03/09/2026
కామ్రేడ్ బందగీ కి జోహార్లు
🌹✊✊✊✊✊🌹
రైతు నాయకుడు ఎండీ మైనోద్దీన్ తనయుడు బందగీ అకాల మరణం తీరని లోటు
బందగీ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి
శోకసంద్రంలో మునిగిన మైనోద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ రాష్ట్ర, జిల్లా నాయకులు....
తెలంగాణ రైతుసంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎండీ మైనోద్దీన్ గారి పెద్ద కుమారుడు ఎండీ బందగీ గారు అకాల మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని, తీవ్ర విచారాన్ని కలిగించిందని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ పల్లా వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
బందగీ గారి భౌతికకాయాన్ని దర్శించిన ఆయన, మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... "ఎంతో భవిష్యత్తు ఉన్న యవకుడు బందగీ చిన్న వయస్సులోనే మరణించడం ఎంతో బాధాకరం. నిరంతరం ప్రజా పోరాటాలలో, రైతు సమస్యల పరిష్కారంలో నిమగ్నమయ్యే రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు మైనోద్దీన్ గారి కుటుంబానికి ఈ ఘటన తీరని లోటును మిగిల్చింది. నిరుపేదలు, రైతుల హక్కుల కోసం పోరాడే మైనోద్దీన్ గారికి కొడుకు దూరం కావడం అత్యంత విచారకరం" అని అన్నారు. అమరుడు బందగీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, పుత్రశోకంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ఆయన తన తీవ్ర సానుభూతిని తెలిపారు. మైనోద్దీన్ గారికి, వారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో దైర్యం ప్రసాదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు పాల్గొని నివాళులర్పించారు:
పల్లా నరసింహారెడ్డి (సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు)
నెల్లికంటి సత్యం (ఎమ్మెల్సీ & జిల్లా కార్యదర్శి)
పల్లా దేవేందర్ రెడ్డి (జిల్లా సహాయ కార్యదర్శి)
స్టాలిన్ (హైదరాబాద్ జిల్లా కార్యదర్శి)
కార్యవర్గ సభ్యులు: తూము బుచ్చిరెడ్డి,గురిజా రామచంద్రం,ఎస్ కనకాచారి,తిప్పర్తి విజేందర్ రెడ్డి,బొల్లె శైలేష్,కుభం జయ రాములు, దేప సుదర్శన్ రెడ్డి,పోలె వెంకటయ్య,వలమల్ల ఆంజనేయులు, వినయ్ మరియు తదితర పార్టీ, రైతుసంఘం ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బందగీ గారికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.