24/01/2024
ఈరోజు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు బహుజన్ యువసేన బి వై ఎస్ మదనపల్లి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి మదనపల్లిలో ప్రవేట్ కార్పొరేట్ మరియు ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయాలు అరాచకాల గురించి ఫిర్యాదు చేయడం జరిగింది, బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ మదనపల్లి లోని ప్రవేట్ కార్పొరేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలను నిలువుగా దోపిడీ చేస్తున్నారని, హిందువులైన ముస్లింలైన క్రిస్టియన్ లైన్ కలిసి చేతులెత్తి మొక్కే దేవుడు డాక్టర్ లేనని, దేవుడు లాంటి డాక్టర్లు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి, క్యాష్ చేసుకుంటూ వైద్యాన్ని ఒక వ్యాపారంగా మార్చేశారని పునీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు, మదనపల్లిలోని ఆద్య కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో తప్పుడు రిపోర్ట్స్ తో ఆపరేషన్ చేయాలంటూ డబ్బులు వసూలు చేస్తూ, ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేసినా కూడా డబ్బులు వసూలు చేస్తున్న ఆద్య హాస్పిటల్ యాజమాన్యం అని పునీత్ చెప్పారు, ఆపరేషన్లు పేద ప్రజలకు ఉపయోగపడాలని ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు తండ్రి అయినా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అమలుపరిచారని అలాంటి ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకున్న డబ్బులు వసూలు చేయడం ఏమిటని పునీత్ ప్రశ్నించారు, ప్రవీణ్ న్యూరో హాస్పిటల్ యాజమాన్యం అయితే బెంగళూరు చెన్నై సిటీలో వంటి స్థాయిలో డబ్బులు వసూలు చేస్తూ, బిల్స్ డిస్చార్జ్ అమరు ఇవ్వమంటే ఇవ్వడానికి నిరాకరిస్తూ ప్రశ్నించిన వారిని దూషించిన గతంలో కూడా జరిగాయని పునీత్ చెప్పారు, మరీ ముఖ్యంగా చిన్నపిల్లల హాస్పిటల్ అయినా రెయిన్బో హాస్పిటల్ అక్కడైతే చిన్నపిల్లలు ఏ సమస్య మీదకు వెళ్ళినా కూడా ఐసీయూలో చేర్పించాలని తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసి వేలకు వెళ్ళు గుంజుకోవడం జరుగుతుందని పునీత్ తెలిపారు, ప్రవేట్ హాస్పిటల్స్ ఇలా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకోవడానికి వెళ్తే అధికారులు వైద్యులు ఇక్కడ వాటికి సంబంధించిన డాక్టర్లు లేరని బయట ఉన్న ప్రైవేట్ డాక్టర్లు తో కమిషన్లకు కుమ్మక్కై గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చిన పేషెంట్లను వీరే ప్రవేట్ హాస్పిటల్కు తరలిస్తున్నారని, డాక్టర్లు లేక వైద్యం అందించకపోవడమే కాకుండా బయట హాస్పిటల్ కు పంపించడం ఏమిటని పునీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు కావున స్థానిక సబ్ కలెక్టర్ గారు సంబంధించిన అధికారులు, ప్రజా సంఘాల నాయకులు మరియు ఎమ్మెల్యే అభ్యర్థులు వీటి గురించి ప్రశ్నించి పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేయాలని, ఉన్నతాధికారులు వీటి పైన చర్యలు తీసుకోని పక్షాన హాస్పిటల్ దగ్గరే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని పునీత్ తెలిపారు, ఈ కార్యక్రమంలో బి వై ఎస్ నాయకులు సుధాకర్, నవీన్, ఆది, షరీఫ్,గొల్లపల్లి శశి, దేవేష్, శాండీ,బాలు,సాదిక్, హరి, సోము, మురళి,వేణు తదితరులు పాల్గొన్నారు