My city-KURNOOL

My city-KURNOOL Like and start getting updates of kurnool My city Kurnool page will provide updates about kurnool city which is Ranked as 4th biggest city in Andhra pradesh.
(1086)

We update information which is upto our knowledge.My city Kurnool encourage Educational events,Emergency blood service,social awareness and all other social activities which will helps people. More info will get updated soon....

05/09/2026

*Minister TG Bharath Appeals for Eco-Friendly Ganesh Festival Amid Water Scarcity*

Minister TG Bharath has requested people to celebrate the Ganesh festival with small size idols as Kurnool is facing water scarcity in the KC Canal due to less rainfall.

He said the El Nino effect is the reason for low rainfall this year.

He also urged people to go for eco-friendly Ganesh idols.

వినాయక చవితి ఉత్సవాలను  ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి**ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగునీటికి ఇబ్బం...
04/09/2026

వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి*

*ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలి*

*చిన్న విగ్రహాలను ఏర్పాటు చేయాలి*

*జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*

రానున్న వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాగు నీటికి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి కోరారు.

కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో గణేష్ చతుర్థి ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులతో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఎల్ నినో ప్రభావం ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా, ప్రధానంగా తాగునీటి అవసరాల కోసమే వినియోగించాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. రాబోయే కాలంలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి వనరులను సంరక్షించుకోవడం అత్యవసరమన్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల కోసం తాగునీటి అవసరాలకు కేటాయించిన నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నన్నూరు టోల్ గేట్ దగ్గర ఉన్న హెచ్ ఎన్ ఎన్ ఎస్ కాలువ, తడకనపల్లి, ఉలిందకొండ హెచ్ ఎన్ ఎన్ ఎస్ కాలువ, గార్గేయపురం చెరువులో గణేష్ నిమజ్జనం ప్రత్యామ్నాయ మార్గాలని కలెక్టర్ కమిటీ సభ్యులకు సూచించారు. ఈసారి పెద్ద పరిమాణంలోని వినాయక విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనానికి సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున, సాధ్యమైనంత వరకు చిన్న పరిమాణంలోని విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రకృతి విపత్తులు, నీటి కొరత వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించాలని అన్నారు. చిన్న విగ్రహాల ఏర్పాటు ద్వారా నిమజ్జన ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు నీటి వినియోగాన్ని కూడా తగ్గించవచ్చని తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. నిమజ్జన ప్రదేశాల వద్ద ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, అవసరమైన బారికేడ్లు, లైటింగ్, పారిశుద్ధ్య సదుపాయాలు, అత్యవసర సేవలు, పోలీసు బందోబస్తు వంటి ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో చ

కరువు ఉరుముతోంది రెండున్నర నెలలుగా జాడలేని వర్షాలుదాదాపు అన్ని పంటల్లో దిగుబడులు జీరోఉమ్మడి జిల్లాలో రూ.2500 కోట్ల పెట్ట...
04/09/2026

కరువు ఉరుముతోంది రెండున్నర నెలలుగా జాడలేని వర్షాలు
దాదాపు అన్ని పంటల్లో దిగుబడులు జీరో
ఉమ్మడి జిల్లాలో రూ.2500 కోట్ల పెట్టుబడి మట్టిపాలు
కర్నూలు జిల్లాలో 43 శాతం, నంద్యాల జిల్లాలో 43.1 శాతం లోటు వర్షపాతం., ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేనట్లే..
ఖరీఫ్ సీజన్లో లో మూడు నెలలు గడచిపోయాయి. మామూలుగా ఈ పాటికి చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకోవాల్సి ఉంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఎటు చూసినా ఏడారి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
కర్నూలు జిల్లాలో 3,44,171 హెక్టార్లలో పంటలు సాగు చేయగా..
హెక్టారుకు రూ.50 వేల ప్రకారం రూ.1,720 కోట్ల పెట్టుబడి నష్టం జరిగింది., నంద్యాల జిల్లాలో 1,55,477 హెక్టార్లలో పంటలు సాగు చేయగా.. కేవలం పెట్టుబడి రూపంలోనే రూ.773 కోట్లు మట్టిపాలయింది.

04/09/2026

కర్నూలు జిల్లా తుంగభద్ర నది ప్రాంతంలో మొసలి తిరుగుతున్నాయి అప్రమత్తంగా ఉండాలి: అటవీశాఖ హెచ్చరిక...!!

