Warangal Police Commissionerate

Warangal Police Commissionerate Warangal Police Commissionerate
(1)

పొలీస్ మరియు ప్రజల బాగస్వామ్యం తో కలసి ఈ రోజు సంఘమిత్ర కార్యక్రమం వరంగల్ జిల్లాలో ఘనంగా ప్రారంభం.ఈ రోజు సంఘమిత్ర కార్యక్...
05/09/2026

పొలీస్ మరియు ప్రజల బాగస్వామ్యం తో కలసి ఈ రోజు సంఘమిత్ర కార్యక్రమం వరంగల్ జిల్లాలో ఘనంగా ప్రారంభం.

ఈ రోజు సంఘమిత్ర కార్యక్రమం లో భాగంగా మొదటగా డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వయం సహాయ గ్రూపులకు చెందిన మహిళా సంఘాలలు ) గ్రామ దీపికలు (VOA), మెప్మా భాగస్వామ్యంతో డ్రగ్స్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పోలీసు శాఖ మరియు ప్రజల భాగస్వామ్యంతో డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు.

వరంగల్ లో“సంఘమిత్ర” కార్యక్రమం ద్వారా డ్రగ్స్‌ అంశంపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాము. SHG, VOA సంఘాల్లోని ప్రతి సభ్యురాలు ఈ కార్యక్రమంలో భాగస్వామిగా నిలిచి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతి అంశంపై అవగాహన సందేశాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. పోలీసులు–ప్రజల భాగస్వామ్యంతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, వరంగల్ జిల్లాను మరింత సురక్షితమైన జిల్లాగా తీర్చిదిద్దడంలో సంఘమిత్ర ఒక బలమైన వారధిగా నిలవాలి.

SHG, వాలంటీర్స్, మెప్మా సభ్యుల ద్వారా 1.17 లక్షల మంది సభ్యులకు డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన డ్రగ్స్‌, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువత, మహిళలు మరియు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు “సంఘమిత్ర” కార్యక్రమాన్ని శనివారం హన్మకొండ లోని కాళోజి కళా క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. SHG గ్రూపులు 1,000 మెప్మా సభ్యుల ద్వారా 1.17 లక్షల మంది సభ్యులకు డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన కల్పిస్తూ, వారి ద్వారా జిల్లాలోని ప్రతి కుటుంబానికి డ్రగ్స్‌ వ్యతిరేక సందేశాన్ని చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
“జనగామ జిల్లాలో మొదటిసారిగా ‘సంఘమిత్ర’ కార్యక్రమం నిర్వహించండింది. నేడు వరంగల్ జిల్లాలో నిర్వహించడంతో పాటు మరికొద్ది రోజుల్లో హన్మకొండ జిల్లాలో సైతం మత్తు పదార్థాలు వ్యతిరేకంగా విస్తృతంగా సంఘ మిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. SHG, వాలంటీర్స్, మెప్మా గ్రూపు సభ్యులు తలచుకుంటే గంజాయి నిర్మూలన సాధ్యమవుతుంది. ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన కల్పించడంలో మహిళా సంఘాల సభ్యులు కీలక పాత్ర పోషించాలి.ప్రతి తల్లి తన బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించి, తన బిడ్డ డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా చూడాలి. పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వారితో మాట్లాడాలి. ప్రతి తల్లి బాధ్యత తీసుకుంటే గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలన తప్పకుండా సాధ్యమవుతుంది.డ్రగ్స్‌, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం, విక్రయం, సరఫరాకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసిన వెంటనే పోలీస్ శాఖకు తెలియజేయాలి. ఎలాంటి భయం లేకుండా సమాచారాన్ని పోలీసులకు అందించండి. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం. విలువైన సమాచారం అందించిన వారికి తగిన రివార్డు కూడా అందజేస్తాం.ప్రతి గ్రామ సమైక్య సభ్యురాలు ఒక *‘సంఘమిత్ర’*గా పనిచేసి, తన పరిధిలోని ప్రతి కుటుంబానికి డ్రగ్స్‌ వ్యతిరేక సందేశాన్ని చేరవేయాలి. మీ ద్వారా 1.17 లక్షల మంది సభ్యులకు, వారి ద్వారా ప్రతి కుటుంబానికి ఈ సందేశం చేరాలి.డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిని దూరం చేయకుండా, వారికి కౌన్సెలింగ్‌, వైద్య సహాయం మరియు కుటుంబ సహకారం అందేలా చూడాలి. సరైన సమయంలో సహాయం అందిస్తే వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావచ్చు.

