BJP Mission 2019 Telangana

BJP Mission 2019 Telangana All states are Modi'fying.. Next our Target is

11/12/2023

పురుషోత్తముడైన శ్రీరాముడి ధర్మ యుద్ధంలో చిన్ని ఉడత కూడా తన శక్తివంచన లేకుండా రామకార్యంలో భాగమవాలనే తపనతో ఆనాడు వారధి నిర్మాణంలో ఉడత చూపిన భక్తికి మెచ్చి శ్రీరామచంద్రుడు ఉడతని తన చేత్తో తీసుకొని వాత్సల్యాన్ని చూపిన ఘటన నేను విన్నాను ఈరోజు అలాంటి సంఘటనను నా జీవితంలో నేను అనుభూతి చెందాను.

ఇందూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి స్వయంసేవక్ గా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో చేరిన నేను ఊహ తెలిసినప్పటి నుంచి ఆ పురుషోత్తముడైన శ్రీరాముడిని నరేంద్ర మోడీ గారి రూపంలో దర్శిస్తూనే ఉన్నాను శ్రీరామ కార్యంలో ఉడత లాగా ఈ అభినవ రాముడి కార్యంలో ఒక చిన్న సామాన్య కార్యకర్త లాగా ప్రయాణాన్ని ప్రారంభించిన నేను ఈ కళ్ళతో, ఈ శరీరంతో సాక్షాత్తు శ్రీరాముడిని దర్శించాను.

ఈ జీవితానికి ఇంతకన్నా మోక్షం ఇంకేం కావాలి
నా జీవితానికి పరిపూర్ణమైన మోక్షము లభించిందని భావిస్తున్నాను.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు విచ్చేసిన భవ్య భారత ప్రధానమంత్రి అభినవ శ్రీరామచంద్రుడు శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారిని కలిసే సౌభాగ్యాన్ని నాకు కలిగించిన భారతీయ జనతా పార్టీకి కోటి కోటి ధన్యవాదాలు.

ఇలాంటి అద్భుతం కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యము ,ఒక సామాన్య కార్యకర్త ప్రధానమంత్రిని కలిసే మహత్భాగ్యము కల్పించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ.

ఈ జీవితం ఉన్నంతకాలం ఈ పార్టీతోనే నా ప్రయాణం

ఈ కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం ఈ జెండానే నా సర్వస్వం

ఈ గుండె కొట్టుకుంటూ ఉన్నంతకాలం ఈ సిద్ధాంతమే నా ఊపిరి

నా జీవితం దేశం కోసం - ధర్మం కోసం
మీ
పటేల్ ప్రసాద్
ఇందూరు

10/10/2022

మన సంస్కృతీ వేదిక- ఇందూర్
నాగారం దేవాలయ పరిరక్షణ కమితి
దసర సమ్మేళనంలో ఇందూర్ లో

10/05/2022

*ఇందూరులో నిజాం మండీ హొటల్ మేనేజర్ దళిత యువకుదు రాజు ముస్లింల విచక్షణ రహిత దాడి*

ఇందూరు నగరంలోని ప్రగతి నగర్ లో నిజాం మండీ పేర హిందువులు నిర్వహిస్తున్న హొటల్ చక్కగా నడవటం,తమ మండి లకు పోటీగా రావడం గిట్టని ముస్లింలు నిన్న రాత్రి 11గంటల ప్రాంతంలో ఫుడ్ పాయిజన్ జరిగింది అనే అసత్య ఆరోపణతో హొటల్ పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి,ఈ సంఘటనకు ఎటువంటి సంబంధం లేని దళిత యువకుడు,హోటల్ మేనేజర్ గా పని చేస్తున్న రాజు ను సుమారు 30 మంది విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా బైక్ పై తీసుకెళ్లి ముస్లింలు అధికంగా ఉన్న అహ్మద్ పురాలో మరింత మంది విపరీతంగా దాడి చేసారు.

సంఘటన సమాచారం తెలుసుకున్న పటేల్ ప్రసాద్,ఇతర కార్యకర్తలు బాధితుడిని కలిసి అతనితో పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేవలం హిందువుల హోటల్ అయిన కారణంగానే ఈ దాడి జరిగిందని, పథకం ప్రకారమే దళిత యువకుడైన రాజును చావగొట్టారని ఈ ఘటన పైన తగిన చర్యకు పోలీసులు ఉపక్రమించాలని, వెంటనే దాడి చేసిన వారిని అరెస్టు చేసి హత్యా యత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

మీ పటేల్ ప్రసాద్ ఇందూరు

18/03/2022
06/01/2022

Address

Shyam Prasad Bhavan Nampally
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when BJP Mission 2019 Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share