15/08/2026
వర్గీకరణ కోసం జైలుకు వెళ్లిన నిజమైన సామాజిక న్యాయ వాది సాదం వెంకట్ యాదవ్ గారి పాడే మోసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు...
జర్నలిస్ట్ వెంకటేశ్ గా నాలుగు, ఐదు దశాబ్దాల పాటు తెలుగు సమాజానికి పరిచయమున్న సాధం వెంకట్ యాదవ్ గారు పూలే, అంబేడ్కర్ , జగ్జీవన్ రామ్ మార్గంలో తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాడు.
జర్నలిజంలోను అలాగే వ్యక్తిగత జీవితంలోను సైద్ధాంతిక నిబద్ధతను ఏనాడు కోల్పోలేని వ్యక్తి సాధం వెంకట్ యాదవ్ గారు.
బీసీల ఉద్యమంలోనూ అలాగే MRPS ఉద్యమంలోనూ అలాగే దళిత ఉద్యమాలలోనూ, గిరిజన, ఆదివాసి ఉద్యమాలలో ఇంకా సామాజిక న్యాయం జ కోసం జరిగిన ప్రతి ఉద్యమంలో వెంకట్ యాదవ్ గారు అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషించి తన అంకితభావాన్ని అణగారిన వర్గాల సమాజం పట్ల చాటుకున్నాడు.
ముఖ్యంగా ఈ రెండు దశాబ్దాల కాలంలో సాదం వెంకట్ యాదవ్ గారు భాగస్వామ్యం లేని అణగారిన వర్గాల ఉద్యమం అంటూ లేదు.
జర్నలిస్టుగా, మేధావిగా, విశ్లేషకుడిగా , రచయితగా ఉద్యమకారుడిగా, వివిధ పాత్రలు పోషిస్తూ అన్ని సామాజిక ఉద్యమాల్లో కీలక భాగస్వాములైన చరిత్ర వెంకట యాదవ్ గారికి ఉంది.
ముఖ్యంగా తన భాగస్వామ్యం, తన పాత్ర మాటలకు సంఘీభావాన్ని మాత్రమే పరిమితం కాలేదు.అందుకు నిదర్శనమే ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారిని నాటి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తున్న సందర్భంలో అరెస్టును నిరసిస్తున్న క్రమంలో సాధం వెంకట్ యాదవ్ గారు కూడా అరెస్ట్ చేయబడి మందకృష్ణ మాదిగ గారితో పాటు దాదాపు 20 రోజులకు పైగా చంచల్ గూడ జైల్లో జైలు శిక్ష అనుభవించాడు.ఇది సాధం వెంకట్ యాదవ్ గారికి మాదిగల మీద దళితుల మీద సమస్త బీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజల మీద ఉన్న నిజాయితీకి నిబద్ధతకు నిదర్శనం.
ఓవైపు ఆర్ కృష్ణయ్య గారు , జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరొకవైపు మందకృష్ణ మాదిగ గారు , బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్, ఇలా అన్ని సామాజిక ఉద్యమాల అధినేతలతో అత్యంత ఆత్మీయ అనుబంధం కలిగిన ఒకే ఒక వ్యక్తి సాధం వెంకట్ యాదవ్ గారు. సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న నేతలందరూ ఏకమై అణగారిన వర్గాల ప్రజలందరి కోసం రాజకీయ పోరాటాన్ని ప్రారంభించాలని ఆశించాడు.అందుకోసం ఎంతో శ్రమించారు.
సాదం వెంకట్ యాదవ్ గారు జీవితకాలం నిరాడంబరుడిగా జీవించాడు.
ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలై దాదాపు నెల రోజులుగా నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతూ చివరికి నేడు మరణించడం జరిగింది.
వారి మరణం ఎంత బాధాకరం.
సాదం వెంకట్ యాదవ్ గారి మృతి అనగారిన వర్గాల సమాజానికి తీరని లోటు.
సాదం వెంకట్ యాదవ్ గారికి సామాజిక ఉద్యమ జోహార్లు కన్నీటి నివాళులు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.
సాదం వెంకట్ యాదవ్ గారి మరణించిన సందర్భంగా వారి నివాసానికి వెళ్లి మందకృష్ణ మాదిగ గారు పూలమాలవేసి నివాళులర్పించారు సాధం వెంకట్ యాదవ్ గారి పాడే మోసి అంతక్రియల్లో పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ గారితో పాటు ఎమ్మార్పీఎస్ మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి -( MRPS)