మన యువతను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలి. డ్రగ్స్‌కు NO చెప్పండి – జీవితానికి YES చెప్పండి.డ్రగ్స్‌ నిర్మూలన లక్ష్యంగా, ప్రతి కుటుంబానికి డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన సందేశాన్ని చేరవేయాలనే ఉద్దేశంతోనే ‘సంఘమిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ భాగస్వాములై పోలీస్ శాఖకు సహకరించాలి”.

వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఐఏఎస్ మాట్లాడుతూ:
“డ్రగ్స్‌ సమస్య కేవలం పోలీస్ శాఖకు సంబంధించిన అంశం కాదు. ఇది మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య. అందరం కలిసికట్టుగా దీనిని ఎదుర్కోవాలి.యువతను సన్మార్గంలో నడిపించడంలో తల్లిదండ్రులు, కుటుంబాలు, విద్యాసంస్థలు మరియు గ్రామ సమైక్య సంఘాలు కీలక పాత్ర పోషించాలి.ప్రతి కుటుంబంలో డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలి. యువతను మంచి మార్గంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి

ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ:
“సంఘమిత్ర కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి SHG సభ్యుడు తన గ్రామంలో డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన కల్పిస్తూ ఒక సైనికుడిగా పనిచేయాలి.ప్రతి కుటుంబంతో మాట్లాడి డ్రగ్స్‌, గంజాయి వల్ల కలిగే ప్రమాదాలను వివరించాలి. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారికి సరైన మార్గదర్శనం చేయాలి.డ్రగ్స్‌ విక్రయం, సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలి. ప్రజల సహకారంతో డ్రగ్స్‌ నిర్మూలనకు సమిష్టిగా కృషి చేద్దామన్నారు”

డ్రగ్స్‌ వ్యసనం నుంచి బయటపడిన వ్యక్తి సందేశం:
కార్యక్రమంలో గతంలో డ్రగ్స్‌కు బానిసై, అనంతరం వాటిని పూర్తిగా వదిలి సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చిన వ్యక్తి తన అనుభవాలను పంచుకున్నారు.“డ్రగ్స్‌ నాకు కొన్ని గంటల మత్తును ఇచ్చాయి… కానీ నా కుటుంబానికి ఎన్నో రోజుల కన్నీళ్లను ఇచ్చాయి. ఏ యువకుడూ నా పరిస్థితికి రావద్దు. డ్రగ్స్‌ను ఒక్కసారి కూడా ప్రయత్నించవద్దు”

డ్రగ్స్‌ అవేర్‌నెస్ స్కిట్:
డ్రగ్స్‌ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యార్థినులు ప్రత్యేకంగా డ్రగ్స్‌ అవేర్‌నెస్ స్కిట్ ప్రదర్శించారు. యువత, కుటుంబాలు డ్రగ్స్‌ కారణంగా ఎదుర్కొనే సమస్యలను ప్రదర్శన ద్వారా వివరించారు.

ప్రత్యేక వీడియోల ద్వారా అవగాహన:
కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రసంగాల వీడియోలు, గౌరవ DGP గారి సందేశాల వీడియోలు, తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (TG NAB) డైరెక్టర్ గారి అవగాహన వీడియోలు మరియు ఇతర ప్రముఖుల డ్రగ్స్‌ వ్యతిరేక సందేశాల వీడియోలను ప్రదర్శించారు.వీటి ద్వారా డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్థాలు, యువతపై వాటి ప్రభావం మరియు డ్రగ్స్‌ నిర్మూలనలో ప్రతి ఒక్కరి బాధ్యతపై అవగాహన కలిపించాము.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, అడిషనల్ కలెక్టర్ వై. వి. గణేష్, ఐ.ఏ.ఎస్, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, పిడి డిఆర్డీఓ నాగ పద్మజ, జిల్లా వైద్యాధికారి రాజిరెడ్డి, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, మామూనూర్ ఏసీపీ వెంకటేష్, గీసుగొండ ఇన్స్ స్పెక్టర్ విశ్వేశ్వర్, సైకియాట్రిస్ట్ డాక్టర్ భరత్, జిల్లా సమైక్య సంఘం అధ్యక్షురాలు శ్రీమతి రజిత, టిఎల్ ఎఫ్ అధ్యక్షురాలు పద్మ తో పాటు వెయ్యి కి పై వివిధ మహిళ సంఘాల సభ్యులు SIలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

