ITDP Kandukur

ITDP Kandukur జై తెలుగుదేశం

కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు డిజిటల్ అటెండెన్స్ మెగా సక్సెస్..
28/05/2026

కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు డిజిటల్ అటెండెన్స్ మెగా సక్సెస్..

కందుకూరులో డిజిటల్ మహానాడు || TDP Mahanadu 2026 || Kandukur || Telugu Studio News For more latest upda...

తారక రాముడికి ఘననివాళిదిగ్విజయంగా ముగిసిన మహానాడు MLA ఇంటూరి సారధ్యంలో సూపర్ సక్సెస్ 12 క్లస్టర్లలో పసుపు సైనికుల ప్రభంజ...
28/05/2026

తారక రాముడికి ఘననివాళి

దిగ్విజయంగా ముగిసిన మహానాడు

MLA ఇంటూరి సారధ్యంలో సూపర్ సక్సెస్

12 క్లస్టర్లలో పసుపు సైనికుల ప్రభంజనం

కార్యకర్తల హాజరు నమోదులో కందుకూరు రికార్డ్

రాష్ట్రస్థాయిలో... నెంబర్ 1 స్థానంలో క్లస్టర్ -6

నియోజకవర్గాల స్థాయిలో కందుకూరుకు 4వ స్థానం

ఎమ్మెల్యే నాగేశ్వరరావుకు అభినందనలు తెలియజేసిన చంద్రన్న

రెండోరోజు వేడుకల్లో పాల్గొన్న MP వేమిరెడ్డి గారు

రెండు రోజుల మహానాడు దిగ్విజయంగా ముగిసింది. పసుపు పండుగ నిర్వహణలో.... శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సారధ్యంలో కందుకూరు నియోజకవర్గం, రికార్డ్ సృష్టించింది. ప్రతిఫలంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీనుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. మహానాడును అద్భుతంగా నిర్వహించావంటూ నాగేశ్వరరావుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అభినందనలు తెలియజేయడం విశేషం. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

మొత్తం 12 క్లస్టర్ల పరిధిలో.... కందుకూరు పట్టణంలో 4, ఉలవపాడులో 3, గుడ్లూరులో 2, లింగసముద్రంలో ఒకచోట హైబ్రిడ్ విధానంలో మహానాడు వేడుకను రెండవ రోజు నిర్వహించారు. తొలిరోజు కంటే రెట్టింపు ఉత్సాహంతో, పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు కార్యక్రమాల్లో పాల్గొనగా.... పసుపు సైన్యం సందడితో కళ్యాణ మండపాలు కిక్కిరిసిపోయాయి. ప్రతి గ్రామం నుంచి వందలాదిమంది స్వచ్ఛందంగా తరలివచ్చి పార్టీపై అభిమానాన్ని చాటుకున్నారు. అన్నగారికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన 103వ జయంతి సందర్భంగా మదిలో స్మరించుకున్నారు.

ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, అన్ని క్లస్టర్ల వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొని, పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ముందుగా పట్టణంలోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నేతలతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత ప్రత్యేక వేదికల వద్ద అన్నగారికి నివాళులు అర్పించడంతోపాటు కేక్ కటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ.... వర్చువల్ విధానంలో నిర్వహించుకున్న మహానాడును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. స్వర్గీయ ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ నేత నారా లోకేష్ గురించి పదేపదే ప్రస్తావిస్తూ... రాష్ట్ర అభివృద్ధికి వారు చేసిన కృషిని వివరించారు. అలాగే కోట్ల మంది సుశిక్షితులైన సైన్యాన్ని తయారు చేయడమే కాకుండా, వారికి అన్ని విధాల అండగా నిలుస్తున్న లోకేష్ గారి నాయకత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని ఎమ్మెల్యే కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.

కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు బలంగా తయారవుతోందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 20 ఏళ్ల తర్వాత కందుకూరు చరిత్రను తిరగరాస్తూ సృష్టించిన ప్రభంజనంలో.... ప్రతి కార్యకర్త చెమట చుక్క ఉందని ఆయన గుర్తు చేశారు. వారందరి కష్టాన్ని, త్యాగాన్ని తాను జీవితాంతం మరిచిపోనని అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, కార్యకర్త సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. నాయకుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు పక్కనపెట్టి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఉలవపాడులో జరిగిన మహానాడులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పసుపు పండుగ మహానాడును చూస్తుంటే కడుపు నిండిపోతోందని, ఇంతమంది కార్యకర్తల ఆశీస్సులు ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇక తిరుగేలేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి పట్టుదల, ముందుచూపుతో రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతోందని అన్నారు.

