03/06/2026
గుంటూరులో అత్యాధునిక "లలిత హాస్పిటల్" నూతన భవన ప్రారంభోత్సవంలో సంచలన గణాంకాలతో మాట్లాడిన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 600 పడకల అంతర్జాతీయ స్థాయి లలిత హాస్పిటల్ను ప్రారంభించిన అనంతరం, రాష్ట్ర ఆరోగ్య రంగాన్ని గాడిలో పెడుతున్న కూటమి ప్రభుత్వ పక్కా యాక్షన్ ప్లాన్ను మంత్రి గారు వివరించారు.
ప్రసంగంలోని అత్యంత కీలక ముఖ్యాంశాలు:
సేవా నిరతి: 36 ఏళ్లుగా గుంటూరు ప్రాంతంలో ‘గివ్ బ్యాక్ టు ద సొసైటీ’ స్ఫూర్తితో నాణ్యమైన సేవలు అందిస్తున్న డాక్టర్ రాఘవ శర్మ, డాక్టర్ విజయ గారి దంపతులకు అభినందనలు.
రూ. 18 కోట్ల అధునాతన MRI: గుండె, పక్షవాతం వ్యాధుల భారానికి (32% CVD మరణాలు) అడ్డుకట్ట వేసేందుకు ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు కల్పించడం ఆనందకరం.
'సంజీవని' హెల్త్ ప్లాట్ఫామ్: డోర్స్టెప్ వద్దే 42 రకాల ఉచిత పరీక్షలు అందిస్తూ, రోగుల రికార్డుల కోసం దేశంలోనే తొలిసారిగా 'సంజీవని' డిజిటల్ ప్లాట్ఫామ్ను తెచ్చాం.
గోల్డెన్ అవర్లో ప్రాణరక్షణ (STEMI): రూ.45,000 ఖరీదు చేసే ‘టెనెక్టెప్లేస్’ ఇంజెక్షన్ను ఉచితంగా అందిస్తూ, 96% సక్సెస్ రేటుతో 4,900 మంది ప్రాణాలను కాపాడాము.
గత ప్రభుత్వ లిక్కర్ పాలసీ తెచ్చిన విలయం (2020-2024):
లివర్ (కాలేయ) కొత్త కేసులు: 4,917 నుండి 11,223 కి (250% వృద్ధి) పెరిగాయి.
కిడ్నీ కొత్త కేసులు: 15,058 నుండి 23,558 కి (75% వృద్ధి) చేరాయి.
న్యూరో (స్ట్రోక్) కేసులు: 380 నుండి ఏకంగా 7,646 కేసులకు (2000% వృద్ధి) పెరిగాయి.
ఆరోగ్యశ్రీపై అసత్యాల ఖండన: ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ.4,225 కోట్లు కేటాయించాం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలతో కలిపి ఈ రెండేళ్లలోనే రూ.6,900 కోట్లు నెట్వర్క్ ఆసుపత్రులకు క్లియర్ చేసాము.
వివక్ష లేని CMRF: ధర్మవరం నియోజకవర్గానికి గత 5 ఏళ్లలో కేవలం రూ.3 కోట్లు ఇస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలోనే రూ.9.42 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు అందించాం.
'స్వర్ణాంధ్రప్రదేశ్' ప్రణాళికలో భాగంగా హెల్దీ & హ్యాపీ ఆంధ్రప్రదేశ్ను నిర్మించి, వికసిత భారత్లో రాష్ట్రాన్ని నంబర్ వన్గా నిలపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం!
భారత్ మాతా కీ జై! 🇮🇳
Satya Kumar Y