“ప్రతి తల్లి చైతన్యవంతమైతే – ప్రతి కుటుంబం సురక్షితం.”
“ప్రతి కుటుంబం చైతన్యవంతమైతే – డ్రగ్స్‌ రహిత సమాజం సాధ్యమే.”
అనే సందేశంతో సంఘమిత్ర కార్యక్రమాన్ని వరంగల్ లో ఘనంగా ప్రారంభించాము.

ఎన్. శ్వేత, ఐపిఎస్
వరంగల్ పోలీస్ కమిషనర్

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆధునికీకరించిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ATF) కేంద్రం ప్రారంభంమత్తు పదార్థాలకు బానిసలై తమ ...
03/09/2026

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆధునికీకరించిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ATF) కేంద్రం ప్రారంభం

మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్న యువతను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నూతనంగా ఆధునికీకరించిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ATF) కేంద్రాన్ని ఈగల్ ఫోర్స్ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది.

మద్యం, పొగాకు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వ్యసనం నేడు యువతతో పాటు వారి కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ప్రధాన సామాజిక సమస్యగా మారింది.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ మరియు విక్రయాలపై డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో, మత్తు పదార్థాలకు బానిసలైన యువతను శిక్షించడం మాత్రమే కాకుండా, వారిని వ్యసన విముక్తులను చేసి తిరిగి ఆరోగ్యకరమైన జీవితంలోకి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, జి.ఓ. ఎం.ఎస్. నెం. 4, తేదీ 10-02-2026 ప్రకారం ఎంజీఎం ఆసుపత్రిలో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఏర్పాటు చేయబడింది. వరంగల్ పోలీస్ కమిషనర్ చొరవతో, ఎంజీఎం ఆసుపత్రి అధికారులు మరియు సిబ్బంది సహకారంతో ఈ కేంద్రాన్ని మరింత ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు.

కేంద్రంలో ప్రత్యేక ATF వార్డు ఏర్పాటు చేసి, పడకల సామర్థ్యాన్ని 10 నుంచి 20 పడకలకు పెంచారు. రోగుల భద్రత కోసం ఇనుప గ్రిల్స్, సీసీటీవీ నిఘా, పరిశుభ్రమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. బాధితుల మానసిక ప్రశాంతత కోసం క్యారమ్ బోర్డు, చెస్ వంటి వినోద సౌకర్యాలను కూడా కల్పించారు.

అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో బాధితులకు వైద్య చికిత్స, కౌన్సెలింగ్ మరియు అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ATF) సేవలు అందించబడతాయి. మత్తుకు బానిసైన యువతను తిరిగి సాధారణ, ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.

తమ పిల్లలు లేదా కుటుంబ సభ్యులు మత్తు పదార్థాలకు బానిసలైనట్లు గుర్తించిన తల్లిదండ్రులు ఆ సమస్యను దాచిపెట్టకుండా వెంటనే సహాయం పొందాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ విజ్ఞప్తి చేస్తోంది. సరైన సమయంలో చికిత్స, కౌన్సెలింగ్ మరియు కుటుంబ సభ్యుల సహకారం ద్వారా మత్తు పదార్థాల వ్యసనం నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది.

డీ-అడిక్షన్ చికిత్స అవసరమైన వారు ఎంజీఎం ఆసుపత్రిలోని ఈ కేంద్రాన్ని సంప్రదించి అవసరమైన సేవలను పొందవచ్చు. అవసరమైన సహాయం కోసం సమీప పోలీస్ స్టేషన్ అధికారులను లేదా ఎంజీఎం మానసిక వైద్య సిబ్బందిని కూడా సంప్రదించవచ్చు.

“మత్తును వదిలి – జీవితాన్ని ఎంచుకోండి.”
“వ్యసనాన్ని దాచకండి – సహాయం పొందండి.”
“చికిత్స ఒక జీవితాన్ని మార్చగలదు.”

