02/05/2023
*జిల్లా గ్రంధాలయంలో నూతన కంప్యూటర్లు ను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు*
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంధాలయం సంస్థ లో 6లక్ష వ్యయo తో నూతన కంప్యూటర్ విభాగం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా *ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు* హాజరయ్యారు.
*ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నూతన కంప్యూటర్ విభాగాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది*.
*జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ ఎమ్మెల్యే గారికి, రాష్టవినియోగదారులఫోరం ఛైర్మన్ గారికి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.*
*ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.....*
గ్రంధాలయంలో విద్యార్థులు e లైబ్రరీ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవడం కోసం నూతన కంప్యూటర్ విభాగoను ఏర్పాటు చేసీనారు ఈ సందర్భం గా విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు సంబందించిన మెటీరియల్ ను చదువుకోడానికి వివిధ అధ్యయన పుస్తకాలను, విద్యార్థి విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరిగిందని. అదేవిధంగా ప్రస్తుతం ప్రపంచంలోని పరిజ్ఞానం అంతా విద్యార్థులకు అందాలని విషయాలను త్వరగా తెలుసుకోవడానికి విద్యార్థిని విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండే విధంగా ప్రస్తుతం కంప్యూటర్ ఎంతో ఉపయోగమైనది. చిన్న చిన్న విషయాలని ఆన్ లైన్ ద్వార తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి గ్రంధాలయంలో పాఠకులకు పుస్తకాలతో పాటు కంప్యూటర్ అందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుంది.
*త్వరలోనే జిల్లా గ్రంధాలయ భవనాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది తెలిపారు*
*లైబ్రరీ చైర్మన్ మాట్లాడుతూ..*
ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గద్వాల విద్య వ్యవస్థలో నూతన శకం ప్రారంభమైందని గద్వాల విద్యార్థుల గురించి అనునిత్యం ఆలోచించే ఎమ్మెల్యే గారు కాలేజీలలో నూతన కోర్సులు, గురుకుల పాఠశాలలు, నర్సింగ్ కళాశాల, పాఠశాలలో వసతులు, కెసిఆర్ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ, గద్వాల పట్టణంలో అన్ని వసతులతో నూతన లైబ్రరీ బిల్డింగ్ ను, మండల కేంద్రాల్లో లైబ్రరీ బిల్డింగ్ లను ఏర్పాటు చేయబోతున్నారని. లైబ్రరీలో అన్ని రకాల పోటీ పరీక్షలకు నాణ్యమైన మెటీరియల్ ను అందుబాటులో ఉంచుతున్నామని దానితో పాటు e లైబ్రరీ ని కూడా అందుబాటులోకి తెచ్చామని అందుకే 6లక్షల వ్యయంతో నూతన కంప్యూటర్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
👉*ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంపీపీ విజయ్,జిల్లా గ్రంథాలయ సoస్థ డైరెక్టర్ (కౌన్సిలర్స్) శ్రీమతి అరుణజనార్దన్ రెడ్డి ,కౌన్సిలర్ నరహరి గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు జనార్ధన్ రెడ్డి, శేఖర్, జిల్లా గ్రంథాలయం సంస్థ కార్యదర్శి శ్యామ్ సుందర్ ,లైబ్రేరియన్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.