Pangidi Development Followers

Pangidi Development Followers HEP EVER ; HURT NEVER

https://youtu.be/ejIxgVsW7M0
23/06/2024

https://youtu.be/ejIxgVsW7M0

నోటా కి ఓటు వేసి ఏదో మేధావిలా ఫీల్ అవుతారు | Pawan Kalyan Satires On NOTA Voters | JanaSena PartyFo...

పంగిడి మాజీ సర్పంచ్ PK రంగారావు గారి సతీమణి అయిన పోట్రూ సుజాత గారు ఇకలేరుఈ వార్త విని చాలా చింతిస్తున్నాం పంగిడి గ్రామ అ...
16/10/2021

పంగిడి మాజీ సర్పంచ్ PK రంగారావు గారి సతీమణి అయిన పోట్రూ సుజాత గారు ఇకలేరు

ఈ వార్త విని చాలా చింతిస్తున్నాం పంగిడి గ్రామ అభివృద్ధి లో మీరు కీలక పాత్ర పోషించారు ఎప్పటికి మీ రుణం తీర్చుకోలేనిది ఇట్లు పంగిడి గ్రామ ప్రజలు

పంగిడి గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ వెలగలమ్మ (చిట్టితల్లి)  మహిషాసురమర్థిని అవతారం లో ఎనిమిదోవ రోజు దర్శన భాగ్యం కలిపించారు...
14/10/2021

పంగిడి గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ వెలగలమ్మ (చిట్టితల్లి) మహిషాసురమర్థిని అవతారం లో ఎనిమిదోవ రోజు దర్శన భాగ్యం కలిపించారు దర్శించండి తరించడి.

ఐ. పంగిడి పరిసర ప్రాంతాల క్రషర్,క్వారీ యజమానులకు సూచన: అనేక క్వారీలకు పర్యావరణ(EC) అనుమతులు లేవు.దరఖాస్తులు పెండింగులో ఉ...
11/10/2021