మత్తు పదార్థాల వ్యసనానికి సంబంధించిన ఏదైనా సహాయం, సమాచారం లేదా మార్గదర్శకత్వం కోసం 87125 84473 / 87126 85299 నంబర్లను సంప్రదించండి.

ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఎస్‌బీ ఎంజీఎం సూపరింటెండెంట్ డా. రాంరెడ్డి, ఆర్‌ఎంఓ అశ్వని కుమార్, ఎస్‌బీ ఇన్‌చార్జ్ ఏసీపీ మధుసూదన్, డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ సాయిరాం, ఆర్‌ఐ శివ కేశవులు, ఈగల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, ఈగల్ టీమ్ ఎస్‌ఐ శ్రీకాంత్, ఆర్‌ఎస్‌ఐలు పూర్ణ చందర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, నాగరాజు, పోలీస్ మరియు ఎంజీఎం ఆసుపత్రి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్. శ్వేత, ఐపీఎస్
వరంగల్ పోలీస్ కమిషనర్

పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించిన సీపీహన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో క్యాటరింగ్ కాంట్రాక్టర్ పేరుతో హాస్టల్ యజమా...
26/08/2026

పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించిన సీపీ

హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో క్యాటరింగ్ కాంట్రాక్టర్ పేరుతో హాస్టల్ యజమానులను మోసం చేసి లక్షల రూపాయలను కాజేసిన నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన హన్మకొండ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, ఏఏఓ సల్మాన్ పాషా, కానిస్టేబుళ్లు కిరణ్‌కుమార్, రమణకుమార్, రవి, మహిళా కానిస్టేబుల్ కారుణ్య, హోంగార్డ్ రవిని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్., సీపీ కార్యాలయంలో అభినందించారు.

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి శాఖాపరమైన గుర్తింపు ఉంటుందని సీపీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, హన్మకొండ ఏసీపీ నర్సింహారావు పాల్గొన్నారు.

మహిళా సంఘాలే మాదకద్రవ్య రహిత సమాజానికి ‘సంఘమిత్రలు’మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి మహిళ భాగస్వామి కావాలి112కు సమాచారం ఇవ్వ...
26/08/2026

మహిళా సంఘాలే మాదకద్రవ్య రహిత సమాజానికి ‘సంఘమిత్రలు’

మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి మహిళ భాగస్వామి కావాలి

112కు సమాచారం ఇవ్వండి.. యువత భవిష్యత్తును కాపాడండి: వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత

జనగామను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి మహిళ తన కుటుంబంతో పాటు గ్రామాలు, పట్టణాలను కూడా మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడే ‘సంఘమిత్ర’గా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు.

బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ‘సంఘమిత్ర – మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు’ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌లతో కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. గర్భిణీలకు పోషకాహారం అందించడం నుంచి చిన్నారులకు మధ్యాహ్న భోజనం, అక్షరాస్యత, కుటుంబ సంక్షేమం, సామాజిక ఆడిట్ వంటి అనేక కార్యక్రమాల్లో మహిళలు ముందుండి పనిచేస్తున్నారని తెలిపారు.

జనగామ జిల్లాలో మహిళల చైతన్యం ప్రత్యేకమైనదని పేర్కొంటూ, ఆ చైతన్యాన్ని సమాజ భద్రత కోసం వినియోగించాలని కోరారు. కమిషనరేట్ పరిధిలో సుమారు 26 లక్షల జనాభాకు కేవలం 3 వేల మంది పోలీసు సిబ్బంది మాత్రమే ఉన్నారని, అందువల్ల మహిళా సంఘాల సహకారం అత్యంత అవసరమని వివరించారు.

పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ వ్యసనం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడే సమిష్టిగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

యువతే రాష్ట్ర భవిష్యత్తు అని, వారిని కాపాడటం ప్రతి కుటుంబం, ప్రతి మహిళా సంఘం బాధ్యత అని స్పష్టం చేశారు.

గంజాయి వంటి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు వెంటనే కనిపించకపోయినా, కొంతకాలానికి మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. డ్రగ్స్‌కు బానిసైన వారిని నేరస్తులుగా చూడటం సరికాదని, వారికి చికిత్స అందించి తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు.

