NPRD Telangana

NPRD Telangana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NPRD Telangana, Social service, Hyderabad.

వికలాంగుల వాయిస్ మాస పత్రిక 12 వ వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ
26/08/2026

వికలాంగుల వాయిస్ మాస పత్రిక 12 వ వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ

వికలాంగుల వాయిస్ మాస పత్రిక 12వ వార్షికోత్సవ ఉత్సవాలు
26/08/2026

వికలాంగుల వాయిస్ మాస పత్రిక 12వ వార్షికోత్సవ ఉత్సవాలు

వికలాంగుల పెన్షన్ పెంఫు, కొత్త పెన్షన్స్ మంజూరు కోసం దశాల వారీగా ఉద్యమన్ని ఉదృతం చేస్తామని NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శ...
23/08/2026

వికలాంగుల పెన్షన్ పెంఫు, కొత్త పెన్షన్స్ మంజూరు కోసం దశాల వారీగా ఉద్యమన్ని ఉదృతం చేస్తామని NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య హెచ్చరించారు. ఈ రోజు వనపర్తి పట్టణంలో జరిగిన NPRD ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమావేశానికి అయన హాజరై మాట్లాడినారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె కాశప్ప, రాష్ట్ర కమిటీ సభ్యులు బంగారయ్య, భాగ్యలక్ష్మి, నర్సింహా, చెన్నయ్య, రాధమ్మ, కుర్మయ్య, లక్ష్మి, రామకృష్ణ, బాబు లతో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు

22/08/2026
పత్రిక ప్రకటన   18.08.2027*2016 ఆర్పిడి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి*.*2016 RPWD చట్టం అమలు,పర్యవేక్షణ కోసం జిల్లా స్...
18/08/2026

పత్రిక ప్రకటన 18.08.2027

*2016 ఆర్పిడి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి*.

*2016 RPWD చట్టం అమలు,పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలి*

*ప్రభుత్వ కార్యాలయల్లో ర్యాంపులు నిర్మించాలి*

*వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి*

*NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య*

*జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా.. కలెక్టర్కు వినతిపత్రం అందచేత*

*కమిటీ ఏర్పాటు చేయిస్తాం.. కలెక్టర్ హామీ*

2016 ఆర్ పి డి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, చట్టం అమలు,పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ప్రయివేట్ కార్యాలయాల్లో ర్యాంపులు నిర్మించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డి ) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
*ధర్నాను ఉద్దేశించి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య మాట్లాడుతూ* 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమలులోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తి అవుతుంది.చట్టం అమలు మరియు పర్యవేక్షణ కోసం 2016 ఆర్పిడి చట్టం సెక్షన్ 60 ప్రకారం వైకల్యంపై కేంద్ర, రాష్ట్ర సలహా బోర్డులు మరియు జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలి. సెక్షన్ 72 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమనికి నిర్దేశించే విధులను నిర్వర్తించడానికి వైకల్యంపై జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని చట్టంలో ఉన్నప్పటికీ జిల్లాలో గత 8 సంవత్సరాలనుండి కమిటీని ఏర్పాటు చేయడం లేదు. కమిటీ ఏర్పాటు చేయాలని అనేక పర్యాయలు జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది.కానీ జిల్లా అధికారుల వైపు నుండి ఎలాంటి స్పందన లేదు.చట్టం అమలుపై పర్యవేక్షణ చేయాల్సిన జిల్లా సంక్షేమ అధికారి పట్టించుకోకపోవడం వలన వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సెక్షన్ 38 ప్రకారం అధిక మద్దతు అవసరం ఉన్న వికలాంగులకు ప్రత్యేక రాయితీలు కల్పించడానికి అవసరమైనా చర్యలు తీసుకోవాలి.జిల్లాలో ఉన్న వికలాంగులకు 2016 ఆర్పిడి చట్టం ప్రకారం సౌకర్యాలు అందడం లేదు.జిల్లాలోని సామూహిక ప్రాంతాలు వికలాంగులు వినియోగించుకునేందుకు అనుకూలంగా లేవు.జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంకులకు ర్యాంపులు లేకపోవడం వలన తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.చట్టం అమలు, పర్యవేక్షణ పట్ల జిల్లాలోని ప్రభుత్వ అధికారులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. జిల్లాలో ఉన్న ప్రయివేట్ పరిశ్రమల నుండి ప్రభుత్వంకు
వస్తున్న సిఎస్ఆర్ నిధులను వికలాంగులకు సహాయ పరికరాలు మరియు తీవ్ర వైకాల్యం కలిగిన వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు వినియోగించుకునే విదంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కలెక్టర్ కార్యాలయం మెయిన్ గేట్ నుండి గ్రీవెన్స్ హాల్ వరకు ఎలక్ట్రికల్ ఆటో ఏర్పాటు చేయూలని డిమాండ్ చేశారు.జిల్లాలోని ప్రయివేట్, ప్రభుత్వ బ్యాంక్లలో ర్యాంపులు లేవని దీనితో వికలాంగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు.సమస్యలు పరిష్కారం చేయకుంటే ఉద్యమం చేస్తామని హేచ్చరించారు.

*కమిటీ ఏర్పాటు చేయిస్తాం:జిల్లా కలెక్టర్ హామీ*

జిల్లా స్థాయిలో వికలాంగుల కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయల్లో ర్యాంపూలు నిర్మించేందుకు కృషి చేస్తామని, కలెక్టర్ కార్యాలయం మెయిన్ గేట్ నుండి గ్రీవెన్స్ హాల్ వరకు ఎలక్ట్రికల్ ఆటో ఏర్పాటు చెస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి సి సాయమ్మ, జిల్లా అధ్యక్షులు బస్వరాజు కార్యదర్శి కె నర్సిములు,జిల్లా ఉపాధ్యక్షులు యం జయలక్ష్మి, రాజు కుమార్, కృపవరం, సహాయ కార్యదర్శులు మచ్చేందర్,సంగమేష్, జిల్లా నాయకులు భాగ్యమ్మ, యదుల్, సత్యనారాయణ నవీన్ చారి తదితరులు పాల్గొన్నారు

సెప్టెంబర్ 1-3 తేదీల్లో బోధన్ పట్టణంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధా...
11/08/2026

సెప్టెంబర్ 1-3 తేదీల్లో బోధన్ పట్టణంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ రోజు బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో NPRD నిజామాబాదు జిల్లా విస్తృత సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా అధ్యక్షులు గైని రాములు, కార్యదర్శి యేశాల గంగాధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పి కవిత, నాయకులు నజీర్, దేవదాస్ లక్ష్మి, భాను తదితరులు పాల్గొన్నారు

Address

Hyderabad
500020

Telephone

+919490098713

Website

Alerts

Be the first to know and let us send you an email when NPRD Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to NPRD Telangana:

Shortcuts

Share

Category