04/06/2026
"కర్నూలు జిల్లాలో ఆహార భద్రతపై జిల్లా కలెక్టర్ A Siri garu కీలక ఆదేశాలు జారీ చేశారు.
హోటళ్లు, స్వీట్ షాపులు, పచ్చళ్ల తయారీ కేంద్రాలు, అలాగే వీధి వ్యాపార కేంద్రాల్లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను నిరంతరం తనిఖీ చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు.
రసాయనాలు కలిపిన లేదా నిల్వ ఉంచిన నాసిరకం ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే, వాటిని వెంటనే సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యత అని జిల్లా యంత్రాంగం పేర్కొంది.