ఐ. పంగిడి పరిసర ప్రాంతాల క్రషర్,క్వారీ యజమానులకు సూచన: అనేక క్వారీలకు పర్యావరణ(EC) అనుమతులు లేవు.దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి.క్రొత్త క్వారీలకు అనుమతులు రావడం లేదు.డెడ్ రెంట్,రాయల్టీస్,సీనరేజ్ రుసుములు విపరీతంగా పెరిగాయి.తీరా క్వారీ త్రవ్విన తరువాత నాణ్యత లేని (బొగ్గు) రాయి పడడం.కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన క్వారీ యజమానుల పరిస్థితి."మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు"మరో ప్రక్క మైనింగ్ అధికారుల వేధింపులు,లంచాలు. క్రషర్ యజమానులకు కరెంట్ బిల్లులు. HT క్రషర్ ఆడినా ఆడకపోయినా లక్ష రూపాయల మినిమం బిల్లులు. కరోన తో బాటు కుత్రిమ ఇసుక కొరత వలన మెటలుకు (కంకర) బేరాలు లేకపోవటం తో క్వారీలు లేని క్రషర్ యజమానులు దివాళా అంచుకు వెళుతున్నారు. క్వారీ యజమానులు వద్ద మైనింగ్ పర్మిట్లు ఉండవు. పర్మిట్లు లేకుండా క్రషర్లు ఆడితే నిల్వల పై మైనింగ్ అధికారులు అరవై వేలు నుండి లక్ష రూపాయలవరకు వాయింపు. అందులో సగానికే బిల్. బొగ్గుతో కలగలిపిన స్పాల్స్. కంపిటీషన్ రేట్లు.కరెంట్ బిల్ కోసమైనా క్రషర్లు ఆడే పరిస్థితి. ఇవీ క్రషర్ యజమానుల పాట్లు. EC లు లేకపోతే పెర్మిట్లు రావు.పెర్మిట్లు తీసుకున్న వాటిని కొనుగోలు చేసేవారుండరు.రాష్ట్ర, కేంద్ర పనులు చేయు కాంట్రాక్టర్లు సీనరీజ్ ఎమౌంట్ బిల్ లలో కట్ చేయించుకుంటున్నారు. వారికి పెర్మిట్లు అక్కరలేదు. మైనింగ్ అధికారుల వలన సమస్య వస్తే క్వారీ క్రషర్ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా తలా కొంత అమౌంట్ పొగుచేసి వారికి లంచాలు ఇచ్చి తాత్కాలికము గా ఆ సమస్యను వాయిదా వేయిస్తున్నారు. కానీ క్వారీ క్రషర్ యజమానుల అసోసియేషన్ ఆలోచించి, శాశ్వత పరిస్కారా మార్గాలు అన్వేషించాలని కోరుతున్నాను.ప్రభుత్వానికి,అధికారం లో గల ప్రజాప్రతినిధులు ఏఅవుసరం వచ్చినా మిమ్మల్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నారుగా.మీరెందుకు వారిని నిలదీయరు. ఇతర రాష్ట్రాలతో క్వారీయింగ్ చార్జెస్,విధానాలు కూడా కంపేర్ చేయండి. "లంచం తీసుకోవడం ఎంత నేరమో... లంచం ఇవ్వడం కూడా అంతే నేరం".ఇప్పటి వరకు లంచాలు తిని కోట్లు వెనకేసుకున్న మైనింగ్ అధికారులతో మాట్లాడి వేధింపులు ఆపాలని డిమాండ్ చెయ్యండి. సంప్రదింపులతో సాధించండి. మన మినిస్టర్ గారి దృష్టికి మైనింగ్ అధికారుల లంచాలు భాగోతం వివరించండి... మీకు సలహా చెప్పేతంతటి వ్యాపార పరిజ్ఞానం లేకున్నా అనుభవంతో ఇస్తున్న సలహా వలన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నా. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన మీరు మైనింగ్ అధికారులకు లంచాలు ఇస్తూ,ఎందుకు మాన్స్శాంతి లేకుండా దొంగల్లా బ్రతకాలి? అందరూ ఒకే మాటపై మైనింగ్ పెర్మిట్లు తీసుకోండి.పెర్మిట్లు లేకుండా సరుకు అమ్మకండి."తాగిన వాడే కడతాడు... తాటి పన్ను" అన్నట్లు పర్మిట్ రేటు తో కలిపి సరుకు అమ్మండి.మీ మార్జిన్స్ యధాతధం. అసోసియేషన్ లో తీర్మానం చేయండి.అందరూ ఒకే మాటపై వుండి రాయల్ గా వ్యాపారం చెయ్యండి.మీరు బాగుంటారు మీ సరుకు రవాణా చేస్తున్న లారీ యజమానులు బ్రతుకుతారు. పంచాయతీకి ఆదాయం వస్తుంది. "జన్మభూమి రుణం తీరుస్తున్నట్లు" ఏ గ్రామం లో వ్యాపారం చేస్తున్నారో ఆగ్రామ అభివృద్ధికి సీనరేజ్ ఆదాయం లభిస్తుంది.మీ వలన మీ వ్యాపారం పై ఆధారపడి వేలాది మా గ్రామ ప్రజలు ఉపాధి పొందుతున్నారు. మీరు బాగుండాలి.అందులో మీముండాలని మనఃపూర్వకం గా కోరుకుంటూ...మీ పి.కె.రంగా రావు.

ఐ. పంగిడి పరిసర లారీ యజమానులకు నమస్కారాలతో...భారత శిక్షాస్మృతి ప్రకారం "వందమంది నేరస్థులు శిక్ష నుండి  తప్పించుకున్నా పర...
10/10/2021

