karampudi

karampudi Palnadu Information , Mix of politics and useful information

Telugu Desam Party (TDP)Julakanti Brahmananda Reddy Sri Krishna Devarayalu Lavu
31/05/2026

Telugu Desam Party (TDP)

Julakanti Brahmananda Reddy Sri Krishna Devarayalu Lavu

22/05/2026

రెండున్నర గంటల్లో హైదరాబాద్.. రెండు గంటల్లో విజయవాడ

• పల్నాడు ప్రజలకు 'ఇంటర్‌సిటీ' ప్రయాణం.. ఇక సురక్షితం, సుఖమయం!

• రైల్వే శాఖను ఒప్పించి పల్నాడు వాసుల కష్టాలు తీర్చిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు

పల్నాడు ప్రాంత ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థుల దశాబ్దాల నాటి రవాణా కష్టాలకు ఎట్టకేలకు తెరపడింది. లింగంపల్లి - విజయవాడ మధ్య నడిచే ప్రతిష్టాత్మక *ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ఎంప్లాయీస్ ట్రైన్: 12795/12796)* రైలుకు పిడుగురాళ్ల స్టేషన్‌లో స్టాపేజ్ మంజూరు చేస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంత రవాణా రంగంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. కేవలం రెండున్నర గంటల్లో హైదరాబాద్, గంటన్నర నుండి రెండు గంటల్లో గుంటూరు, విజయవాడ నగరాలకు చేరుకునేలా సాగబోయే ఈ ప్రయాణం పల్నాడు ప్రజలకు మరింత మెరుగైన, లాభదాయకమైన ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

కళ్లముందే రైలు… కానీ ఎక్కలేని పరిస్థితి!

విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ అనేది ఈ రూట్‌లో అత్యంత వేగంగా వెళ్లే సూపర్ ఫాస్ట్ రైలు. అయితే, గతంలో ఈ రైలుకు ఉన్న స్టాపేజీల వివరాలు చూస్తే పల్నాడు ప్రజల దుస్థితి అర్థమవుతుంది. ఈ రైలు విజయవాడ జంక్షన్, మంగళగిరి, గుంటూరు జంక్షన్ లలో ఆగిన తర్వాత నేరుగా నల్గొండలోనే ఆగాలి. మధ్యలో గుంటూరు, నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అత్యంత కీలకమైన, వ్యాపార పరంగా పెద్ద కేంద్రమైన పిడుగురాళ్లను దాటుకుంటూ ఈ రైలు వెళ్లిపోయేది.

పల్నాడు నడిబొడ్డున ఉన్న పిడుగురాళ్ల మీదుగా రైలు కూతపెట్టుకుంటూ పోతుంటే.. స్థానిక ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు మాత్రం ఆ రైలును చూస్తూ నిట్టూర్చడం తప్ప ఎక్కే అవకాశం ఉండేది కాదు. ముఖ్యంగా హైదరాబాద్ మరియు విజయవాడ నగరాలకు నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులు, ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రధాన సమయాల్లో రైలు ప్రయాణం అందుబాటులో లేకపోవడంతో ఎక్కువ ఇబ్బంది పడేవారు.

రైలు లేక ప్రజల పడిన కష్టాలు

పిడుగురాళ్ల చుట్టుపక్కల ప్రజలు హైదరాబాద్ లేదా విజయవాడ వెళ్లాలంటే ముందుగా గుంటూరు లేదా నల్గొండ వరకు బస్సుల్లో వెళ్లి అక్కడి నుంచి రైలు ఎక్కాల్సిన పరిస్థితి ఉండేది. దీనివల్ల సమయం వృథా, అదనపు ఖర్చు, ప్రయాణ అలసట.

రాత్రి వేళల్లో భద్రత సమస్యలు.. మహిళలు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు. ఇవికాక ప్రైవేట్ బస్సుల అధిక చార్జీలు ప్రజలను మరింత ఇబ్బంది పెట్టేవి. పండుగల సమయంలో అయితే టికెట్ ధరలు అమాంతం పెరిగి ప్రజలపై ఆర్థిక భారం పడేది.

ప్రజల సమస్యను సవాల్‌గా తీసుకున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు..

పల్నాడు ప్రాంత ప్రజల ఈ దశాబ్దాల వేదన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి దృష్టికి వచ్చింది. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించే ఆయన, దీనిని ఒక సవాల్‌గా తీసుకున్నారు. రైల్వే బోర్డు ఉన్నతాధికారులతో పాటు, కేంద్ర రైల్వే మంత్రితో స్వయంగా నిరంతరం చర్చలు జరిపారు. పిడుగురాళ్లలో స్టాపేజ్ ఇవ్వడం వల్ల పల్నాడు ప్రాంత వాసులకు జరిగే మేలును, అక్కడ రవాణా అవసరాలను రైల్వే మంత్రికి బలంగా వివరించారు.

