Our Kakinada Smart City

Our Kakinada Smart City Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Our Kakinada Smart City, Landmark & historical place, Kakinada.

Tourist places | News Updates| | Culture | Local food

Photography | Job updates | Temple information | Birthday & Marriage day wishes | Promotions | Famous Food Information |

All the updates related to Kakinada city will be posted in this page కాకినాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా ముఖ్యపట్టణం, తూర్పు తీర ప్రాంతములో ముఖ్యమైన రేవు పట్టణం. కాకినాడ అనే పేరు వెనుక అనేక కథలు ఉన్న

ాయి.

కాకినాడ పేరు మొదట కాకివాడ అని ఉండేదని, అది కాలక్రమముగా కాకినాడగా నామాంతరం చెందిందని చెబుతారు. స్వాతంత్ర్యం రాక ముందు కొంతకాలం కాకినాడ పేరు కానాడగా చలామణి అయ్యింది.బ్రిటీషువారి కాలంలో కాకెనాడగా పిలువబడి, స్వాతంత్ర్యం వచ్చాక పేరు కాకినాడగా మార్చబడింది. అయితే స్వాతంత్ర్యం రాక మునుపు బ్రిటిషు వారి పరిపాలన సమయంలో స్థాపించబడిన సంస్థల పేర్లు కోకనాడ గానే ఉన్నాయి. ఉదాహరణ-కకనాడ చేంబర్ ఆఫ్ కామర్స్, జే ఎన్ టి యు లోని కొన్ని శిలాఫలకాలు, భారతీయ రైల్వేవారి స్టేషను కోడ్లు - కాకినాడ పోర్టు - COA, కాకినాడ టౌన్ - CCT.

మన కాకినాడ చరిత్రలో,,1960 లో జరిగిన మార్పులు
25/04/2026

మన కాకినాడ చరిత్రలో,,1960 లో జరిగిన మార్పులు

"వేసవిలో మీ శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఈ పానీయాలు ట్రై చేయండి."
12/04/2026

"వేసవిలో మీ శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఈ పానీయాలు ట్రై చేయండి."

పెళ్లిళ్ల సీజన్‌లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం. దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని అడ్వాన్సులు. కానీ  #లలితరైస్ ఇండస...
01/04/2026

పెళ్లిళ్ల సీజన్‌లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం. దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని అడ్వాన్సులు. కానీ #లలితరైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన #మట్టె_శ్రీనివాస్ సుమారు రూ.4 కోట్ల వ్యయంతో సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ కళ్యాణ మండపాన్ని అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మండపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తమ పిల్లల పెళ్లిళ్లు చేసుకోవచ్చు. ఇది పేద వారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక. అన్నవరం దేవస్థానంలో అధికారులు బుకింగ్‌లు ప్రారంభించారు. ఈ మండపంలో ఒకేసారి 12 జంటలకు వివాహం జరిపించేందుకు వీలుగా ఉంటుందని దేవస్థానం అధికారులు వివరించారు. పెళ్లి వారికి కావలసిన పాత్రలు, పాదుకలు, కుర్చీలు ఇలా అన్నీ దాత శ్రీనివాస్ సమకూరుస్తారు.

పెళ్లి పేదలకు తలకుమించిన భారమే. అయితే వారు కూడా సాదాసీదాగా కాకుండా ఉన్నతంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు దాత శ్రీనివాస్ చెబుతున్నారు. సంబంధిత పత్రాలు తీసుకువస్తే ఆయా తేదీలలో మండపాలను బుక్ చేస్తారు.

ఏసీ కళ్యాణ మండపంలో వివాహం చేసుకోదల్చిన వారు లగ్న పత్రిక, వధూవరుల ఆధార్ జిరాక్స్, వారి తల్లిదండ్రుల ఆధార్ జిరాక్స్‌లను రత్నగిరిపై ఉన్న సీఆర్‌వో కార్యాలయంలోఅందజేయాలి. వారికి ఉచిత కళ్యా వేదిక నెంబరును కేటాయిస్తారు. ఆ నంబర్‌ను ఉచిత కళ్యాణ వేదిక వద్ద చూపించి వివాహ సామాగ్రిని పొందాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదని ఆలయ అధికారులు వెల్లడించారు.