ఐ. పంగిడి పరిసర లారీ యజమానులకు నమస్కారాలతో...భారత శిక్షాస్మృతి ప్రకారం "వందమంది నేరస్థులు శిక్ష నుండి తప్పించుకున్నా పర్వాలేదు.కాని ఒక నిరపరాధి శిక్షింపబడరాదు". చట్ట విరుద్ధంగా,సీనరేజ్ రుసుము ,ఆదాయ,వాణిజ్య ఫీజులు కట్టకుండా ; మైనింగ్ అనుమతులు,పర్యావరణ అనుమతులు,లైసెన్సులు లేకుండా సరుకును అమ్ముతున్న క్వారీ,క్రషర్ యజమానులను వదిలిపెట్టి, నిరపరాధులైన లారీ యజమానులపై కేసులు పెట్టి జరిమానాలు వేస్తుంటే మైనింగ్ అధికారులను ప్రశ్నించకపోవడం మన చేతకానితనం. దొంగ సారా అమ్మేవాడ్ని పట్టుకుని ఆ సారా ఎవరు అమ్మేరో?ఎక్కడ తయారు చేస్తున్నారో ? కనుక్కుని ఎక్సయిజ్ అధికారులు శిక్షిస్తున్నారు. దొంగ సొత్తు దొరికితే ఆసొత్తు ఎక్కడినుండి దోచుకుని, ఎవరికి అమ్మేరో? కనుక్కుని వారందరిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. కానీ ఇక్కడ మైనింగ్ అధికారులు పర్మిట్స్ లేకుండా సరుకు అమ్మేవార్ని వదలిపెట్టి, రవాణా చేసే లారీ యజమానులను బలిపశువులు చేస్తున్నారు. క్వారీలు,క్రషర్లు కు అనుమతులు ఇచ్చేది మైనింగ్ అధికారులే. ఎవరికి అనుమతులున్నాయి. ఎవరికి లైసెన్సులు లేవో వారికి తెలుసు. మైనింగ్ అనుమతులు పర్మిట్స్ లేకుండా బహిరంగంగా వ్యాపారం చేస్తున్నా పట్టించుకోకుండా, క్వారీలు,క్రషర్లు యజమానులను జలగలు లా పిండి లక్షలాది రూపాయలు నెలవారీ మామూళ్లు వసూళ్లు చేస్తున్న మైనింగ్ అధికారులకు లారీ యజమానులపై కేసులు పెట్టె నైతిక హక్కు లేదు. క్వారీలు ఎవరు త్రవ్విస్తున్నారో ఎంత మట్టి,సట్టు, రాయి త్రవ్వి తీస్తున్నారో క్వారీ గోతులు కొలిస్తే తెలుస్తుంది. ఎంత మెటలు క్రషింగ్ చేసారో? క్రషర్లు కరెంట్ బిల్లులు చూస్తే తెలుస్తుంది. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ వ్యాపారంపై మైనింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే కోట్లాది రూపాయలు లంచాలు రూపంలో వసూలు చేస్తున్నారు కనుక. ప్రజా ధనం తో జీతాలు తీసుకుంటూ, లంచాలు పోగేసుకుంటానికి మాత్రమే వీరు పనిచేస్తున్నారు. ఇటీవల క్రషర్ యజమాని నుండి రూ.60,000/- వసూలు చేసి, రూ.30000/- కు రసీదు ఇచ్చారని ప్రెస్సులో వస్తే దానిపై విచారణ లేదు. చర్యలు లేవు. క్రింద నుండి పై అధికారుల వరకు లంచాలలో వాటాలు తీసుకుంటున్నారు కనుక. ఇప్పుడు అదే అవినీతికి పాల్పడిన అధికారి కక్ష కట్టి క్వారీ బాటల్లో దారి కాసి, లారీ లకు కేసులు వ్రాస్తున్నారు. వీరికి భయం,భక్తి లేదు.రాదు. వీరికి లంచాలు ఇవ్వలేక,అనునిత్యం దొంగల్లా బ్రతకలేక నిజాయితీగా పర్మిట్లు తీసుకుని రాయల్ గా వ్యాపారం చేద్దామన్న క్వారీ,క్రషర్ యజమానులకు ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల పెర్మిట్లు,పర్మిషన్స్ రావటంలేదు. బహిరంగంగా లంచాలు వసూలు చేస్తున్న మైనింగ్ అధికారులను నిలదీయాల్సిన సమయం వచ్చింది. మన ఓట్లతో నెగ్గి అధికారం అనుభవిస్తున్న మన మినిస్టర్ గార్కి లారీ యజమానులంతా కలిసి వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలి. జిల్లా కలెక్టర్ గారి వద్దకు వెళ్లి, లంచగొందులయిన మైనింగ్ అధికారుల భాగోతం వివరించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరాలి. అప్పుడే దీనికి పరిష్కారం లభిస్తుంది... ఆఖరిగా చిన్న "ట్విస్ట్". ... వసూలు అయిన సీనరేజ్ ఆదాయం లో గ్రామపంచాయతికి 25%; మండల పరిషత్ కి 50%; జిల్లా పరిషత్ కి 25% చెందుతుంది. ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా రాదు. కానీ వసూలు చేసేది మైనింగ్ డిపార్టుమెంట్. నష్టపోయేది పంచాయతీలు,మండల,జిల్లా పరిషత్ లు. అంటే గ్రామీణ ప్రజలు.అంటే మనమే.మన పంగిడి, దేచర్ల గ్రామాల క్వారీ ల నుండి ఉత్పత్తి కాబడే సట్టు,మట్టి,నల్లరాయి లపై ప్రతి ఏటా సుమారు 6 కోట్లు సీనరేజ్ వస్తుంది. అందులో మన పంచాయతీకి ఒకటిన్నర కోట్లు, మండలానికి మూడు కోట్లు, జిల్లా పరిషత్ కు ఒకటిన్నర కోట్లు ఆదాయం వస్తుంది. కనుక మన పంచాయతీలో అధికారంలో గల వై.యస్.ఆర్. పార్టీ పాలకవర్గం లారీ యజమానులు పోరాటానికి ముందుండి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను...నిత్యం ప్రజా సంక్షేమం కోరుకునే... మీ పి.కె.రంగారావు.