త్వరలోనే రైలు హాల్ట్!

పల్నాడు ప్రజల పక్షాన ఎంపీ గారు చేసిన నిరంతర పోరాటం, శ్రమ చివరకు ఫలించాయి. ఎట్టకేలకు రైల్వే శాఖ నుంచి పిడుగురాళ్ల స్టాపేజ్ కోసం ఆమోద ముద్ర లభించింది. ఆయన అలుపెరగని కృషి ఫలితంగా త్వరలోనే విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో ఆగనుంది.

ఇకపై సేఫ్ అండ్ కంఫర్టబుల్ జర్నీ!

ఇకపై ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ పిడుగురాళ్లలో ఆగనుండటంతో ప్రయాణికుల కష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోనున్నాయి.

*రెండున్నర గంటల్లోనే హైదరాబాద్:* పిడుగురాళ్ల నుండి హైదరాబాద్ (సికింద్రాబాద్/లింగంపల్లి) వైపు వెళ్లే ప్రయాణికులు కేవలం 2 గంటల 30 నిమిషాల్లోనే సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

*రెండు గంటల్లోనే విజయవాడ:* అటు గుంటూరు, విజయవాడ వైపు వెళ్లేవారు కేవలం 1:30 నుండి 2 గంటల లోపే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.

*సురక్షితమైన ప్రయాణం:* ఇకపై ప్రైవేట్ వాహనాల్లో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించే రోజులు త్వరలోనే చరిత్రలో కలిసి పోనున్నాయి. సూపర్ ఫాస్ట్ రైలులో ఎంతో లగ్జరీగా, సురక్షితంగా ఏ విధమైన అలసట లేకుండా ప్రయాణించవచ్చు. ఉద్యోగులు ఉదయాన్నే వెళ్లి, రాత్రికి క్షేమంగా ఇళ్లకు చేరుకునే అద్భుతమైన అవకాశం లభించింది.

రైలు సమయాలు(అంచనా)

• ట్రైన్ నెం. 12796 (లింగంపల్లి ➔ విజయవాడ): ప్రతిరోజూ ఉదయం 4:40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, సికింద్రాబాద్ మీదుగా ప్రయాణించి.. ఉదయం 8:09(అంచనా) గంటలకు పిడుగురాళ్ల స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుండి బయలుదేరి ఉదయం 10:35 గంటలకు విజయవాడ జంక్షన్ చేరుకుంటుంది.

• ట్రైన్ నెం. 12795 (విజయవాడ ➔ లింగంపల్లి): ప్రతిరోజూ సాయంత్రం 05:30 గంటలకు విజయవాడలో బయలుదేరి.. రాత్రి 07:04(అంచనా) గంటలకు పిడుగురాళ్ల స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుండి బయలుదేరి రాత్రి 11:35 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.

త్వరలోనే ఈ స్టాపేజ్ అధికారికంగా అమలులోకి వచ్చే తేదీని రైల్వే శాఖ ప్రకటించనుంది. ఈ సువర్ణ అవకాశాన్ని పల్నాడు జిల్లా ప్రయాణీకులు, ఉద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గౌరవ ఎంపీ గారు కోరారు.

*ప్రజల అవసరాలే మా ప్రాధాన్యం*

- ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.

17/05/2026

సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏపీకి తీసుకువచ్చిన పెట్టుబడులతో ఓవైపు అభివృద్ధి వికేంద్రీకరణ, మరోవైపు 'made in Andhra Pradesh ..made for the world' లక్ష్యం సాధ్యమవుతుంది.



17/05/2026

ఒకే ఒక్క నెల.. సైలెంట్ స్కెచ్.. ఏపీ 'డిఫెన్స్' హైజాక్!

​పొరుగు రాష్ట్రాల పొలిటికల్ రాడార్లకు దొరక్కుండా... శత్రుదేశాల రాడార్లకు సైతం దొరకని AMCA స్టీల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ ఎలా దక్కించుకుందో తెలిపే మైండ్ బ్లోయింగ్ ఇన్‌సైడ్ స్టోరీ!

​ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దిగితే ప్లానింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పడానికి పుట్టపర్తి AMCA (Advanced Medium Combat Aircraft) ప్రాజెక్ట్ ఒక క్లాసిక్ ఉదాహరణ.

​తమిళనాడు ప్రభుత్వం మూడేళ్లుగా కష్టపడి, తమ హోసూర్‌కు ఈ ప్రాజెక్ట్ వస్తుందని ధీమాగా ఉన్న వేళ... ఏపీ కేవలం 30 రోజుల్లో ఈ ₹15,803 కోట్ల మెగా ప్రాజెక్ట్‌ను సైలెంట్‌గా లాగేసుకుంది.

​రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్"కు నిదర్శనంగా నిలిచిన ఈ "రహస్య వ్యూహం, రాకెట్ స్పీడ్" ఇన్‌సైడ్ టైమ్‌లైన్ ఇది:

​తమిళనాడు మూడేళ్ల శ్రమ.. హోసూర్ ప్లాన్!

​ఐదో తరం అధునాతన యుద్ధ విమానాల (AMCA) తయారీ కేంద్రాన్ని పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన హోసూర్ వద్ద ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం మూడేళ్లుగా కేంద్ర రక్షణ శాఖను కోరుతోంది.

​తమిళనాడు ఆఫర్: హోసూర్‌లో విలువైన వందల ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వడానికి సిద్ధపడింది.

​భౌగోళిక అనుకూలత: ఈ హోసూర్, డిజైన్ నోడల్ ఏజెన్సీ అయిన బెంగళూరు 'ADA' (Aeronautical Development Agency) కి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అన్నీ అనుకూలంగా ఉన్నందున ప్రాజెక్ట్ తమకే వస్తుందని తమిళనాడు గట్టిగా నమ్మింది.

​ఏప్రిల్ 2026: నెల రోజుల్లోనే కథ మొత్తం రివర్స్! (The 21-Day Jet Speed)

​విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఎలాగైనా ఏపీకి, ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమకు రావాలని పట్టుబట్టారు. విషయం బయటకు పొక్కితే తమిళనాడు అలర్ట్ అవుతుందని భావించి, అత్యంత గోప్యత పాటించారు. ఏప్రిల్ నెలలో ఏపీ ప్రభుత్వం కనబరిచిన వేగం ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది:

​ఏప్రిల్ 9: కేంద్ర రక్షణ శాఖతో ప్రాథమిక చర్చలు.
​ఏప్రిల్ 20: రక్షణ శాఖ నుండి అధికారిక ప్రతిపాదనలు కోరిన ఏపీ.
​ఏప్రిల్ 24: కేవలం 4 రోజుల్లోనే కావాల్సిన పూర్తి నివేదికలు, ప్రతిపాదనలను రక్షణ శాఖకు పంపేసింది.
​ఏప్రిల్ 28: కేంద్ర రక్షణ శాఖ నుండి ఏపీ ప్రతిపాదనలకు అధికారిక అంగీకారం.
​ఏప్రిల్ 29: కేంద్ర బృందం చేత పుట్టపర్తి స్థల పరిశీలన (Site Inspection) పూర్తి.
​ఏప్రిల్ 30: ఏపీ క్యాబినెట్ ప్రత్యేకంగా సమావేశమై ఈ ప్రాజెక్ట్‌కు తక్షణ ఆమోదం.

​నోట్: ఏపీ ప్రభుత్వం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ కింద ఎన్నడూ లేని విధంగా స్పెషల్ జీవోలను కేవలం 48 గంటల్లో పాస్ చేసింది. సింగిల్ వికోండి క్లియరెన్స్ ద్వారా నీటి సరఫరా, విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం, రన్‌వే విస్తరణకు సంబంధించిన అనుమతి పత్రాలన్నింటినీ రక్షణ మంత్రిత్వ శాఖ టేబుల్ పైకి ఒకే నెలలో చేర్చారు.

​ఏప్రిల్ 9న మొదలైన ప్రక్రియ ఏప్రిల్ 30 కల్లా.. అంటే కేవలం 21 రోజుల్లోనే పేపర్ వర్క్ నుండి క్యాబినెట్ అప్రూవల్ దాకా జెట్ స్పీడ్‌తో ముగిసిపోయింది! ఆ తర్వాత మే 15న రక్షణ మంత్రి రాజ์నాథ్ సింగ్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిగిపోయింది.

​పుట్టపర్తి ఎలా ప్లస్ అయింది?

​బెంగళూరుకు సామీప్యత: బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఉండటం శాస్త్రవేత్తల రాకపోకలకు ప్లస్ అయింది.
​ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: జాతీయ రహదారి, రైల్వే స్టేషన్ వంటి మౌలిక వసతులు సిద్ధంగా ఉండటం కలిసిసొచ్చింది.

​వ్యూహాత్మక ప్రెజెంటేషన్: ఈ భౌగోళిక ప్రాధాన్యతలను రక్షణ శాఖ దృష్టిలో ఉంచి బాబు టీమ్ ప్రెజెంట్ చేసిన విధానానికి కేంద్రం ఫిదా అయిపోయింది.