*మహానాడు నిర్వహణలో కందుకూరు రికార్డు*

మహానాడుకు సంబంధించి కార్యకర్తల హాజరు నమోదులో కందుకూరు నియోజకవర్గం రికార్డ్ సృష్టించింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో, నాలుగవ స్థానంలో నిలిచింది. అలాగే కందుకూరు పట్టణంలోని 6 వ క్లస్టర్ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు పార్టీ పెద్దలు ప్రకటించారు. మహానాడు తొలి రోజున ఈ క్లస్టర్ నుంచి 2555 మంది, రెండవ రోజున 3763 మంది కార్యకర్తలు తమ హాజరు నమోదు చేసుకున్నారు. మొత్తంగా 6318 మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవడంతో రాష్ట్రస్థాయిలో రికార్డు సృష్టించినట్లు అయ్యింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఎమ్మెల్యే ను అభినందిస్తూ, మహానాడు ను అత్యద్భుతంగా నిర్వహించారని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు నియోజకవర్గ నేతలు కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆరవ క్లస్టర్ ఇంచార్జి చిలకపాటి మధును ఎమ్మెల్యే నాగేశ్వరరావు, పలువురు నేతలు ఘనంగా సత్కరించారు.

✌🏻 ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గ పరిశీలకురాలు మట్టం శ్రావణి రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీల అధ్యక్షులు పూరిమిట్ల గురునాథం, జనిగర్ల నాగరాజు, రాచగర్ల సుబ్బారావు, మాదాల లక్ష్మీనరసింహం, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, క్లస్టర్ ఇన్చార్జులు కాకుమాని హర్ష, ఘట్టమనేని లక్ష్మీనరసింహం, వంకాయలపాటి మాల్యాద్రి, వడ్డెళ్ళ రవిచంద్ర, చిలకపాటి మధు, గొంది నరసింగరావు, బొద్దులూరి కొండలరావు, చిత్తారు మల్లికార్జున, ఉమ్మనేని సుబ్బారావు, పోలుబోయిన శ్రీనివాసులు, బెల్లం కృష్ణమోహన్, వాసు, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, పార్టీ సీనియర్ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, చల్లా శ్రీనివాసరావు, కండ్రా మాల్యాద్రి, ఉప్పుటూరి శ్రీనివాసరావు, ఏపీఈడబ్ల్యూఐడి కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్ మున్నా, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు కల్లూరి శైలజ, నియోజకవర్గ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు పువ్వాడి మౌనిక, గ్రామ మరియు వార్డు అధ్యక్షులు, యూనిట్ ఇన్చార్జులు, అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

28/05/2026

మహానాడులో కార్యకర్తల రిజిస్ట్రేషన్ల అంశంలో కందుకూరు రికార్డ్....

కందుకూరు పట్టణంలో చిలకపాటి మధు క్లస్టర్ ఇంచార్జిగా ఉన్న క్లస్టర్ - 6 రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది.

అలాగే రాష్ట్రస్థాయిలో కందుకూరు నియోజక వర్గం 4వ స్థానంలో నిలిచింది.

మన గౌరవ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పట్ల.... కార్యకర్తల్లో ఉన్న అభిమానానికి గొప్ప నిదర్శనం.

చిలకపాటి మధు గారికి కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. ✌🏻🌻🌻🌻🌻

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా.... తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆయనకు  ఘనంగా నివాళులర్పించాయి.కందుకూ...
28/05/2026

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా.... తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆయనకు ఘనంగా నివాళులర్పించాయి.

కందుకూరు పట్టణంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి... ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి నేతలకు తినిపించారు.

కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు మట్టం శ్రావణి రెడ్డి, పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

కందుకూరు నియోజవర్గంలో క్లస్టర్ పరిధిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు..
27/05/2026

కందుకూరు నియోజవర్గంలో క్లస్టర్ పరిధిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు..

