Jupally Krishna Rao

Jupally Krishna Rao Minister for Excise and Prohibition,
Tourism and Culture, Government of Telangana. MLA from Kollapur.
(1)

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షులు, గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శు...
20/06/2026

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షులు, గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

తెలంగాణకు ఆదాయ వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌పై హైదరాబాద్‌లోని సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆదాయ వ...
19/06/2026

తెలంగాణకు ఆదాయ వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌పై హైదరాబాద్‌లోని సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆదాయ వనరుల పెంపు, ఆర్థిక బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన వనరుల సమీకరణపై సమగ్రంగా చర్చించారు.

హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ఆదాయ వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌పై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి అధ్యక్షతన జరిగిన ...
19/06/2026

హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ఆదాయ వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌పై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హాజరయ్యారు.

రాష్ట్రంలో పర్యాటక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవ‌రం ఉందని ఈ సందర్భంగా సబ్ కమిటీ అభిప్రాయపడింది. ప‌ర్యాట‌క కేంద్రాల్లోని ప్ర‌భుత్వ భూములు, స్థ‌లాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించి ఖ‌జానాకు ఆదాయాన్ని తీసుకురావాల‌ని అధికారులకు సూచించింది. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం రంగాల్లో మ‌రింత దూకుడుగా ముందుకు వెళ్లాల‌ని సబ్ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. వారాంతాల్లో హెలీకాప్ట‌ర్ టూరిజాన్ని పెంచేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని అన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లో పర్యటకాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టులు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టూరిజం ఆస్తులు పూర్తి స్థాయిలో వినియోగంలో లేవ‌న్నారు. వాటిని పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసి సంప‌ద సృష్టించాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు. ఆదాయ స‌మీక‌ర‌ణ‌లో ప‌ర్యాట‌క ప్రాంతాల్లో మౌలిక వ‌స‌తులు, అభివృద్ధి కీల‌క పాత్ర పోషిస్తాయని అన్నారు.

అటు లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మేడిగడ్డ తదితర ప్రాంతాల్లో పూడిక‌తీత ప‌నుల‌పై కేబినెట్ ప‌బ్ క‌మిటీ సమీక్ష చేసింది. నిబంధ‌న‌లు పాటించే క్ర‌ష‌ర్ల నిర్వాహ‌కుల‌కు అనుమతులు ఇవ్వాలని స‌బ్ క‌మిటీ సభ్యులు సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యించారు. పొరుగు రాష్ట్రాల‌కు ఇసుక‌ను ఎగుమ‌తి చేయ‌డంపై సాధ్యాసాధ్యాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు.

రాష్ట్రంలో రిజిష్ట్రేష‌న్ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా స్లాబ్ అధారిత భూముల విలువ స‌వ‌ర‌ణ వ‌ల్ల మెరుగైన ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. ర‌వాణాశాఖ‌కు సంబంధించి ఆదాయం... వసూళ్లు పెంచేలా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై కేబినెట్ స‌బ క‌మిటీ స‌మీక్ష చేసింది. అందులో భాగంగా బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ల విషయంలో పన్నులపై రాష్ట్ర అధికారాన్ని సమర్థిస్తూ కేరళకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినట్లు స‌బ్ క‌మిటీ గుర్తించింది. భార‌త్ సిరీస్ రిజిస్ట్రేష‌న్ల‌పై చట్టపరమైన, విధానపరంగా తీసుకోవ‌ల్సిన అంశాల‌పై స‌బ్ క‌మిటీ చ‌ర్చింది. బీహెచ్ సిరీస్ పన్నుల అంశంపై చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. పరిశ్రమల శాఖకు సంబంధించి పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ కార్యక్రమాల ద్వారా ఆదాయ సమీకరణను సమీక్షించారు.

సంక్షేమ విద్యార్థులకు సంపూర్ణ కిట్‌  జూన్ 19న విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్‌ కిట్లు పంపిణీ.ఎల్బీ స్టేడియంలో విద్య...
19/06/2026

సంక్షేమ విద్యార్థులకు సంపూర్ణ కిట్‌

జూన్ 19న విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్‌ కిట్లు పంపిణీ.
ఎల్బీ స్టేడియంలో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయనున్న గవర్నర్, సీఎం.
సర్కారు పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు, వసతిగృహాల విద్యార్థులకు లబ్ధి.
పాఠశాలలు, కళాశాలలను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులతో ప్రతిజ్ఞ.

కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, భారత దేశానికి కాబోయే ప్రధాని, లోక్ సభలో ప్రతిపక్షనేతశ్రీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన...
19/06/2026

కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, భారత దేశానికి కాబోయే ప్రధాని, లోక్ సభలో ప్రతిపక్షనేత
శ్రీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

నేటి నుంచి వన మహోత్సవానికి శ్రీకారం.16.06 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం.రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్కులో కార్యక్ర...
18/06/2026

నేటి నుంచి వన మహోత్సవానికి శ్రీకారం.
16.06 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం.

రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్కులో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం.

రాష్ట్రవ్యాప్తంగా 13,242 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసిన అధికారులు.

17/06/2026

కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో ప్రభుత్వం నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ అబ్బురపరుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలకు అంతర్జాతీయస్థాయి విద్యనందించాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ఈ సరికొత్త విద్యా విప్లవానికి తెరతీసింది. బహుళ అంతస్థుల భవనాలు, విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానాలతో పబ్లిక్ స్కూల్ విద్యార్థులను, తల్లిదండ్రులను అమితంగా ఆకర్షిస్తోంది.

వీపనగండ్లలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో అదనపు మౌలిక వసతుల నిర్మాణ పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు శంకుస్థా...
17/06/2026

వీపనగండ్లలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో అదనపు మౌలిక వసతుల నిర్మాణ పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యతపై మంత్రి ఆరా తీశారు. ఏ సమస్య ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు. ప్రజాప్రభుత్వంలో సర్కారీ బడుల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయని, తల్లిదండ్రులు విద్యార్థిని, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్లలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో ఎక్స్-రే ల్యాబ్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ప్రార...
17/06/2026

కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్లలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో ఎక్స్-రే ల్యాబ్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిని పరిశీలించిన ఆయన... రోగులతో మాట్లాడి వైద్యసేవల గురించి ఆరాతీశారు. అదే విధంగా గోపాలదిన్నె గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వీపనగండ్లలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో అదనపు మౌలిక వసతుల నిర్మాణ పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు శంకుస్థా...
17/06/2026

వీపనగండ్లలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో అదనపు మౌలిక వసతుల నిర్మాణ పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యతపై మంత్రి ఆరా తీశారు. ఏ సమస్య ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు. ప్రజాప్రభుత్వంలో సర్కారీ బడుల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయని, తల్లిదండ్రులు విద్యార్థిని, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Address

Lingampally

Website

Alerts

Be the first to know and let us send you an email when Jupally Krishna Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jupally Krishna Rao:

Share