పోస్ట్ : వీరభద్రయ్య కాజా

మన జీవితంలో స్థిరమైన జీవితం కోసం 𝟏𝟓 ఆర్థిక సూత్రాలు.👉𝟎𝟏. పొదుపు అలవాటు...రోజూ కొంచెం అయినా డబ్బు పొదుపు చేయడం అలవాటు చేస...
25/03/2026

మన జీవితంలో స్థిరమైన జీవితం కోసం 𝟏𝟓 ఆర్థిక సూత్రాలు.

👉𝟎𝟏. పొదుపు అలవాటు...
రోజూ కొంచెం అయినా డబ్బు పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఆర్థిక భద్రత కలుగుతుంది. అవసరంలేని ఖర్చులను గుర్తించి వాటిని క్రమంగా తగ్గించడం ద్వారా మీరు ఎక్కువగా సేవ్ చేయగలుగుతారు. పొదుపు చేసిన డబ్బు కష్టకాలంలో మీకు అండగా నిలుస్తుంది కాబట్టి దాన్ని ఎప్పుడూ ప్రాధాన్యంగా తీసుకోవాలి. చిన్న మొత్తాలతో మొదలు పెట్టినా క్రమశిక్షణతో కొనసాగిస్తే పెద్ద మొత్తంగా మారుతుంది.

👉𝟎𝟐. ఎమర్జెన్సీ ఫండ్...
ఎప్పుడైనా అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు ఉపయోగపడేలా ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరిగా ఉండాలి. కనీసం మూడు నుండి ఆరు నెలల ఖర్చులకు సరిపడేంత డబ్బు విడిగా ఉంచడం ఉత్తమం. ఈ ఫండ్ వల్ల మీరు అప్పులు చేయకుండా సమస్యలను ఎదుర్కొనే శక్తిని పొందుతారు. ఇది మీ మనసుకు భద్రత మరియు ధైర్యాన్ని ఇస్తుంది.

👉𝟎𝟑. జీతం గోప్యత...
మీ జీతం గురించి ప్రతి ఒక్కరితో పంచుకోవడం వల్ల అవసరంలేని పోలికలు మరియు ఒత్తిడులు పెరుగుతాయి. సింపుల్‌గా జీవించడం ద్వారా మీరు అనవసరమైన అంచనాలను తగ్గించవచ్చు. మీ ఆర్థిక స్థితిని మీరే అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. గోప్యత పాటించడం మీ ఆర్థిక నియంత్రణకు సహాయపడుతుంది.

👉𝟎𝟒. ఇంటి భోజనం...
బయట ఫుడ్ కంటే ఇంటి భోజనం ఆరోగ్యానికి మరియు ఖర్చులకు చాలా మంచిది. రోజూ ఇంట్లో వండిన ఆహారం తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు అనవసర ఖర్చులు తగ్గుతాయి. స్ట్రీట్ ఫుడ్ లేదా ప్రాసెస్ చేసిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇంటి భోజనం అలవాటు చేసుకుంటే దీర్ఘకాలంలో డబ్బు కూడా సేవ్ అవుతుంది.

👉𝟎𝟓. సోషల్ మీడియా నియంత్రణ...
సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించడం వల్ల సమయం మరియు దృష్టి రెండూ వృథా అవుతాయి. ఇతరుల జీవితం చూసి పోల్చుకోవడం వల్ల అసంతృప్తి పెరుగుతుంది. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి సోషల్ మీడియాను పరిమితంగా వాడాలి. సమయాన్ని ఉపయోగకరమైన పనులకు వినియోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

👉𝟎𝟔. అప్పులు వద్దు...
అవసరం లేకుండా అప్పులు తీసుకోవడం భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీస్తుంది. ఎమోషన్‌తో కాకుండా ఆలోచించి మాత్రమే ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. అప్పులు ఎక్కువైతే మనశ్శాంతి కోల్పోతాం మరియు ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంతవరకు అప్పులను దూరంగా ఉంచాలి.

