18/01/2026
దగదర్తి గ్రామ వెలుపోడు రోడ్డు సెంటర్ వద్ద ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద ఈరోజు దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాలేపాటి రవీంద్ర నాయుడు, కంచర్ల సునీల్ ఆదేశానుసారం, దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాలేపాటి లోకేష్, సీనియర్ టిడిపి నేత మాలేపాటి సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో యుగపురుషుడు సీనియర్ ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు
ముందుగా మాలేపాటి స్వగృహం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి, మాలేపాటి వంశభిమానులు అత్యధిక సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించి, దగదర్తిలోని మసీదు సెంటర్ కు చేరుకొని తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. అక్కడి నుండి వెలుపోడు రోడ్డు సెంటర్ వరకు నడిచి వెళ్లి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి, భారీగా బాణాసంచా పేల్చి, ఘనమైన నివాళులు అర్పించారు. జోహార్ ఎన్టీఆర్.. అమర్ రహే ఎన్టీఆర్.. అంటూ నినాదాలతో వెలిపోడు రోడ్డు సెంటర్ హోరెత్తింది
ఈ సందర్భంగా మాలేపాటి లోకేష్ గారు మాట్లాడుతూ.. కారణజన్ము డు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి, ‘అన్న’ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా దగదర్తి మండలం నుండి ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన యుగపురుషునికి ఘనమైన నివాళులు అర్పిస్తూ.. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శం అన్నారు. ఆయన వేసిన బాట అనుసరణీయం. వారిని ఆదర్శంగా తీసుకుంటూ వారి ఆశయాలను మనమందరం కొనసాగించాలని తెలియజేశారు.