికీ కనీస మద్దతు ధరల చట్టం ప్రకారం కొనుగోలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమాల విజయవంతానికి రాష్ట్రంలోని కార్మిక, విద్యార్థి, యువజన, మేదావి, మహిళ, సామాజిక, గిరిజన, మైనార్టీ సంఘాలన్ని సహకరించాలని, ఈ డిమాండ్లకు మద్దతు తెలిపే రాజకీయ పార్టీలు కూడ కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్లు పశ్యపద్మ, పల్లపు ఉపేందర్‌రెడ్డి, అచ్యుత రామారావు, కన్నెగంటి రవి, జక్కుల వెంకటయ్య, వ్య.కా.స రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ తదితరులు పాల్గొన్నారు.

Address

Mahabubbad

Website

Alerts

Be the first to know and let us send you an email when AIAWU Mahabubabad District Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share