👉𝟎𝟕. ప్రాపర్టీ నిర్ణయం...
ఇల్లు లేదా ప్రాపర్టీ కొనుగోలు చేయడం ఒక పెద్ద నిర్ణయం కాబట్టి తొందరపడకూడదు. మీ ఆర్థిక స్థితి మరియు భవిష్యత్ ప్రణాళికలను పరిగణలోకి తీసుకోవాలి. సరైన సమాచారం సేకరించి నిర్ణయం తీసుకుంటే నష్టాలను నివారించవచ్చు. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం.

👉𝟎𝟖. ఖర్చుల నియంత్రణ...
అనవసర పార్టీలకు వెళ్లడం వల్ల డబ్బు మరియు సమయం రెండూ వృథా అవుతాయి. సింపుల్ లైఫ్ గడపడం ద్వారా మీరు ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతారు. ప్రతి ఖర్చును ఆలోచించి చేయడం మంచి అలవాటు. ఇది మీ ఆర్థిక స్థితిని బలంగా ఉంచుతుంది.

👉𝟎𝟗. ఉద్యోగ భద్రత...
ఉద్యోగాన్ని వదిలే ముందు సరైన బ్యాకప్ ప్లాన్ ఉండాలి. కొత్త అవకాశాలను పూర్తిగా అర్థం చేసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక భద్రత కోసం స్థిరమైన ఆదాయం అవసరం. సేఫ్ ఫ్యూచర్ కోసం ముందుగానే ప్రణాళిక చేయాలి.

👉𝟏𝟎. సైడ్ ఇన్‌కమ్...
అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషించడం చాలా ఉపయోగకరం. సైడ్ ఇన్‌కమ్ వల్ల ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. అయితే ప్రధాన ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సరైన బ్యాలెన్స్ పాటించడం ముఖ్యం.

👉𝟏𝟏. అవసరమైనవి మాత్రమే కొనండి:...
ఆఫర్లకు ఆకర్షితులై అవసరం లేని వస్తువులు కొనకండి. కొనుగోలు చేసే ముందు నిజంగా అవసరమా అని ఆలోచించాలి. ప్లాన్ చేసుకుని ఖర్చు చేస్తే డబ్బు Sach అవుతుంది. ఇది ఆర్థిక నియంత్రణకు సహాయపడుతుంది.

👉𝟏𝟐. స్కిల్స్ నేర్చుకోండి:...
ఒక ప్రాక్టికల్ స్కిల్ నేర్చుకోవడం భవిష్యత్తులో చాలా ఉపయోగ పడుతుంది. ఇది కష్టకాలంలో ఆదాయం పొందడానికి సహాయ పడుతుంది. సెల్ఫ్ రిలయన్స్ పెరుగుతుంది మరియు నమ్మకం పెరుగుతుంది. నైపుణ్యాలు పెంచుకోవడం ఎప్పుడూ లాభదాయకం.

👉𝟏𝟑. గ్యారంటీలు వద్దు...
ఇతరుల లోన్లకు గ్యారంటీగా సంతకం చేయడం ప్రమాదకరం. వారు చెల్లించకపోతే బాధ్యత మీపై పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక రిస్క్‌లను తగ్గించుకోవడం మంచిది.

👉𝟏𝟒. ఆరోగ్యం సంపద...
డబ్బు సంపాదన కోసం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యం బాగుంటేనే సంపదను ఆస్వాదించగలుగుతాము. సరైన ఆహారం మరియు జీవనశైలి పాటించాలి. ఆరోగ్యమే నిజమైన సంపద అని గుర్తుంచుకోవాలి.

👉𝟏𝟓. ప్రశాంత జీవితం:...
సింపుల్‌గా జీవించడం ద్వారా మనశ్శాంతి పొందగలుగుతాము. కుటుంబంతో గడిపే సమయం జీవితంలో అత్యంత విలువైనది. అత్యాశలు తగ్గిస్తే ఆనందం పెరుగుతుంది. స్థిరమైన జీవితం కోసం సమతుల్యత అవసరం.

