03/06/2026
రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు. మళ్ళీ పదేళ్ల పాటు ప్రతిపక్షంలోనే కూర్చోవాలని ఆ పార్టీ నేతలే మానసికంగా సిద్ధమైపోయారు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి మరీ దారుణం. బావాబామ్మర్దులు, అన్నాచెల్లెళ్లు, తండ్రీబిడ్డల కుటుంబ పంచాయితీల మధ్య పడి ఆ పార్టీ కనుమరుగవ్వడం ఖాయం.
2004 నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీలది విడదీయరాని బంధం. యూపీఏ-1 లో, వైఎస్సార్ ప్రభుత్వంలో మంత్రులుగా పదవులు అనుభవించి, మన తెలంగాణ నీళ్లను రాయలసీమకు తరలిస్తున్నా మౌనంగా శిలాఫలకాల దగ్గర నిలబడ్డ చరిత్ర బీఆర్ఎస్ నేతలది.
నిఖార్సైన సిద్ధాంతాలతో, చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్న బీజేపీ రాష్ట్రంలో వేగంగా ఎదుగుతుంటే... అది చూసి ఓర్వలేక ఈ రెండు పార్టీలూ కుమ్మక్కై మాపై బురదజల్లే కుట్రలు చేస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు!
- శ్రీ రఘునందన్ రావు గారు, మెదక్ ఎంపీ