28/05/2026
ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో బండి రామకృష్ణ
👉ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ
క్లీన్ స్వీప్ లో భాగంగా
*8.వ డివిజన్ ఆర్టీసీ కాలనీలో కర్రీ మహేష్* ఆధ్వర్యంలో రెండు కిలోమీటర్ల మేర క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు
👉కూటమి ప్రభుత్వం పట్టణాలను చెత్త రహితంగా, పరిశుభ్రంగా మార్చడానికి చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమమే 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' అన్నారు
👉ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం
చెత్త ప్రాంతాల తొలగింపు: నగరాలు మరియు పట్టణాలలో పేరుకుపోయిన చెత్త కుప్పలు పూర్తిగా తొలగించడం.డ్రైనేజీల శుభ్రత: వర్షపు నీరు నిల్వ ఉండకుండా మురుగునీటి కాలువలు, నాలాలు మరియు బ్యాక్ లేన్లను శుభ్రపరచడం.ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ పబ్లిక్ టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడం.తడి-పొడి చెత్త విభజన: ఇళ్లల్లో, వాణిజ్య సముదాయాల్లో చెత్తను వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించి, శాస్త్రీయమైన ఘన వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడం
అన్నారు
👉రాష్ట్రంలోని మొత్తం 123 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు), సహా మచిలీపట్నం పరిధిలో కూడా ఈ నాలుగు వారాల ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కొనసాగుతోందని పరిశుభ్రత అనేది కేవలం మున్సిపాలిటీ బాధ్యతే కాకుండా,
పౌరులందరి నిత్య జీవితంలో భాగం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం దీన్ని చేపట్టిందని
రామకృష్ణ పేర్కొన్నారు
👉ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గడ్డంరాజు,
కొట్టే వెంకట్రావు,తోటభాస్కర్,
శాయన శివయ్య,సనకా భాస్కర్ రావు, త్రిపురారి తరుణ్,సోమిశెట్టిగోపాలకృష్ణ, కర్రీ ప్రకాష్, కర్రీ శ్యామ్, బచ్చు వెంకన్న బాబు,పట్నాలచంటి
జనసేన పార్టీ నాయకులు సైనికులు 8.వ డివిజన్ ప్రజలు ఆర్టీసీ కాలనీవాసులు పాల్గొన్నారు