®️ముగింపు:...
పొదుపు, నియంత్రణ, ప్రణాళికతో జీవిస్తే స్థిరమైన ఆర్థిక జీవితం సాధ్యమే. చిన్న అలవాట్లు పెద్ద మార్పులు తీసుకువస్తాయి... ✍️🤷‍♂️
“డబ్బును గౌరవించండి – జీవితం భద్రంగా ఉంచండి...!
పోస్ట్ సేకరణ : Ediga narendra goud page

23/03/2026
కాకినాడ  నగరం సూర్యారావు పేటలో వెంచేసియున్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆషా...
11/07/2024

కాకినాడ నగరం సూర్యారావు పేటలో వెంచేసియున్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆషాడంలో శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారిని " శాకాంబరి " గా అలంకరించడం అనవాయితీ ఈ యొక్క సాంప్రదాయానుసారం శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాడ పౌర్ణమి అనగా ది. 21-7-2024 ఆదివారం శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారు " శాఖాంబరి" అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చేదరు. అనగా 'శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారిని కూరగాయలు (అన్నిరకాలైను ఆకుకూరలు (అన్నిరకాలు) వండ్లు (అన్ని రకాలు) తో సర్వాంగ సుందరంగా అలంకరణ చేయటం జరుగును కామన భక్తులు శ్రీ అమ్మవారి శాకాంబరి అలంకరణకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, వగైరా శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి శాకాంబరి అలంకరణకు ఆలయంనందు ది.20-7-2024 శనివారం సాయంత్రం 5 గం॥ లోపు సమర్పించుకుని శ్రీ అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరడమైనది మరియు ది. 21-7-2024 ఆదివారం ఉ 6గం॥ల నుండి భక్తులు శ్రీ అమ్మవారిని శాకాంబరి గా దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసినదిగా కోరుచూ భక్తులను ఆహ్వానించడమైనది. శాకంబరీ అలంకారమునకు నగదు రూపేణా కూడా భక్తులకు తమకు తోచిన విధంగా సహకారం అందించి ఆలయకౌంటర్ వద్ద తగు రశీదు పొందవలసిందిగా తెలియజేయడమైనది

అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు 19-5-24 నుండి 24-5-24 వరకు... లోక కళ్యాణార్ధం, భక్తుల సంరక్షణార్...
17/05/2024

అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు 19-5-24 నుండి 24-5-24 వరకు... లోక కళ్యాణార్ధం, భక్తుల సంరక్షణార్ధం ఘనంగా జరుపుటకు నిర్ణయం 🙏

శ్రీ స్వామి వారి దివ్య కళ్యాణోత్సవానికి భక్తులందరూ సపరివారంగా విచ్చేసి స్వామి వారిని సేవించి తరించవలసినదిగా దేవస్థానం వారు ఆహ్వానిస్తున్నారు.

పోస్ట్ : శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం

తలుపులమ్మ తల్లి దేవాలయం, తుని !! తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది....
06/05/2024

తలుపులమ్మ తల్లి దేవాలయం, తుని !!

తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది. అమ్మవారు 'తలుపులమ్మ' గా ఆవిర్భవించిన క్షేత్రమే 'లోవ'. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతోన్న ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. ఈ కొండలలో ఒకదానిని 'ధారకొండ' గానూ మరొక దానిని 'తీగకొండ' గా స్థానికులు పిలుస్తుంటారు. ఈ రెండు కొండల మధ్య 'తలుపులమ్మ' అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది.

పురాణ గాథ

కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి, సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటిజాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా, కొండపైన పాతాళ గంగ పొంగింది. సంధ్యా వందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు, ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో, ఆయన అభ్యర్ధనమేరకు అమ్మవారు ఇక్కడి కొండగుహలో కొలువుదీరింది.

కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటోంది. ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఇక్కడి అమ్మవారిని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. వెలమకొత్తూరు గ్రామం దగ్గరలో ఉంటుంది.

పూజ మరియు పండగలు

ప్రతి ఏటా చైత్ర మాసం (ఏప్రియల్/ మార్చ్), ఆషాఢ మాసం (జూన్/జులై) లో దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. బహుళ విదియ, తదియ రోజులలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఇక్కడ వేడుకలు సుమారు 15 రోజులపాటు వైభవంగా జరుగుతాయి.

వసతి

తలుపులమ్మ తల్లి దేవి ఆలయాన్ని దర్శించే భక్తులకు దేవస్థానం వసతి సదుపాయాలను కల్పించింది. ఇక్కడ సుమారు 28 కాటేజీలు కలవు. నామమాత్రపు ధరల్లో ఇవి లభిస్తాయి. ఉత్సవాలు, పండుగల సీజన్లో గదులు దొరకడం కష్టం. గెస్ట్ హౌస్ లు లేవు కనుక అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఉదయాన్నే వచ్చి సాయంత్రం తిరుగుప్రయాణం అవుతారు. తునికి సమీపంలో ఉన్న లోవకొత్తూరు దగ్గర ఉంది. ఇది పర్యాటక ప్రాంతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృక్షశాస్త్రం చదివే విద్యార్థులు తరచు ఇక్కడకి విహారయాత్రకి వెళుతూ ఉంటారు. పూర్వం కాలినడకన వెళ్ళేవారు. ఇప్పుడు బస్సులు ఉన్నాయి.

తుని పట్టణంలో చూడవలసినవి/ చేయవలసినవి:

ఆదివారపు సంత తప్పకుండా చూడండి. కొండప్రాంతం కనుక ఇక్కడ వర్షాధార పంటలు పండిస్తారు. ముఖ్యంగా మామిడి విస్తారం. తక్కువ ధరకు రోడ్లపై విరివిగా అమ్ముతారు. ఇప్పుడు ఎండాకాలం కనుక తుని లో మామిడిపండ్లు రుచి చూడాల్సిందే.

తలుపులమ్మ లోవ ఆలయానికి ఎలా చేరుకోవాలి

తలుపులమ్మ లోవ గుడి కాకినాడకు 70 కి. మీ ల దూరంలో, రాజమండ్రి కి 106 కి. మీ ల దూరంలో, అమలాపురానికి 176 కి. మీ ల దూరంలో, తుని కి కేవలం 8 కి. మీ ల దూరంలో కలదు. ఈ గుడి జాతీయ రహదారికి 6 కిలోమీటర్ల దూరంలో, తుని రైల్వే స్టేషన్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

సమీప విమానాశ్రయం : రాజమండ్రి
సమీప రైల్వే స్టేషన్ : తుని

బస్సు మార్గం : తుని వరకు బస్సులో ప్రయాణించి... అక్కడి నుంచి జీపులలో లేదా షేర్ ఆటోలలో ప్రయాణించి తలుపులమ్మ తల్లి దేవస్థానం చేరుకోవచ్చు.

తలుపులమ్మ లోవ కొత్తూరు సమీప గ్రామం అక్కడి వరకూ బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుండి దేవాలయం వరకూ ఆటోలు, జీపులు, టాక్సీల సౌకర్యం కలదు.
శుభోదయం 🙏🙏🙏

కాకినాడకు పదికిలోమీటర్ల దూరంలో ఉంటూ,  తీరప్రాంతాన్ని యే ఉప్పెనలూ ముంచెత్తకుండా అడ్డుగోడగా నిలుస్తున్న మడఅడవుల (మాంగ్రూవ్...
04/05/2024

కాకినాడకు పదికిలోమీటర్ల దూరంలో ఉంటూ, తీరప్రాంతాన్ని యే ఉప్పెనలూ ముంచెత్తకుండా అడ్డుగోడగా నిలుస్తున్న మడఅడవుల (మాంగ్రూవ్స్) గురించి ఓ నాలుగు ముక్కలు..