తుంగభద్ర నదిలో నీటిమట్టం తగ్గడంతో నందవరం మండలం నాగులదిన్నె సమీపంలో మొసలి సంచరిస్తున్నట్లు గుర్తించినట్లు జిల్లా అటవీ అధికారి పి. శ్యామల, ఐఎఫ్ఎస్ తెలిపారు. మొసలిని పట్టుకోవడం, బయటకు లాగడం, కర్రలతో కొట్టడం, రాళ్లు వేయడం లేదా తరిమివేయడం చేయరాదని సూచించారు.
మొసళ్లు ను వేధించడం చట్టరీత్యా నేరం, వాటికి హాని కలిగిస్తే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.

03/09/2026

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి ధర క్రమంగా పెరు గుతోంది. మార్కెట్కు బుధవారం ఉల్లిగడ్డలు 1,071 క్వింటాళ్లు రాగా.. కనిష్ట ధర రూ.2,069, గరిష్ట ధర రూ. 4,359 లభించగా.. సగటు ధర రూ.3,760 నమోదైంది. మార్కెట్లో ఉల్లి ధర పెరుగుతుండటంతో రీటైల్ మార్కెట్లోనూ ఉల్లి ధరకు రెక్కలొచ్చాయి. కాగా కర్నూలు మార్కె ట్లో వేరుశనగకు గరిష్ట ధర రూ.9,500, ఆదోనిలో రూ.9,155, ఎమ్మిగనూరులో రూ.8,269 ప్రకారం ధరలు లభించాయి. ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు పత్తి 2,435 క్విం టాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.5,269, గరిష్ట ధర రూ.9,919 లభించగా సగటు ధర 9,729 నమోదైంది.

03/09/2026

YS Jagan Mohan Reddy Garu in Kurnool today - Attending Ex MLA son marriage at st.jospeh College ground.

03/09/2026

గొంతు తడవాలంటే 2 కి.మీ. నడవాల్సిందే!
కర్నూలు(D) తుగ్గలి (M) లింగనేందొడ్డిలో తాగునీటి కోసం మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని వారాలుగా కొళాయిలకు నీరు రావడం లేదు. దీంతో మహిళలు, వృద్ధులు, వికలాంగులు 2 కి.మీ నడిచి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు.

02/09/2026

నందవరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి గారు*

*విద్యార్థి దశలో లక్ష్యాల నిర్దేశం, వాటి సాధన, నడవడిక తదితర అంశాల గురించి విద్యార్థులకు వివరించిన జిల్లా కలెక్టర్ గారు.

My City-KURNOOL from the skies 😍
02/09/2026

My City-KURNOOL from the skies 😍

01/09/2026

నింగిన పుష్పవృష్టి.. భువిన భక్తజన సాగరం.. పండితులు వేద ఘోషలు.. కళాకారుల సం ప్రదాయ ప్రదర్శనల మధ్య వేదమూర్తి శ్రీరాఘవేంద్ర స్వామి రథోత్సవం సోమవారం కనులపండువగా సాగింది. రాఘవేంద్రుల 355వ ఆరాధన సప్తరాత్రోతృ వాల్లో భాగంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీ ర్థులు ఆశీస్సులతో ఉత్సవమూర్తి మహారధోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తరారాధనలో భాగంగా ముందుగా ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయు లను గురుసార్వభౌమ వేద పాఠశాలకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ అశేషజనం మధ్య శ్రీ రాఘవేంద్ర స్వామి మహారథోత్సవ పాఠశాల విద్యార్థులు వేద పఠనం కానిస్తూ విశేష ఉ పూజలు చేశారు. అక్కడి నుంచి శ్రీమఠం మూల బృం చే దావనం చేరుకోగా స్వామిజీ ఉత్సవమూర్తి బుగ్గలకు గంధం పూసి వసంతోత్స వానికి శ్రీకారం పలికారు. స్మ గర్భాలయంలో అర్చకులు, పండితులు, పీఠాధిపతి ప్ర గులాలు చల్లుకుని ఆచార వైభవాన్ని స్పృశింపజేశారు. మంగళవాయిద్యాలు, ఉత్సవ పతాకాలతో ఉత్సవ మూర్తితో మహారథం చెంతకు చేరుకున్నారు.
మహారథం చుట్టూ ప్రదక్షిణలు ఉత్సవమూర్తి మహారథం చేరుకోగా పీఠాధిపతి రథచ క్రాలకు నారీకేళాలు సమర్పించి అర్చనలు చేశారు.

Address

Kothapeta
Kurnool
518001,02,03,04

Alerts

Be the first to know and let us send you an email when My city-KURNOOL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to My city-KURNOOL:

Shortcuts

Share