మహిళా సంఘాలు సామాజిక మార్పుకు బలమైన వేదికలుగా ఉన్నాయని, పోలీస్ శాఖలో పరిమిత సంఖ్యలో సిబ్బంది ఉన్నప్పటికీ మహిళా సంఘాల ద్వారా లక్షలాది మందికి అవగాహన కల్పించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి మహిళా సంఘ సమావేశంలో డ్రగ్స్, సైబర్ నేరాలు, మహిళల భద్రత వంటి అంశాలపై తప్పనిసరిగా చర్చించాలని సూచించారు.

గ్రామాల్లో ఎవరైనా మాదకద్రవ్యాలకు బానిసైనట్లు తెలిసినా, గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉన్నా వెంటనే 112కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు, అవసరమైతే బహుమతులు కూడా అందజేస్తామని వెల్లడించారు.

పాఠశాల నిర్వహణ కమిటీల్లో ఉన్న మహిళా సభ్యులు విద్యార్థుల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పదో తరగతి లేదా ఇతర తరగతుల విద్యార్థులు అకస్మాత్తుగా పాఠశాలకు రాకపోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, అనుమానాస్పదంగా ప్రవర్తించడం వంటి అంశాలను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

‘సంఘమిత్ర’ కార్యక్రమం ఒకరోజు కార్యక్రమంతో ముగిసేది కాదని, ఇకపై మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యల సమావేశాల్లో పోలీసు అధికారులు క్రమం తప్పకుండా పాల్గొని డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనకు మహిళా సంఘాలే ప్రధాన శక్తిగా నిలవాలన్నారు. జిల్లాలో సుమారు 1.25 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని, వీరి ద్వారా ప్రతి ఇంటికి డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని తీసుకెళ్లవచ్చని చెప్పారు.

డ్రగ్స్ వల్ల వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాకుండా కుటుంబాల్లో గృహహింస, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామ మహిళా సంఘాలు, సంఘ సమాఖ్యలు, కాలనీ సమావేశాల్లో చర్చించి, యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు కృషి చేయాలని సూచించారు.

జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ, జనగామ జిల్లా మహిళా సంఘాలు రాష్ట్రంలోనే అత్యంత చైతన్యవంతమైన సంఘాలుగా గుర్తింపు పొందాయన్నారు.

డ్రగ్స్ మొదట సరదాగా ప్రారంభమై చివరకు ప్రాణాంతక వ్యసనంగా మారుతాయని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులు, ఆలస్యంగా ఇంటికి రావడం, రాత్రిళ్లు మేల్కొని ఉండడం, కొత్త స్నేహాలు, చేతులపై ఇంజెక్షన్ గుర్తులు, పెదాలు నల్లబడటం వంటి లక్షణాలను గమనించాలని సూచించారు. సమస్యను దాచిపెట్టకుండా వెంటనే పోలీసులకు లేదా డీ-అడిక్షన్ కేంద్రాలకు సమాచారం ఇవ్వాలని కోరారు.

మాదకద్రవ్యాల నియంత్రణకు అమలులో ఉన్న ఎన్‌డీపీఎస్ చట్టం–1985 ప్రకారం గంజాయి సేవించడం, విక్రయించడం, రవాణా చేయడం, దాచిపెట్టడం వంటి నేరాలకు కఠిన జైలు శిక్షలు, భారీ జరిమానాలు ఉంటాయని వివరించారు. డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సదస్సులో సైకాలజిస్ట్ డా. విజయక్రాంతి మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక దుష్ప్రభావాలు, చికిత్స, పునరావాసంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

అలాగే డ్రగ్స్ వ్యసనం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులు, పోలీస్ జాగృతి కళాబృందం సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికల రూపంలో హృద్యంగా ప్రదర్శించి సందేశాన్ని అందించారు.

అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనపై, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీలు భీం శర్మ, నర్సయ్య, ఏపీడీ నూరుద్దీన్, ఇన్‌స్పెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వేణు, జానకీరాం రెడ్డి, సతీష్, చాకలి ఐలమ్మ సమాఖ్య నాయకురాలు మమతతో పాటు ఇతర పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టుల పేరుతో హాస్టల్ యజమానులను మోసం చేస్తున్న నిందితుడి అరెస్ట్రూ.36.99 లక్షల మోసాలు వెలుగులోకి ...
25/08/2026

నకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టుల పేరుతో హాస్టల్ యజమానులను మోసం చేస్తున్న నిందితుడి అరెస్ట్

రూ.36.99 లక్షల మోసాలు వెలుగులోకి – 23 కేసులు, 6 సైబర్ ఫిర్యాదుల్లో నిందితుడి ప్రమేయం గుర్తింపు – రూ.13.09 లక్షలు హోల్డ్
వరంగల్, ఆగస్టు 25, 2026:
నకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టులు, ఆహార సరఫరా అవకాశాల పేరుతో హాస్టల్ యజమానులను మోసం చేస్తున్న అంతర్‌జిల్లా సైబర్ మోసగాడిని హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రముఖ ఐటీ కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకుని, కంపెనీ ఉద్యోగులకు ఆహారం సరఫరా చేసే క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో నమోదైన Cr.No.461/2025, U/s 318(4) BNS, Sec.66-D IT Act కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేయగా, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు మోసపూరిత కేసుల్లో అతని ప్రమేయం బయటపడింది.
నిందితుడి నేర విధానం
నిందితుడు హాస్టల్ బోర్డులపై ఉన్న మొబైల్ నంబర్లను సేకరించి, వివిధ నంబర్ల ద్వారా హాస్టల్ యజమానులను సంప్రదించేవాడు. తాను ప్రముఖ కంపెనీ ఉద్యోగినని లేదా ప్రతినిధినని పరిచయం చేసుకుని, ఆ కంపెనీ ఉద్యోగులకు ఆహారం సరఫరా చేసేందుకు క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించేవాడు.
అనంతరం అగ్రిమెంట్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, క్యాటరింగ్ సామగ్రి కొనుగోలు, ఇతర ఖర్చుల పేరుతో బాధితుల నుంచి డబ్బులు బ్యాంకు ఖాతాలు లేదా UPI ఖాతాలకు బదిలీ చేయించుకునేవాడు. డబ్బులు అందుకున్న తర్వాత మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా నంబర్ మార్చడం ద్వారా బాధితులకు అందుబాటులో లేకుండా పోయేవాడు.
కొన్ని సందర్భాల్లో ఇతరుల UPI ఖాతాలను ఉపయోగించి, అవి కంపెనీ సిబ్బందికి సంబంధించిన ఖాతాలని తప్పుడు సమాచారం ఇచ్చి డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. వసూలు చేసిన డబ్బులో కొంత మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంతో పాటు, కొంత మొత్తాన్ని ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు.
పలు జిల్లాల్లో కేసులు
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 10 కేసుల్లో నిందితుడి ప్రమేయం గుర్తించబడింది. అదేవిధంగా ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో మరో 7 కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఇప్పటివరకు నమోదైన కేసుల్లో మొత్తం రూ.33,33,950/- నష్టం జరిగినట్లు గుర్తించగా, రూ.12,40,657/- మొత్తాన్ని హోల్డ్ చేశారు. అదనంగా FIRలు నమోదు కాకుండా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో నమోదైన మరో 6 ఫిర్యాదుల్లో రూ.3,65,050/- నష్టం జరిగినట్లు గుర్తించారు. వాటిలో రూ.68,430/- హోల్డ్ చేయబడింది.
అన్ని కేసులు, సైబర్ ఫిర్యాదులను కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.36,99,000/- నష్టం జరిగినట్లు గుర్తించగా, రూ.13,09,087/- మొత్తాన్ని హోల్డ్ చేయడంలో పోలీసులు సఫలమయ్యారు.
నిందితుడి వివరాలు
మహమ్మద్ షబ్బీర్ @ కిరణ్ కుమార్ @ శ్రీకాంత్ రెడ్డి @ నర్సింహారెడ్డి, వయస్సు 44 సంవత్సరాలు, సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లక్‌పల్లి గ్రామానికి చెందిన ఇతను ప్రస్తుతం హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ రామ్‌రెడ్డి నగర్‌లో నివసిస్తున్నాడు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు
నిందితుడి వద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లు, 3 సిమ్ కార్డులు, 2 బ్యాంకు పాస్‌బుక్స్, 1 చెక్‌బుక్, 2 ATM కార్డులు, 1 డైరీ తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తు బృందం
కేసును హన్మకొండ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా దర్యాప్తు చేశారు. దర్యాప్తులో M. కిరణ్ కుమార్, PC-1229; K. రమణకర్, PC-1413; D. రవి, HG-701; D. కారుణ్య, WPC-3272; MD. సల్మాన్ పాషా తదితరులు కీలకంగా పనిచేశారు.
ప్రజలకు పోలీసుల సూచనలు
క్యాటరింగ్ కాంట్రాక్టులు, ఉద్యోగ అవకాశాలు లేదా వ్యాపార అవకాశాల పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. కంపెనీ పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే, సంబంధిత కంపెనీ అధికారిక ఫోన్ నంబర్లు లేదా అధికారిక వనరుల ద్వారా స్వతంత్రంగా వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి.
అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్, అడ్వాన్స్, సామగ్రి కొనుగోలు వంటి పేర్లతో తెలియని వ్యక్తులు సూచించిన బ్యాంకు ఖాతాలు లేదా UPIలకు డబ్బులు బదిలీ చేయకూడదు. OTP, PIN, పాస్‌వర్డ్, బ్యాంకు వివరాలు వంటి రహస్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దు.
ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి, సంబంధిత లావాదేవీల వివరాలు, మొబైల్ నంబర్లు, సందేశాలు, చెల్లింపు రసీదులు తదితర ఆధారాలను భద్రపరచుకోవాలి. అలాగే National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రజలకు సూచించింది.
పోలీస్ కమిషనరేట్, వరంగల్