చదువుకునే పిల్లలకి ప్రకృతి గొప్పదనాన్ని, బయోడైవర్సిటీ (జీవవైవిధ్యం) గురించి వివరించాలనుకుంటే ఉదాహరణలతో సహా ప్రత్యక్షంగా చూపించగలిగే మంచిచోటిది..

అతిపెద్ద మడఅడవుల్లా చెప్పే పశ్చిమబెంగాల్ సుందరవనాల తర్వాత మన కోరంగి మడఅడవులే పెద్దవంటారు.. ఐక్యరాజ్యసమితి లెక్కలప్రకారం అయితే ఆసియా ఖండంలోనే అతిపెద్ద జీవవైవిధ్యం ఉన్న మడఅడవి కూడా ఇదే..

పిల్లకాలువలుగా మారిన నదులు ఎక్కడెక్కడైతే సముద్రంలో కలుస్తాయో సరిగ్గా అక్కడే ఏర్పడతాయి ఈ మడఅడవులు.. వలెయ్యడానికి, వేటాడ్డానికి అనువుగాని చిత్తడిప్రాంతం గనుక కొన్ని రకాల కొంగజాతుల సంతానోత్పత్తికి, ఆహారానికి బాగా అనుకూలం ఈ ప్రాంతం.

ఇలా అందాలకి, అనుభవాలకి, అరుదైన జీవరాశులకి ఆవాసంగా వెలుగొందుతోన్న ఈ అభయారణ్యంలోపలికెళ్లడానికి
పిల్లలకు 20, పెద్దలకు 50 టికెట్టు ధరలు పెట్టారు..

ఒకప్పుడయితే కోరంగిలో పక్కనే కైట్స్ ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీపిల్లలు మాత్రమే వచ్చి వాళ్ళ ప్రైవసీ పనుల్లో వాళ్ళుండేవారు.. కానీ ఈ మధ్య సాధారణ సందర్శకులు కూడా బాగా పెరిగారు..

ప్రతీరోజూ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సందర్శకులను అనుమతించే ఈ అడవికి ప్రతి మంగళవారం, తుపాన్లొచ్చినప్పుడూ మాత్రం సెలవు... !!

లోపలికెళ్తుండగానే కోరంగి నేచర్‌ షాపు, క్యాంటీన్లు, అడవి లోపలికంటా మూడు కిలోమీటర్ల మేర చెక్కబ్రిడ్జీలు బాగా మోపు జేశారు ఎక్కడికక్కడ.. చిన్నపిల్లలాడుకోవడానికి ఉయ్యాల బల్లలున్నాయి, సేదతీరడానికి చెక్కబల్లలేశారు.. బాగున్నాయి.. !!

ఇక సన్నని మెట్లెక్కి పైనుంచి అడవంతా చూడ్డానికి వాచ్ టవర్ కూడా కట్టారు.. ఆయాసపడుతూ పైకెక్కి చూస్తే ప్రతీ వైపు పచ్చదనమే.. !!👌

మడఅడవులంటే మామూలు అడవుల చెట్లవేరుల్లా భూమిలోపలకి కాకుండా నీటిలోంచి పైకి తేలుతున్నట్టుంటాయ్ ఈ మడచెట్లు.. ఆ వేర్లలోంచి ఇంకో కొత్తవేర్లు వాటిలోంచి మళ్లీ చెట్లు.. ఇలా అల్లుకుపోయి ఉండటంతో గుబురుగుబురుగా ఉంటాయివి..

ఇందులో పొన్న (దీన్నే తెల్లమడ అంటారనుకుంటా బైపీసీ బోటనీ ప్రకారం), నల్లమడ, గుండు, కళింగ, గుగ్గిలం లాంటి మడజాతి మొక్కలతో ఎన్నో రకాల చేపలు, సముద్రపు తాబేలు, నీటికాకి, కొంగ, నారాయణ పక్షులు, ఉల్లంపిట్టలు, బాతులు, సముద్రపు చిలకలు, ఉభయచరాలు, పక్షులు, రకరకాల జీవజాలాలుంటాయ్.. బహుశా జనాలెక్కువగా తిరుగుతుండటం వల్ల కావొచ్చు.. బోర్డుల్లో చూపించిన చేపలు పట్టే పిల్లి, పైన చెప్పిన జంతువులేవీ బయటకి కనబళ్ళేదు.. లోపలకి ఉండొచ్చేమో.. ఇదేం చిన్నది కాదు కదా.. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉన్న మడఅడవుల్లో 65శాతం కోరంగిలోనే ఉంది మరి...