ఐ. పంగిడి పరిసరాల క్వారీ లారీ యజమానులకు విజ్నప్తి: మైనింగ్ అధికారులు,రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారుల వేధింపులకు మీరంతా అనేక...
08/10/2021

ఐ. పంగిడి పరిసరాల క్వారీ లారీ యజమానులకు విజ్నప్తి: మైనింగ్ అధికారులు,రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారుల వేధింపులకు మీరంతా అనేక సమత్సరాలుగా బలవుతున్నారు.పర్మిట్ లేదని మైనింగ్ అధికారులు,ఓవర్ లోడ్ అని ట్రాన్స్పోర్ట్ అధికారులు వేలకు వేలు లంచాలు మేస్తున్నారు. లంచం ఇవ్వకపోతే కేసులు వ్రాస్తున్నారు. నెలవారీ మామూళ్లు గుంజుకుంటున్నారు. దీనికి కొంతమంది మీలోగల లారీ యజమానులు దళారీలుగా,ఇంఫార్మర్లుగా పనిచేస్తూ వారి స్వార్ధ ప్రయోజనాలకోసం అధికారులకు సహకరిస్తున్నారు. వారెవరో మీకు అందరికి తెలుసు.వారు మిమ్ముల్ని ఐకమత్యం గా ఉండనీయరు. జరుగుతున్న విషయాలను అధికారులకు లీక్ చేస్తుంటారు. ముందుగా వారిని బయటకు లాగండి. తర్వాత మీ బాధలు తీరే మార్గాలు ఆలోచిద్దాం.మైనింగ్,ట్రాన్స్పోర్ట్ అధికారులు వారికి మామూళ్ళిచే లారీలు కు కేసులు వ్రాయకుండా మన కళ్లెదురుగా వదిలి, మిగిలిన లారీలు కు కేసులు వ్రాస్తుంటే ఎవరూ మాట్లాడం లేదు. కేసులు వ్రాయకుండా రికార్డ్స్ పట్టుకెళ్లి, వేలాది రూపాయలు లంచాలు తీసుకుంటున్నా వాళ్ళని పట్టించే వాళ్ళు లేరు.మీరు తప్పు చేయడం లేదు.బ్రతుకుతెరువు కోసం లారిలు త్రిప్పుతున్నారు. నిత్యం భయపడుతూ లారీలను త్రిప్పుతున్నారు. క్వారీ,ఓనర్లు పెర్మిట్లు లేకుండా వ్యాపారం చేస్తుంటే పట్టించుకోని మైనింగ్ అధికారులు లారీలను కేసులు రాయడం తో పాటు లారీ లో గలా మెటీరియల్ అమ్మిన క్రషర్,క్వారీ యజమానులపై కూడా కేసులు ఎందుకు పెట్టరు? ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి,మన ఓట్లతో అధికారం అనుభవిస్తున్న ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి వారిపై వత్తిడి చేస్తే తప్పకుండా మీ బాధలు తీరుతాయి.ముఖ్యం గా నేను చెప్పేది ఒక్కటే.మీతోనే కలసి ఉండి మీకు ద్రోహం చేస్తున్న వారిని బయటకు లాగి,మీరంతా ఐ కమత్యంగా ఉంటే ఏదయినా ప్రజాస్వామ్యయుతంగా సాధించవచ్చు.ఆలోచించండి.మీరంతా బాగుండాలని మనః పూర్వకంగా కోరుకునే....మీ పి. కె.రంగా రావు

26/07/2021

పంగిడి కి కొవ్వూరు మునిసిపాలిటీ చెత్త వేసే ప్రొజెక్టు

కొవ్వూరు కేమో గోదావరి వాటర్ ప్రోజెక్టు

(9T PRIME NEWS స్క్రోలింగ్) అమరావతి : సచివాలయం సిబ్బంది, వలంటీర్ల కు మొక్కల బాధ్యత  అప్పగించకుండా, అధికారాలు లేని సర్పంచ...
21/07/2021