​తమిళనాడు సోషల్ మీడియాలో 'పెదవి విరుపులు'

​ఈ వార్త బయటకు రావడంతో తమిళనాడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

​"మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ అస్థిర పరిస్థితులు, వేగం లేని నిర్ణయాల వల్లే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేజారిపోయింది. ప్రాజెక్టులను ఎలా లాక్కోవాలో ఏపీ సీఎం చంద్రబాబును చూసి మన నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి" అని తమిళ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​మరోవైపు మీమ్స్ క్రియేటర్లు: "కష్టపడి డిజైన్ చేసింది బెంగళూరు.. వసతులున్నది తమిళనాడులో.. కానీ లక్ కొట్టేసింది మాత్రం ఆంధ్రప్రదేశ్" అంటూ సెటైరికల్ మీమ్స్‌తో హల్చల్ చేస్తున్నారు.

విమర్శలు తాత్కాలికం.. అభివృద్ధి శాశ్వతం!

పొరుగు రాష్ట్రంలో చేసిన రెండు రోజుల ఎన్నికల ప్రచారంపై విమర్శలు చేసిన వారికి.. పుట్టపర్తి AMCA ప్రాజెక్ట్, కర్నూలు 'డ్రోన్ సిటీ', అనకాపల్లి 'నేవల్ సిస్టమ్స్' రూపంలో లభించిన ₹15,803 కోట్ల సమాధానం ఇది. తమిళనాడు తన పారిశ్రామిక బలాన్ని నమ్ముకుంటే, ఏపీ తన అల్ట్రా-స్పీడ్ బ్యూరోక్రసీ మరియు పొలిటికల్ నెట్‌వర్క్‌తో గేమ్ చేంజ్ చేసింది. ఇదే "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్"! రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నట్లు.. నిర్ణయాలు తీసుకోవడంలో AP అంటే ఆంధ్రప్రదేశ్ కాదు.. అడ్వాన్స్‌డ్ ప్రదేశ్! #చాకిరేవు

Wow
16/05/2026

Wow

సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశానికి శక్తి కేంద్రంగా సంపూర్ణమైంది. దేశ అంతరిక్ష, క్షిపణి, రక్షణ, నౌకాదళ రంగాలకు ఏపీ కేంద్రమైంది. అంతేకాదు పుట్టపర్తి నుంచి ప్రపంచంలోని ప్రతి మూలకు డ్రోన్‌ సరఫరా చేసే క్షణం రాబోతోందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు.





15/05/2026
Wow !!!! Nara Chandrababu Naidu Nara Lokesh Pawan Kalyan
05/05/2026

Wow !!!!

Nara Chandrababu Naidu Nara Lokesh Pawan Kalyan

Welcome Google to the state of Andhra Pradesh Greater Visakhapatnam Municipal Corporation - Smart CityNara Chandrababu N...
28/04/2026

Welcome Google to the state of Andhra Pradesh

Greater Visakhapatnam Municipal Corporation - Smart City

Nara Chandrababu Naidu Nara Lokesh

👍✅🙂😎🙏

Palnadu Buses Palnadu District @
22/04/2026


Palnadu Buses Palnadu District @

మాచర్లలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభం ప్రాంతీయ విద్యాభివృద్ధికి కీలక మైలురాయి.

19/04/2026

కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన ఏడాది వయసున్న పునర్విక అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ అనే వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి ప్రాణాలు కాపాడాలంటే ఏకైక మార్గం రూ.16 కోట్ల ఖరీదైన ఇంజక్షన్. తల్లిదండ్రులు దాతల సాయం కోరడంతో రూ.10కోట్లు సమకూరాయి. ఆ సమయంలో విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ మిగిలిన 6కోట్ల సంగతి తనకు వదిలేయమన్నారు. ఆ క్షణం నుంచి అన్నివిధాలా ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అమెరికా నుంచి ఖరీదైన ఇంజెక్షన్ ను త్వరితగతిన హైదరాబాద్‌కు ర‌ప్పించే ప‌నిని త‌న సిబ్బంది ద్వారా నిరంత‌రం లోకేష్ గారు ప‌ర్య‌వేక్షించారు. ఈరోజు దగ్గరుండి మరీ పాపకు ఇంజక్షన్ ఇప్పించారు. పున‌ర్విక చికిత్సలో ఎలాంటి ఆలస్యం జరగకుండా మంత్రి లోకేష్ చేసిన కృషితో నిండు ప్రాణాలు నిలిచాయి. లోకేష్ చేసిన సాయాన్ని జీవింతాంతం గుర్తుపెట్టుకుంటామని పునర్విక తల్లిదండ్రులు భావోద్వేగంతో చెప్పారు.

Address

Thota Bazar
Karempudi
522614

Website

Alerts

Be the first to know and let us send you an email when karampudi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share