వెస్ట్ జోన్ డీసీపీకి అభినందనలు తెలిపిన వరంగల్ సీపీఐపిఎస్ హోదా వచ్చిన వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మంగళవారం వరంగల్...
25/08/2026

వెస్ట్ జోన్ డీసీపీకి అభినందనలు తెలిపిన వరంగల్ సీపీ

ఐపిఎస్ హోదా వచ్చిన వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపిఎస్ మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ఐపిఎస్ హోదా పోందిన డీసీపీ రాజ మహేంద్రనాయక్ ను అభినందించారు.

అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను అరెస్టు చేసిన దామెర పోలీసులుసుమారు రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర ...
25/08/2026

అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను అరెస్టు చేసిన దామెర పోలీసులు

సుమారు రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, రూ.9,000 నగదు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా వారి భవిష్యత్తును కాపాడడంతో పాటు, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

ఇందులో భాగంగా ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఆధ్వర్యంలో దామెర పోలీసులు అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, గంజాయి కొనుగోలు, విక్రయాలకు సంబంధించి కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ముదిగొండ నాగేశ్వర్ రావు, వయస్సు 55 సంవత్సరాలు, పులుకుర్తి గ్రామం, దామెర మండలం, హనుమకొండ జిల్లా. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తనకున్న నెట్‌వర్క్ ద్వారా ఒడిశా రాష్ట్రానికి చెందిన రమేష్, సుధాకర్ వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉర్దు, రాందాస్ శేషరావు బీరదార్, అక్లీం, షారుఖ్ ఖాన్, షేక్ అక్బర్, నునావత్ రాజు తదితరుల ద్వారా అధిక ధరకు విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతని ఇంటి నుంచి సుమారు రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఒక ద్విచక్ర వాహనం, రూ.9,000 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడు నాగేశ్వర్ రావు నుంచి గంజాయి కొనుగోలు చేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

మత్తు పదార్థాల అక్రమ రవాణాతో పాటు వాటి వినియోగంపై తెలంగాణ పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటంతో పాటు, మత్తు పదార్థాల విక్రయదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాము. మత్తు పదార్థాల నియంత్రణకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నాము. ఎవరైనా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నా, వినియోగిస్తున్నా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము.

గంజాయి స్మగ్లర్‌ను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పరకాల ఏసీపీ సతీష్ బాబు, శాయంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఆత్మకూర్ ఇన్‌స్పెక్టర్ సంతోష్, దామెర ఎస్‌ఐ వీరభద్రరావు, శాయంపేట ఎస్‌ఐ పరమేశ్వర్, పరకాల ఎస్‌ఐ రఘుపతి, ఏఏఓ సల్మాన్ పాషా, దామెర, శాయంపేట పోలీస్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

-వరంగల్ పోలీస్ కమిషనర్.