మహానాడు పండుగకు ఆహ్వానం🙏🏻🙏🏻 స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి* సందర్భంగా నిర్వహిస్తున్న *మహానాడు - 2026* కార్యక్...
26/05/2026

మహానాడు పండుగకు ఆహ్వానం🙏🏻🙏🏻

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి* సందర్భంగా నిర్వహిస్తున్న *మహానాడు - 2026* కార్యక్రమం, ఈసారి వర్చువల్ గా జరుగుతుంది. ఈనెల 27, 28 తేదీల్లో... మీ ప్రాంతంలో, మీకు దగ్గరలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కందుకూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారి సారధ్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇందుకోసం నియోజకవర్గంలోని 12 క్లస్టర్ల పరిధిలో క్రింద తెలిపిన వేదికల వద్ద బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో పాటు కార్యకర్తలకు అన్ని వసతులు కల్పిస్తున్నారు.
-------------------------------
వలేటివారిపాలెం మండలం

క్లస్టర్ 1 - వలేటివారిపాలెం (MM కొండయ్య గారి ఇంటి ఆవరణ, కందుకూరు రోడ్డు)

క్లస్టర్ 2 - పోకూరు(హైస్కూల్ ఎదురుగా)
--------------------------------
లింగసముద్రం మండలం

క్లస్టర్ 3 - లింగసముద్రం (వేముల అంజయ్య కళ్యాణమండపం)
------------------------------
కందుకూరు మండలం

క్లస్టర్ 4 - పలుకూరు(బ్రహ్మంగారి గుడి దగ్గర)

క్లస్టర్ 5 - మోపాడు(శివాలయం సమీపంలో)
-------------------------------------
కందుకూరు అర్బన్

క్లస్టర్ 6 - కందుకూరు పట్టణం(లక్ష్మీతిరుమల కళ్యాణ మండపం, పామూరు రోడ్డు)

క్లస్టర్ 7 - కందుకూరు పట్టణం (వెంగమాంబ కళ్యాణమండపం)
-----------------------------------
గుడ్లూరు మండలం

క్లస్టర్ 8 - గుడ్లూరు (గుండా ఆదిశేషయ్య, వరలక్ష్మమ్మ కళ్యాణ మండపం)

క్లస్టర్ 9 - గుడ్లూరు( గొల్ల కంటయ్య, లక్ష్మమ్మ గార్ల కళ్యాణ మండపం)
-------------------------------
ఉలవపాడు మండలం

క్లస్టర్ - 10, 11, 12

ఉలవపాడు - (భోగినేని చెంచురామానాయుడు కళ్యాణమండపం, వేరు వెంకటేశ్వర స్వామి గుడి దాటగానే, హైవే ప్రక్కన)

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అన్న గారి అభిమానులు తప్పక పాల్గొని వేడుకలలో పాలుపంచుకోవాలని ఆహ్వానిస్తున్నాము.

కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ

మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన MLA నాగేశ్వరరావు గారుతెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంత...
26/05/2026

మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన MLA నాగేశ్వరరావు గారు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా.... ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించబోతున్నారు. వేడుకలకు తరలివచ్చే నాయకులు, కార్యకర్తల కోసం నియోజకవర్గంలోని 12 క్లస్టర్ల పరిధిలో ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయా ప్రదేశాలను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు మంగళవారం పరిశీలించారు. పార్టీ పెద్దల సందేశాలు, తీర్మానాలు, ఇతర కార్యక్రమాలను వీక్షించేందుకు వీలుగా అన్నిచోట్లా బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని నేతలకు సూచించారు. అలాగే కార్యకర్తల సంరక్షణలో భాగంగా....ఎండ వేడిమిని తట్టుకునేలా వేదిక చుట్టూ కూలర్లు ఏర్పాటు చేయాలని, తాగునీరు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే గారు సూచించారు. ప్రతిచోటా మెడికల్ టీంను కూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

అలాగే భోజనాలు, ఇతర ఏర్పాట్లు గురించి పార్టీ ముఖ్యలతో ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు చర్చించారు. అన్ని గ్రామాల నుంచి యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చేలా చూడాలన్నారు. కందుకూరు పట్టణం, కందుకూరు మండలంలోని పలుకూరు, మోపాడు, గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో ఎమ్మెల్యే గారు పర్యటించారు.