ఈ విశేషాలన్నీ చూస్కుంటూ అలా నదీపాయ దగ్గరికెళ్తే అందులో అటవీశాఖ వారు పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బోటు షికారు కూడా చెయ్యొచ్చు.
18 వ శతాబ్దంలో ఏకైక పోర్టుగా వెలుగొంది ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న కోరంగి పోర్టు తాలూకూ లైట్ హౌస్ కూడా చూసి రావొచ్చు..

ఇంతటి జీవవైవిధ్యాన్ని, ఆవాసాన్ని, ఆనందాన్ని, ఆక్సిజన్ని అందిస్తున్న మడఅడవులు మౌనంగా చేస్తున్న ఇంకో గొప్ప పనుంది.. అదే చుట్టుపక్కల ప్రాంతాల్ని తుఫాన్లనించి కాపాడ్డం..

అవును.. సుడివేగంతో దూసుకొచ్చే పెనుగాలుల్ని చిరుకొమ్మల్తో ఆపుతాయి.. ఉవ్వెత్తున ఎగసిపడే సముద్రపు కెరటాల్ని చిగురుటాకుల్తో అడ్డుకుంటాయి.. అవేవీ బయటి ప్రపంచానికి తెలీనివ్వకుండా ఎప్పట్లానే చిన్నగా కనబడతాయి.. !!

1996లోనూ, పెథాయ్ నించీ కాకినాడ తెర ప్రాంతానికి అనేక తుఫాన్లొచ్చినప్పుడు కూడా కాకినాడ, యానాం, భైరవపాలెం, తాళ్లరేవు, చొల్లంగి, కోరంగి లాంటి సముద్ర తీరప్రాంత ప్రజలు గుండెలమీద చెయ్యేసుకుని నిద్రపోగల్గుతున్నారంటే కారణం భీభత్సానికి అడ్డుగోడగా నిలుస్తున్న ఈ మడఅడవుల వల్లే..

ఎంతైనా అడవులనేవి కంటికి కనిపించని ధర్మం లాంటివి.. వాటిని మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయ్..

Post credit : -హరిబాబు మద్దుకూరి


సమ్మర్ స్పెషల్ ట్రైన్స్- వేసవి సెలవలలో ప్రయణీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే వారి స్పెషల్ ట్రైన్స్.             సికింద్రాబాద...
04/05/2024

సమ్మర్ స్పెషల్ ట్రైన్స్- వేసవి సెలవలలో ప్రయణీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే వారి స్పెషల్ ట్రైన్స్.

సికింద్రాబాద్ - కాకినాడ,సికింద్రాబాద్ - బ్రహ్మపూర్. మన రాజమండ్రి మీదుగా వెళ్లే ట్రైన్స్.

పోస్ట్ : సౌత్ సెంట్రల్ రైల్వే

గుర్తుందా...... ఇప్పుడంటే ప్లేస్టేషన్లు, మొబైల్లో వీడియో గేమ్లు, ప్రీ ఫైర్, పబ్జి రకరకాల గేములు వచ్చాయి కానీ అప్పట్లో పి...
20/04/2024

గుర్తుందా......
ఇప్పుడంటే ప్లేస్టేషన్లు, మొబైల్లో వీడియో గేమ్లు, ప్రీ ఫైర్, పబ్జి రకరకాల గేములు వచ్చాయి కానీ అప్పట్లో పిల్లలకి, పెద్దలకి కూడా ఇదే ఆట వస్తువు 😍

Address

Kakinada
533005

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Kakinada Smart City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share