నేరాల నియంత్రణలో వ్యాపారస్తులు భాగస్వాములు కావాలి- వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్.నేరాల నియంత్రణలో వ్యాపారస్తు...
21/08/2026

నేరాల నియంత్రణలో వ్యాపారస్తులు భాగస్వాములు కావాలి
- వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్.

నేరాల నియంత్రణలో వ్యాపారస్తులు భాగస్వాములు కావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సూచించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతపై సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో నగరానికి చెందిన వ్యాపారస్తులకు శుక్రవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ప్రధాన రహదారుల వెంట వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలకు భద్రత కల్పించడం పోలీసుల ప్రధాన కర్తవ్యమని, అయితే ఇంతమంది ప్రజలకు వ్యక్తిగత భద్రత కల్పించడం కష్టసాధ్యమని అన్నారు. నేరాల నియంత్రణలో పోలీసులు తమ వంతు కృషి చేస్తూనే ఉంటారని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరిస్తే సమాజంలో ప్రజలకు మరింత మెరుగైన భద్రత కల్పించడం సాధ్యమవుతుందని తెలిపారు.

ఇందులో భాగంగా ప్రతి వ్యాపారస్తుడు రోడ్డుపై జరిగే కార్యకలాపాలు స్పష్టంగా కనిపించే విధంగా నాణ్యమైన ఒకటి లేదా రెండు సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కనీసం 30 రోజుల బ్యాకప్ ఉండేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. వ్యాపారస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు పరోక్షంగా భద్రత కల్పించిన వారవుతారని అన్నారు.

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని, ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా ప్రతి వ్యాపారస్తుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. సీసీ కెమెరాల నిఘా ఉందని తెలిస్తే నేరస్తులు నేరాలకు పాల్పడేందుకు భయపడతారని తెలిపారు.

అలాగే ప్రధాన రహదారులపై వ్యాపారాలు నిర్వహించే వ్యాపారస్తులు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను త్వరితగతిన ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ విధంగా క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాహ్‌వీర్’ పథకం కింద కలెక్టర్ చేతుల మీదుగా రూ.25,000 నగదు పురస్కారం అందజేయనున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఏసీపీలు నర్సింగరావు, సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

మడికొండ పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన సీపీమడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత...
21/08/2026

మడికొండ పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన సీపీ

మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ శుక్రవారం సందర్శించారు. ఉదయం శిక్షణ కేంద్రానికి చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు శిక్షణ కేంద్రం అధికారులు మొక్కను అందజేసి స్వాగతం పలికారు.

అనంతరం పోలీస్ కమిషనర్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. వివిధ అంశాలపై శిక్షణ పొందేందుకు వచ్చే పోలీస్ అధికారులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, తరగతి గదులను పరిశీలించి, కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరుపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ రమణ బాబు, ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఆర్‌ఐ సింహాచలం శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఐ రవితేజతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మడికొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన పోలీస్ కమిషనర్సెంట్రల్ జోన్ పరిధిలోని మడికొండ పోలీస్ స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిష...
21/08/2026

మడికొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన పోలీస్ కమిషనర్

సెంట్రల్ జోన్ పరిధిలోని మడికొండ పోలీస్ స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్, శుక్రవారం సందర్శించారు. ఉదయం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ పూల మొక్కను అందజేశారు.

అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు, స్టేషన్‌కు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో తరచుగా అధిక సంఖ్యలో నమోదవుతున్న నేరాలు, పరిధిలోని గ్రామాలు, ఆయా గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులు, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలపై స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వేణును అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు తప్పనిసరిగా రశీదు అందజేయాలని, ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్‌లో ఎక్కువసేపు వేచి ఉండే పరిస్థితి రాకుండా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

Address

Hanumakonda
506001

Telephone

+918702567107

Website

Alerts

Be the first to know and let us send you an email when Warangal Police Commissionerate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Warangal Police Commissionerate:

Shortcuts

Share