నియోజకవర్గ పరిశీలకురాలు మట్టం శ్రావణి రెడ్డి, పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, గుడ్లూరు మండల అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, ఉలవపాడు మండల అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, క్లస్టర్ ఇన్చార్జిలు చిలకపాటి మధు, వడ్డెళ్ళ రవిచంద్ర, పోలుబోయిన శ్రీను, వాసు, కృష్ణమోహన్, ఉమ్మనేని సుబ్బారావు, చిత్తారు మల్లికార్జున, గొంది నరసింగరావు, బొద్ధులూరి కొండలరావు, యూనిట్ ఇన్చార్జిలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

25/05/2026

కృష్ణాపురం రైతుల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం

పొలాలకువెళ్లే దారిలో 40 లక్షలతో బ్రిడ్జినిర్మాణానికి శ్రీకారం

MLA ఇంటూరి చేతుల మీదుగా శంకుస్థాపన

నాగేశ్వరరావు కృషికి అన్నదాతల కృతజ్ఞతలు

ఉలవపాడు మండలం కృష్ణాపురం రైతుల కష్టాలు తీరబోతున్నాయి. ఎలికేరు చెక్ డ్యాం నుంచి చాగొల్లు చెరువుకు వెళ్లే కాలువపై కృష్ణాపురం పొలాల వద్ద బ్రిడ్జి పదేళ్ల క్రితం కూలిపోగా... దాని స్థానంలో 40 లక్షల నిధులతో కొత్తగా బ్రిడ్జి నిర్మించనున్నారు. ఆ పనులకు స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు సోమవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా రైతన్నలు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2015 లో బ్రిడ్జి శిథిలావస్థలో ఉన్నప్పుడే అప్పటి ఎమ్మెల్యేకు తాము తెలియజేశామని, ఊరంతా చందాలు వేసుకొని నిర్మించుకోవాలంటూ ఆయన వ్యంగంగా మాట్లాడారని రైతులు గుర్తు చేసుకున్నారు. బ్రిడ్జి గురించి కనీసం పట్టించుకోకపోతే, తామే తాత్కాలిక రిపేర్లు చేయించుకొని రాకపోకలు కొనసాగిస్తున్నామని తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ.... కృష్ణాపురం రైతుల భూములన్నీ ఇటువైపే ఉన్నాయని, బ్రిడ్జి కూలిపోవడంతో పంట ఉత్పత్తులు తెచ్చుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. సమస్య గురించి ఎన్నికలకు ముందు తన దృష్టికి రైతులు అనేకసార్లు తీసుకొచ్చారని చెప్పారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో, 40 లక్షల రూపాయలతో కొత్తగా బ్రిడ్జి నిర్మించబోతున్నట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు చెప్పారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ కాలువలు, వీధిలైట్లు, స్మశానాల అభివృద్ధి లాంటి కనీస వసతుల ఏర్పాటుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి బాటలో పయనిస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఏడుపదుల వయస్సులో ప్రజల కోసం పడుతున్న కష్టాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సకాలంలో నాణ్యతగా బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు.

కార్యక్రమంలో గ్రామ టిడిపి అధ్యక్షుడు చక్రవర్తుల విజయ్ కుమార్, నీటిపారుదల శాఖ జేఈ సీతారామయ్య, టీడీపీ నాయకులు మందాడి హనుమంతరావు, కొల్లి శేషయ్య, కోడిపల్లి పోతురాజు, మందాడి ప్రసాద్, నక్కా మస్తాన్, చౌడుబోయిన హరిబాబు, గణపతిరాజు చలపతి, జాజుల రవి, మల్లవరపు కోటిరెడ్డి, లక్కంరాజు వెంకట్రామరాజు, పోలుబోయిన శ్రీను, రాచగర్ల శివ, కూనం బ్రహ్మారెడ్డి, బండి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

25/05/2026

మిస్టర్ బుర్రా... రైతులపై ఏమిటీ దౌర్జన్యం..?

