01/06/2026
* సమస్యలను పరిష్కరించాలంటూ బైఠాయించిన మాజీ కార్పొరేటర్ సభ*
అందరికీ నమస్తే,
సమస్యలను అనేక రోజులుగా తీర్చట్లేదంటూ ప్రశ్నించేందుకు మల్కాజ్గిరి జోనల్ ప్రజావాణికి వెళ్లినటువంటి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ కు కాళీ చేర్లు,అరకొరగా ఉన్న అధికారులు కనిపించడంతో ఒక్కసారగా పరిస్థితి తీవ్రంగా మారింది.
కనిపించని అధికారులు, శానిటైజేషన్, స్ట్రీట్ లైట్స్, ఫాగింగ్,గుంతలు పూడిక ఎక్కడ అంటూ లెటర్ ప్యాడ్ ను జోనల్ కమిషనర్ కుర్చీకి అతికించి అక్కడే బైఠాయించారు.
ప్రజావాణిలో జోనల్ కమిషనర్ మాత్రమే కాకుండా హార్టికల్చర్ గాని, శానిటేషన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, స్పోర్ట్స్ కానీ ఏ ఒక్క అధికారి కనిపించకపోవడంతో హోమం చేసి ఆవాహన చేస్తే వస్తారా? అని డిప్యూటీ కమిషనర్
సుల్తానా గారిని నిలదీశారు.
చివరికి హుటాహుటిన జోనల్ కమిషనర్ మరియు ఇతరుల అధికారులు రావడంతో సమస్యలు ఏ కరువు పెట్టారు.
మృగశిర కార్తె వస్తున్నా, తొందరలోనే వర్షాలు పడే అవకాశం ఉన్నా ఇప్పటివరకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు డీసెల్టింగ్ పనులను ఎందుకు చేపట్టడం లేదని అన్నారు.
ఆనంద్ బాగ్ లో మరియు సఫిల్గుడాలో ఇష్టానుసారంగా కరెంటు డిపార్ట్మెంట్ వారు రోడ్డును తవ్వేసిపోతే ఇంజనీరింగ్ వారు మొద్దు నిద్ర ఎందుకు పోతున్నారు అన్నారు.
ఉత్తంనగర్లో గుంతలపడ్డ రోడ్ల వల్ల అనేకమంది పడి ఆక్సిడెంట్ల పాలుతున్న ఎందుకు రోడ్డు వేయట్లేదని నిలదీశారు.
హార్టికల్చర్ అధికారులు కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను వేధిస్తూ పార్కు పనులను ఆలస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.
కనీసం స్ట్రీట్ లైట్లు వేయలేని పరిస్థితిలో మరియు స్ట్రీట్ లైట్ సిబ్బందికి కనీసం 8 వేల జీతాన్ని ఇచ్చేటువంటి స్థితిలో కార్పొరేషన్ లేదా అని అన్నారు.
టౌన్ ప్లానింగ్ అధికారుల అకృత్యాలు రోజుకి పెరిగిపోతున్నాయని, ఒకే ప్లాట్ లో సగం భాగానికి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చి మరో సగభాగం యు ఎల్ సి లో వస్తుందని దరఖాస్తుదారున్ని సతాయిస్తున్నారు అని అన్నారు.
శివపురి కాలనీలో ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేస్తున్న వ్యక్తికి అది యు ఎల్ సి భూమి అని చెప్పారని రాత్రికి రాత్రి శివపురి కాలనీలో భూములు యు ఎల్ సి గా ఎలా మారాయని అధికారులు చెప్పాలన్నారు.
నేరేడ్మెట్ కమాన్ వద్ద శివాజీ విగ్రహం పెడతామంటే 100 ఫీట్ల రోడ్డు,నిర్మాణం చేపట్టకూడదంటూ బోర్డు పెట్టిన అధికారులు దాని ఎదురుగా కట్టేటువంటి నిర్మాణానికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని అన్నారు.
టౌన్ ప్లానింగ్ అధికారులపై విజిలెన్స్ ఎంక్వైరీ కి ఆదేశించాలని అన్నారు.
సఫిల్గుడాలో టాయిలెట్ల నిర్మాణానికి అనేకసార్లుగా మొత్తుకున్నప్పటికీ సాంకేతిక కారణాలను చూపుతూ వాయిదా ఇస్తున్న అధికారులు కనీసం మొబైల్ టాయిలెట్లను పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇంటమాలజీ సిబ్బంది కాన రావట్లేదని దోమల మందును ఎప్పటి నుంచి ఫాగింగ్ చేస్తారని అన్నారు.
సఫిల్గుడా చెరువులో గుర్రపు డెక్క తీసివేతను వేగవంతం చేయాలన్నారు.
సమ్మర్ ముగుస్తున్న సమ్మర్ క్యాంపులో జాడలేదని పిల్లలకి ఇవ్వాల్సినటువంటి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని, సమ్మర్ క్యాంపుల్లో కోసుల నియామకం ఎందుకు చేపట్లేదని నిలదీశారు.
సమస్యలపై నిర్దిష్టమైనటువంటి హామీ ఇస్తే తప్ప జరగది లేదంటూ భీష్మించుకుని కూర్చోవడంతో చేసేదిలేక అధికారులు అందరూ వచ్చారు. వారం రోజుల్లో సమస్యలు అన్నిటి పైన నిర్దిష్టమైనటువంటి చర్యలు చేపడతామని జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ హామీ ఇవ్వడంతో శ్రవణ్ నిరసనను విరమించారు.
ఈ కార్యక్రమంలో మురళి గౌడ్,మాధవ్ యాదవ్, సత్తిరెడ్డి శ్యామ్, వాణిశ్రీ,నందు యాదవ్, మల్లేష్,నరసింహ, జోగు వేంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Kishan Reddy GangapuramBandi Sanjay KumarDr K LaxmanSunil BansalEatala RajendarNaraparaju Ramchander Rao
Sravan Vurapalli I@followers