05/04/2026
పత్రిక ప్రకటన
యలమంచిలి తండా లో లంబాడీల ఆత్మ గౌరవ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
డోర్నకల్ నియోజక వర్గం మరిపెడ మండల మాకుల తండా సమీపం లో ఉన్న మాకుల క్షేత్రం లో ఏప్రిల్ 15 న జరిగే బండ్లు తిరిగే కార్యక్రమ రోజున జరిగే లంబాడీల ఆత్మ గౌరవ సదస్సు పోస్టర్ ను యలమంచిలి తండా సర్పంచ్ బానోతు భద్రు నాయక్ ఆధ్వర్యం లో చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని భావసంగ్ మహారాజ్ పేరును మాకుల క్షేత్రం లో విస్మరించడం తగదు అని తెలిపారు అలాగే మ్యారామా భవానీ పేరు మీద గత సంవత్సరం 2025 ఏప్రిల్ 9 న విగ్రహ ప్రతిష్ట చేసి ఒక ఏడాది కావస్తున్న ఇప్పటి వరకు శిలా ఫలకం ఏర్పాటు చేయకపోవడం శోచనీయం అని గుర్తు చేసారు ఎక్కడ బోర్డు లు కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని తీవ్రముగా తప్పు పట్టారు.
లంబాడీల అనేవాళ్ళు ఉన్న ప్రతి క్షేత్రం లో ఈ రోజు ఇదే తంతు నడుస్తుంది అని దీన్ని లంబాడీల రాజకీయ ప్రతినిధులు చూస్తూ చోద్యం చూస్తున్నారు మీరు జోక్యం చేసుకుంటే తగిన మూల్యం చెల్లిస్తారు అని హెచ్చరించారు.
ఇప్పటికీ అయిన జాతి కోసం,జాతి ఆనవాళ్ల కోసం ప్రత్యేక శ్రద్ధ మీరు చేయించాలి అని ప్రజాప్రతినిధులకు సూచించారు.
ఈ కార్య క్రమం లో లంబాడీల ఐక్య వేదిక డోర్నకల్ నియోజకవర్గ ఇంచార్జీ బానోతు ప్రవీణ్ నాయక్, మరిపెడ మండల నాయకులు రాజేష్ నాయక్, నర్సింహుల పేట మండల అధ్యక్షులు బానోతు రాజేందర్ నాయక్, తండా నాయకులు, తండా విద్యార్థులు పాల్గొన్నారు.