(9T PRIME NEWS స్క్రోలింగ్) అమరావతి : సచివాలయం సిబ్బంది, వలంటీర్ల కు మొక్కల బాధ్యత అప్పగించకుండా, అధికారాలు లేని సర్పంచ్ లను బలిపశువులు చేయడం న్యాయం కాదు పెద్దిరెడ్డి గారూ...ex MPP P.K రంగారావు

16/07/2021
https://youtu.be/NI6BF_jOSTU
10/07/2021

https://youtu.be/NI6BF_jOSTU

కొవ్వూరు డంపింగ్ యార్డ్ స్థలం పై వివాదం | Special Story On Dumping Yard Controversy In Kovvuru | ABNFor All Political and Latest News Updates Subscribe to ...

 ంగిడి_ప్రజలకు_విజ్ఞప్తి: మన గ్రామానికి సమీపంలో గవర్నమెంట్ క్వారీ గా పిలువబడే జిల్లా పరిషత్ కు చెందిన 7 ఎకరాల 37 సెంట్ల ...
08/07/2021

ంగిడి_ప్రజలకు_విజ్ఞప్తి:

మన గ్రామానికి సమీపంలో గవర్నమెంట్ క్వారీ గా పిలువబడే జిల్లా పరిషత్ కు చెందిన 7 ఎకరాల 37 సెంట్ల భూమిని కొవ్వూరు మున్సిపాలిటీ కి చెత్త వేసుకోవటానికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. జిల్లా పరిషత్ కు చైర్మన్ లేనందున, మినిష్టర్ వనిత గారి పట్టుదల తో కలెక్టర్ గారు పంగిడి ప్రజల నెత్తిమీద కొవ్వూరు మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ ను పెట్టినట్లు ఆంధ్రజ్యోతి కధనం. ఈ డంపింగ్ యార్డ్ దుర్వాసన పంగిడి ప్రజల అనారోగ్యానికి కారణమవుతుంది.ఈగలు, దోమలు వృద్ధిచెందుతాయి.ఆ చుట్టుప్రక్కల భూముల రేట్లు పడిపోతాయి. దుర్వాసన వలన చుట్టుప్రక్కల గల స్టోన్ క్రషర్లు, తార్ ప్లాంట్లు,క్వారీలు మూతపడతాయి. వర్షా కాలంలో చుట్టూ ఉన్న లోతట్టు పొలాల్లో మురికినీరు చేరి పంటలు దెబ్బతింటాయి. గతంలో ఈ భూమిని గ్రామ పంచాయతీ భవిష్యత్ అవుసరాలికి ఇవ్వాలని కోరడం జరిగింది. కొవ్వూరు మున్సిపాలిటీ డంపింగ్ యార్డుకి భూమి సేకరించడానికి కోట్లు ఖర్చు అవుతుందని, పంగిడిలో రెండున్నర కోట్ల భూమి ఉచితంగా వచిందనుకుంటున్నారు. కాని 15 కిలోమీటర్లు చెత్త రవాణాకు ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించడం లేదు. జీవిత కాలం ఏళ్ల తరబడి రవాణా ఖర్చు లెక్కిస్తే, కొవ్వూరుకు సమీపంలో డంపింగ్ యార్డుకి భూమి కొనుగోలు చేయుట ఉత్తమం. ప్రజాధనం వృధా కాకుండా ఉంటుంది. అధికారులు,ప్రజా ప్రతినిధులు ఆలోచించాలి. దీని వెనుక ఎవరైనా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ ఉన్నరే మొనని అనుమానం కలుగుతోంది. పంగిడిలో కొవ్వూరు మున్సిపాలిటీ చెత్త, చెదారాన్ని వేయడానికి పంగిడి ప్రజలు అంగీకరిస్తే, ఈ డంపింగ్ యార్డ్ మనపాలిట భస్మాసుర హస్తమవుతుంది.మున్సిపాలిటీ అధికారులు డంపింగ్ యార్డ్ వలన మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని నమ్మబలుకుతారు. నమ్మితే మనం తీసుకున్న గోతిలో మనమే పడతాం. ప్రజలు ఎన్నుకున్న పంచాయతీ వారే ఈ ఉపద్రవం నుండి పంగిడి ప్రజలను కాపాడాలి...పంగిడి ప్రజా శ్రేయోభిలాషి.

Address

Kovvur
534342

Website

Alerts

Be the first to know and let us send you an email when Pangidi Development Followers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share