ఒక పార్టీ ఇన్చార్జిగా పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునే హక్కు మీకు ఉంది. వీలుంటే వ్యాపారులతో మాట్లాడి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేయవచ్చు కూడా.

కానీ ఈరోజు కందుకూరులోని 27వ నెంబర్ పొగాకు వేలంకేంద్రంలో, వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు... రైతులనే కాక యావత్ కందుకూరు నియోజకవర్గ ప్రజలను నివ్వెర పోయేలా చేసింది. రప్పా రప్పా టైపులో, వేలం కేంద్రంలోకి వచ్చీరాగానే అధికారులపై బూతు పురాణం మొదలుపెట్టారు. చంద్రబాబు, లోకేష్ పేర్లను ప్రస్తావిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ రంకెలు వేశారు. ఒకరకంగా చెప్పాలంటే అక్కడున్న పొగాకు రైతులను భయపెట్టేలా ప్రవర్తించారు.

ఇదంతా ఓపిగ్గా చూస్తున్న రైతు నాయకుడు తానికొండ రమణయ్య, వైసీపీ నేతలను వారించే ప్రయత్నం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రెండేళ్లపాటు కనీస మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ జగన్ ఏమాత్రం పట్టించుకోలేదని రమణయ్య, తన అభిప్రాయాన్ని వారి ఎదుటే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. దీంతో వైసిపి ఇన్చార్జ్ మధుసూదన్ సహా, అక్కడున్న బులుగు పార్టీ నేతలంతా రమణయ్యపై మూకుమ్మడిగా గొడవకు దిగారు. ఏంటి ? తెలుగుదేశం పార్టీ తరఫున బ్రోకర్ లా మాట్లాడుతున్నావు, నీ సంగతి తేలుస్తాం.. అంటూ రమణయ్య వైపు చేతులు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా గమనిస్తున్న రైతులు... బుర్రా, ఆ పార్టీ నేతల వ్యవహార శైలి గమనించి విస్తుపోయారు. ఒక పార్టీకి ఇన్చార్జిగా ఉన్న వ్యక్తి, ఇలాగేనా వ్యవహరించేది అని ముక్కున వేలేసుకున్నారు.

వాస్తవానికి బుర్రా మధుసూదన్ వెంట వచ్చిన వారిలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు రైతులే కాదు. పైగా ఎక్కడి నుంచో తీసుకొచ్చిన పొగాకు బేలును తగులబెట్టి రాజకీయ లబ్ది పొందాలన్న దురాలోచనతో ప్రవర్తించారు.

రైతుల పరామర్శ పేరుతో వెళ్లి, రైతులపైనే దౌర్జన్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ ? రైతులను ఆదుకోవడానికి వచ్చారా, లేక వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి వచ్చారా ? ఈ సంస్కృతి వైసిపికి కొత్తేమీ కాదుగా..! మనదంతా రప్పా రప్పా విధానం కదా ! మీరు ఇలాగే ఉండండి. ఈసారి 11 కు బదులుగా ఒక్క సీటు మాత్రమే దక్కించుకునే అదృష్టాన్ని పొందండి.

అయినా, బుర్రా గారూ... రైతు సమస్యలపై మీకు అసలు అవగాహన ఉందా ? ప్రత్యేకించి పొగాకు పంటపై మీకు ఏం అనుభవం ఉంది ? రైతుల సమస్యలను పట్టించుకోవాలన్న మంచి బుద్ధి మీకు మీ పార్టీకి ఎప్పటినుంచి కలిగింది ? మీరు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా రైతులు గురించి పట్టించుకున్నారా ? తుఫాన్లు వచ్చి, రైతులు నష్టపోయినప్పుడు కనీసం పరామర్శించారా? ఇప్పుడు హఠాత్తుగా రైతులపై ప్రేమ ఎందుకు కలిగింది ? ఇకనైనా మీ తప్పులు సరిదిద్దుకోండి. రాబోయే రోజుల్లో రైతుల పక్షాన నిలబడండి. మీ సలహాలను ప్రభుత్వానికి అందించండి. అంతేతప్ప దూరం నుంచి రాళ్లు వేయొద్దు.

Address

Kottakata Street
Kandukuru

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Kandukur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share